Political News

మోడీ వైఫ‌ల్యాల‌కు.. ‘సోము వారి’ స‌న్నాయి నొక్కులు!

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్‌తో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. దేశంలోని మేధావులు, ప్ర‌పంచ స్థాయి విశ్లేష‌కులు కూడా.. భార‌త్‌లో ఈ రేంజ్‌లో క‌రోనా వ్యాప్తి చెంద‌డానికి ప్ర‌ధాన మంత్రి మోడీ విధానాలే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. అదేస‌మ‌యంలో దేశంలోనూ అంతే వ్య‌తిరేక‌త ఉంద‌ని లోక‌ల్ మీడియా కూడా చెబుతోంది. కేంద్ర ప్ర‌భుత్వం స‌రైన దిశ‌గా నిర్ణ‌యాలు తీసుకోక‌పోవ‌డం.. లాక్‌డౌన్‌, క‌ర్ఫ్యూ వంటి విష‌యాల్లో రాష్ట్రాల‌ను దిశానిర్దేశం చేయ‌లేక పోవ‌డం.. ఆర్థికంగా రాష్ట్రాల‌కు భ‌రోసా క‌ల్పించ‌క‌పోవ‌డం.. వంటి కీల‌క ప‌రిణామాలు.. క‌రోనాను పెంచిపోషించాయ‌నేది నిర్వివాదాంశం.

అయితే.. ఘ‌న‌త వ‌హించిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజుకు ఈ స‌మ‌యంలో రాజ్యాంగం.. బాధ్య‌త‌లు గుర్తుకు వ‌చ్చాయి. “ప్ర‌జారోగ్యం అనేది రాష్ట్రాల స‌బ్జెక్టు! రాష్ట్రాల‌కు ఎక్కువ బాధ్య‌త ఉంటుంది. సో.. కేంద్రంపై విమ‌ర్శ‌లు చేసే వారు రాజ్యాంగంలోని ‘స‌బ్జెక్టు’ల‌ను(అంటే.. కేంద్ర‌, రాష్ట్రాల బాధ్య‌త‌లను విశ‌దీక‌రించే ఆర్టిక‌ల్స్‌) చ‌దువుకోవాల‌ని అని హిత‌వు ప‌లికారు. ఇంత‌కీ ఆయ‌న బాధ‌.. ఇంత మంది ప్ర‌జ‌లు చ‌నిపోతున్నార‌ని కాదు.. మోడీని తిట్టిపోస్తున్నారనే!!

పోనీ.. సోము చెప్పిన విష‌యాన్నే ఒక‌సారి ప‌రిశీలిస్తే.. ప్ర‌జారోగ్యం అనేది రాజ్యాంగంలో కేవ‌లం రాష్ట్రాలకు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌జారోగ్యం రాజ్యాంగంలో కేంద్ర స‌బ్జెక్టులో కూడా ఉంద‌ని 1897 ప్యాండ‌మిక్ చ‌ట్టం.. కేంద్రానికి కొన్ని బాధ్య‌త‌ల‌ను ద‌ఖ‌లు ప‌రిచింది. అందుకే గ‌త ఏడాది లాక్‌డౌన్ విధించిన‌ప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం ఈ చ‌ట్టాన్నే ఉద‌హ‌రించింది. మొత్తంగా చూస్తే.. రాష్ట్రాల‌కే బాధ్య‌త అని త‌ప్పించుకునేందుకు అవ‌కాశం లేదు. అదే స‌మ‌యంలో ఇలాంటి ‘ప్ర‌జారోగ్య విప‌త్తు’లు సంభ‌వించిన‌ప్పుడు.. ఖ‌చ్చితంగా కేంద్రానికే ఎక్కువ‌గా బాధ్య‌త ఉంటుంది.

కానీ, ఈ విష‌యంలో కేంద్రం త‌న బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించుకుంది. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి సందేహం లేదు. కేంద్రానికి కూడా ఈ విష‌యం తెలుసు. అందుకే.. మౌనంగా ఉంటోంది. అంతేకాదు.. ఎవ‌రూ ఈ విష‌యంపై స్పందించ‌రాద‌ని.. మౌఖిక ఆదేశాలు కూడా ఇచ్చింది. దీంతో నోరేసుకుని ప‌డిపోయే నాయ‌కులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. కానీ, సోము వారు మాత్రం త‌ప్పు మోడీది కాదు.. అంతా రాష్ట్రాలదే అన్న‌ట్టు మాట్లాడుతున్నారు. ఇది ఎంత వ‌ర‌కు స‌బ‌బు! అనేది నిపుణుల మాట‌.

This post was last modified on May 1, 2021 9:41 am

Share

Recent Posts

ఎట్ట‌కేల‌కు తెలుగులో తొలి హిట్టు

త‌మిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన‌ శివ కార్తికేయ‌న్ లాగే టీవీ రంగం నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అమ్మాయి ప్రియ భ‌వానీ…

36 minutes ago

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు…

1 hour ago

త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను…

1 hour ago

లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది.…

2 hours ago

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

2 hours ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

2 hours ago