రాజకీయాల రూపురేఖలు మారిపోయాయి. సందర్భం ఏదైనా సరే.. ఏదో ఒక ట్విస్టు ఇవ్వకపోతే మనసు అస్సలు ఊరుకోని పరిస్థితి. ప్రత్యేక సందర్భాల్లో తెలిపే శుభాకాంక్షల్లోనూ ఏదో ఒక ట్విస్టు ఇవ్వటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. మిగిలిన సమయాల్లో రాజకీయాన్ని చేసే నేతలు.. ప్రత్యేక సందర్భాల్లోనూ అదే తీరును ప్రదర్శించటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇందుకు నిదర్శనంగా వైఎస్ షర్మిల ఉదంతాన్ని చెప్పాలి. ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితం ఆదివారం వెలువడటం తెలిసిందే. ముందుగా ఊహించిన రీతిలోనే టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన షర్మిల.. తనదైన పంచ్ ను కేసీఆర్ కు వేసే ప్రయత్నం చేశారు.
‘ఉధృతంగా ఉన్న కరోనా సెకండ్వేవ్ వ్యాప్తిని సైతం లెక్కచేయకుండా నాగార్జునసాగర్ ఉపఎన్నికలో విజయాన్ని సొంతం చేసుకున్న కేసీఆర్కు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేయటమే ఇందుకు నిదర్శనం. ఇక్కడితో ఆగితే షర్మిల గురించి స్పెషల్ గా చెప్పుకోవాల్సిన పని లేదు. తానుచేసిన ట్వీట్ కు అంతో ఇంతో రాజకీయ ప్రయోజనం లభించాలన్న ధోరణితో ఆమె మరో అంశాన్ని ప్రస్తావించారు. ఇలాంటి ఆనందకరమైన సమయంలో అయినా కరోనాను ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలని తాను కోరుకున్నట్లుగా పేర్కొన్నారు. మొత్తానికి ఏదో విధంగా తన ఎజెండాను తెర మీదకు తీసుకొచ్చేందుకు షర్మిల ప్రయత్నం చేస్తుండటం గమనార్హం.
This post was last modified on May 3, 2021 11:29 am
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…
రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…
నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…