రాజకీయాల రూపురేఖలు మారిపోయాయి. సందర్భం ఏదైనా సరే.. ఏదో ఒక ట్విస్టు ఇవ్వకపోతే మనసు అస్సలు ఊరుకోని పరిస్థితి. ప్రత్యేక సందర్భాల్లో తెలిపే శుభాకాంక్షల్లోనూ ఏదో ఒక ట్విస్టు ఇవ్వటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. మిగిలిన సమయాల్లో రాజకీయాన్ని చేసే నేతలు.. ప్రత్యేక సందర్భాల్లోనూ అదే తీరును ప్రదర్శించటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇందుకు నిదర్శనంగా వైఎస్ షర్మిల ఉదంతాన్ని చెప్పాలి. ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితం ఆదివారం వెలువడటం తెలిసిందే. ముందుగా ఊహించిన రీతిలోనే టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన షర్మిల.. తనదైన పంచ్ ను కేసీఆర్ కు వేసే ప్రయత్నం చేశారు.
‘ఉధృతంగా ఉన్న కరోనా సెకండ్వేవ్ వ్యాప్తిని సైతం లెక్కచేయకుండా నాగార్జునసాగర్ ఉపఎన్నికలో విజయాన్ని సొంతం చేసుకున్న కేసీఆర్కు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేయటమే ఇందుకు నిదర్శనం. ఇక్కడితో ఆగితే షర్మిల గురించి స్పెషల్ గా చెప్పుకోవాల్సిన పని లేదు. తానుచేసిన ట్వీట్ కు అంతో ఇంతో రాజకీయ ప్రయోజనం లభించాలన్న ధోరణితో ఆమె మరో అంశాన్ని ప్రస్తావించారు. ఇలాంటి ఆనందకరమైన సమయంలో అయినా కరోనాను ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలని తాను కోరుకున్నట్లుగా పేర్కొన్నారు. మొత్తానికి ఏదో విధంగా తన ఎజెండాను తెర మీదకు తీసుకొచ్చేందుకు షర్మిల ప్రయత్నం చేస్తుండటం గమనార్హం.
This post was last modified on May 3, 2021 11:29 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…