రాజకీయాల రూపురేఖలు మారిపోయాయి. సందర్భం ఏదైనా సరే.. ఏదో ఒక ట్విస్టు ఇవ్వకపోతే మనసు అస్సలు ఊరుకోని పరిస్థితి. ప్రత్యేక సందర్భాల్లో తెలిపే శుభాకాంక్షల్లోనూ ఏదో ఒక ట్విస్టు ఇవ్వటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. మిగిలిన సమయాల్లో రాజకీయాన్ని చేసే నేతలు.. ప్రత్యేక సందర్భాల్లోనూ అదే తీరును ప్రదర్శించటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇందుకు నిదర్శనంగా వైఎస్ షర్మిల ఉదంతాన్ని చెప్పాలి. ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితం ఆదివారం వెలువడటం తెలిసిందే. ముందుగా ఊహించిన రీతిలోనే టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన షర్మిల.. తనదైన పంచ్ ను కేసీఆర్ కు వేసే ప్రయత్నం చేశారు.
‘ఉధృతంగా ఉన్న కరోనా సెకండ్వేవ్ వ్యాప్తిని సైతం లెక్కచేయకుండా నాగార్జునసాగర్ ఉపఎన్నికలో విజయాన్ని సొంతం చేసుకున్న కేసీఆర్కు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేయటమే ఇందుకు నిదర్శనం. ఇక్కడితో ఆగితే షర్మిల గురించి స్పెషల్ గా చెప్పుకోవాల్సిన పని లేదు. తానుచేసిన ట్వీట్ కు అంతో ఇంతో రాజకీయ ప్రయోజనం లభించాలన్న ధోరణితో ఆమె మరో అంశాన్ని ప్రస్తావించారు. ఇలాంటి ఆనందకరమైన సమయంలో అయినా కరోనాను ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలని తాను కోరుకున్నట్లుగా పేర్కొన్నారు. మొత్తానికి ఏదో విధంగా తన ఎజెండాను తెర మీదకు తీసుకొచ్చేందుకు షర్మిల ప్రయత్నం చేస్తుండటం గమనార్హం.
వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానున్న వారణాసి నుంచి ఇప్పుడప్పుడే అప్డేట్స్ వచ్చేలా లేవు కానీ ఈ ప్రాజెక్టుకు…
దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…