2014 ఎన్నికల ముందు మోడీ ఒక విచిత్రమైన ప్రతిపాదన చేశాడు గుర్తుందా? విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ అంతా పట్టుకొస్తా, ప్రతి ఒక్కరి అక్కౌంట్లో 15 వేలు వేయొచ్చు అలా చేస్తే. బ్లాకాసురుల భరతం పడతా అన్నాడు. ఆ తర్వాత దానికథే మరిచిపోయాడు మోడీ.
బ్లాకాసురుల సంగతి పక్కన పెడితే… మోడీ అందరికీ 15 వేలు అక్కౌంట్లో వేయడానికే 20 లక్షల కోట్లు ప్రకటించాడు అని చెబుతున్నారు. దీనిపై మీమ్స్ కూడా వదుల్తున్నారు జనం. కొందరైతే 20000000000000 (2 పక్కన 13 సున్నాలు) 130 కోట్ల జనాభాతో డివైడిడ్ బై చేసి… అరెరె మనందరి అక్కౌంట్లలో తాను గతంలో చెప్పినట్లు 15 వేలు వేయడానికి సరిగ్గా లెక్కేసుకుని ఈ ప్యాకేజీ ప్రకటించారు అని సెటైర్స్ వేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా రంగాలకు ప్రయోజనం కలిగించేలా ప్యాకేజీ ప్రకటించినా అది ఎవరి చేతుల్లోకి వెళ్తుందో… దానికంటే దేశ ప్రజల ఖాతాలో వేసేయండి మోడీ గారు అని రిక్వెస్టులు పెడుతున్నారు.
మోడీ సర్కారు అలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందంటారు? మీకు హ్యాపీయేనా… కాదా? చెప్పండి మిమ్మల్నే అడిగేది 🙂
This post was last modified on May 13, 2020 5:14 pm
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…