2014 ఎన్నికల ముందు మోడీ ఒక విచిత్రమైన ప్రతిపాదన చేశాడు గుర్తుందా? విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ అంతా పట్టుకొస్తా, ప్రతి ఒక్కరి అక్కౌంట్లో 15 వేలు వేయొచ్చు అలా చేస్తే. బ్లాకాసురుల భరతం పడతా అన్నాడు. ఆ తర్వాత దానికథే మరిచిపోయాడు మోడీ.
బ్లాకాసురుల సంగతి పక్కన పెడితే… మోడీ అందరికీ 15 వేలు అక్కౌంట్లో వేయడానికే 20 లక్షల కోట్లు ప్రకటించాడు అని చెబుతున్నారు. దీనిపై మీమ్స్ కూడా వదుల్తున్నారు జనం. కొందరైతే 20000000000000 (2 పక్కన 13 సున్నాలు) 130 కోట్ల జనాభాతో డివైడిడ్ బై చేసి… అరెరె మనందరి అక్కౌంట్లలో తాను గతంలో చెప్పినట్లు 15 వేలు వేయడానికి సరిగ్గా లెక్కేసుకుని ఈ ప్యాకేజీ ప్రకటించారు అని సెటైర్స్ వేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా రంగాలకు ప్రయోజనం కలిగించేలా ప్యాకేజీ ప్రకటించినా అది ఎవరి చేతుల్లోకి వెళ్తుందో… దానికంటే దేశ ప్రజల ఖాతాలో వేసేయండి మోడీ గారు అని రిక్వెస్టులు పెడుతున్నారు.
మోడీ సర్కారు అలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందంటారు? మీకు హ్యాపీయేనా… కాదా? చెప్పండి మిమ్మల్నే అడిగేది 🙂
This post was last modified on May 13, 2020 5:14 pm
జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…
ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…
మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…
న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…
ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…
తిరుమలపై మరో దుష్ప్రచారం జరగడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కారణం ఎవరు? ఎక్కడ నుంచి జరిగింది?…