Political News

నిజంగానే మోడికి జగన్ భయపడుతున్నాడా ?

దేశంలో రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ఎవరైనా ఒకనేత ఓ విషయంపై తన అభిప్రాయాన్ని చెప్పగానే వెంటనే దాన్ని ఖండిస్తునో లేదా ఆ ఖండనలకు వ్యతిరేకంగానో వెంటనే ట్వీట్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడింతా ఎందుకంటే నరేంద్రమోడి కేంద్రంగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్-జగన్మోహన్ రెడ్డి-ఒడిస్సా ఎంపి సప్తగిరి ఉలాకా మధ్య జరుగుతున్న ట్వీట్లయుద్ధం మొదలైంది కాబట్టే.

ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వైరస్ నియంత్రణపై ప్రధానమంత్రి నరేంద్రమోడి ఏపి, తెలంగాణా, జార్ఖండ్, ఒడిస్సా, పాండిచ్చేరి, జమ్మూ-కాశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ తో ముఖ్యమంత్రులతో ఫోన్ లో సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మోడి తన మనసులోని మాటలను వివరించారు. నిజానికి సమావేశంలో పెద్దగా చెప్పుకోదగ్గ విశేషాలు లేవని సమాచారం. ఎందుకంటే కరోనా నియంత్రణపై సీఎంల అభిప్రాయాలకు మోడి పెద్దగా విలువివ్వలేదట.

ఇదే విషయమై హేమంత్ ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. తన మనసులోని మాటను మాత్రమే చెప్పారని, దానికిబదులు పనికొచ్చే మాటలు చెప్పి, పనికొచ్చేమాటలను వినుంటే బాగుండేదని సోరేన్ ట్వీట్ చేశారు. వెంటనే ఈ ట్వీట్ కు జగన్ నుండి కౌంటర్ పడింది. మనమధ్య ఎన్ని విభేదాలున్నా ఇలాంటి సమయంలో రాజకీయాలు తగదంటు జగన్ ఖండించారు. విమర్శలకన్నా ప్రధానికి అండగా నిలవాల్సిన సమయమిది అంటు జగన్ స్పష్టంచేశారు. వెంటనే జగన్ కౌంటర్ పై ఒడిస్సా కాంగ్రెస్ ఎంపి ఉలూకా నుండి గట్టిగా మరో కౌంటర్ వచ్చింది.

ఉలూకా మాట్లాడుతు ఈడీ, సీబీఐ కేసులకు జగన్ భయపడే మోడికి మద్దతుగా నిలబడ్డారా అంటు ఎద్దేవాచేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ ప్రధానితో లాలూచీపడ్డారా అంటూ అనుమానించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి పెద్ద నాయకుడి కొడుకై ఉండి ఇలా లాలూచీపడటం తగదని హితవు పలికారు. మొత్తానికి ఈ ట్వీట్లు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి.

నిజానికి మోడిపై జార్ఖండ్ సీఎం ట్వీట్ ను వ్యతిరేకించాల్సిన అవసరం జగన్ కు లేదు. ఎందుకంటే ఇది పూర్తిగా మోడి-సోరేన్ కు మధ్య వ్యవహారం. సోరేన్ ట్వీట్ కు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోడిదే కానీ జగన్ కు ఎంతమాత్రం కాదు. అయినా స్పందించారంటే తెరవెనుక ఏమి జరిగిందో అర్ధం కావటంలేదు. నిజానికి వాళ్ళ వివాదంలో జోక్యం చేసుకునే వ్యక్తికూడా కాదు జగన్. అయినా జోక్యం చేసుకున్నారంటే కేంద్రం స్ధాయిలో ఎవరి కారణంగానో జగన్ ప్రధానికి మద్దతుగా నిలబడ్డారని తెలిసిపోతోంది. మరి ఈ ట్వీట్ల యుద్ధం ఎంతదాకా వెళుతుందో చూడాలి.

This post was last modified on May 8, 2021 12:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

33 minutes ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

35 minutes ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

1 hour ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

3 hours ago

పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని…

3 hours ago

రైటర్ గారు… చేదుగా ఉన్నా నిజమే చెప్పారు

రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago