Political News

మోడీ వైఫ‌ల్యాల‌కు.. ‘సోము వారి’ స‌న్నాయి నొక్కులు!

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్‌తో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. దేశంలోని మేధావులు, ప్ర‌పంచ స్థాయి విశ్లేష‌కులు కూడా.. భార‌త్‌లో ఈ రేంజ్‌లో క‌రోనా వ్యాప్తి చెంద‌డానికి ప్ర‌ధాన మంత్రి మోడీ విధానాలే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. అదేస‌మ‌యంలో దేశంలోనూ అంతే వ్య‌తిరేక‌త ఉంద‌ని లోక‌ల్ మీడియా కూడా చెబుతోంది. కేంద్ర ప్ర‌భుత్వం స‌రైన దిశ‌గా నిర్ణ‌యాలు తీసుకోక‌పోవ‌డం.. లాక్‌డౌన్‌, క‌ర్ఫ్యూ వంటి విష‌యాల్లో రాష్ట్రాల‌ను దిశానిర్దేశం చేయ‌లేక పోవ‌డం.. ఆర్థికంగా రాష్ట్రాల‌కు భ‌రోసా క‌ల్పించ‌క‌పోవ‌డం.. వంటి కీల‌క ప‌రిణామాలు.. క‌రోనాను పెంచిపోషించాయ‌నేది నిర్వివాదాంశం.

అయితే.. ఘ‌న‌త వ‌హించిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజుకు ఈ స‌మ‌యంలో రాజ్యాంగం.. బాధ్య‌త‌లు గుర్తుకు వ‌చ్చాయి. “ప్ర‌జారోగ్యం అనేది రాష్ట్రాల స‌బ్జెక్టు! రాష్ట్రాల‌కు ఎక్కువ బాధ్య‌త ఉంటుంది. సో.. కేంద్రంపై విమ‌ర్శ‌లు చేసే వారు రాజ్యాంగంలోని ‘స‌బ్జెక్టు’ల‌ను(అంటే.. కేంద్ర‌, రాష్ట్రాల బాధ్య‌త‌లను విశ‌దీక‌రించే ఆర్టిక‌ల్స్‌) చ‌దువుకోవాల‌ని అని హిత‌వు ప‌లికారు. ఇంత‌కీ ఆయ‌న బాధ‌.. ఇంత మంది ప్ర‌జ‌లు చ‌నిపోతున్నార‌ని కాదు.. మోడీని తిట్టిపోస్తున్నారనే!!

పోనీ.. సోము చెప్పిన విష‌యాన్నే ఒక‌సారి ప‌రిశీలిస్తే.. ప్ర‌జారోగ్యం అనేది రాజ్యాంగంలో కేవ‌లం రాష్ట్రాలకు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌జారోగ్యం రాజ్యాంగంలో కేంద్ర స‌బ్జెక్టులో కూడా ఉంద‌ని 1897 ప్యాండ‌మిక్ చ‌ట్టం.. కేంద్రానికి కొన్ని బాధ్య‌త‌ల‌ను ద‌ఖ‌లు ప‌రిచింది. అందుకే గ‌త ఏడాది లాక్‌డౌన్ విధించిన‌ప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం ఈ చ‌ట్టాన్నే ఉద‌హ‌రించింది. మొత్తంగా చూస్తే.. రాష్ట్రాల‌కే బాధ్య‌త అని త‌ప్పించుకునేందుకు అవ‌కాశం లేదు. అదే స‌మ‌యంలో ఇలాంటి ‘ప్ర‌జారోగ్య విప‌త్తు’లు సంభ‌వించిన‌ప్పుడు.. ఖ‌చ్చితంగా కేంద్రానికే ఎక్కువ‌గా బాధ్య‌త ఉంటుంది.

కానీ, ఈ విష‌యంలో కేంద్రం త‌న బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించుకుంది. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి సందేహం లేదు. కేంద్రానికి కూడా ఈ విష‌యం తెలుసు. అందుకే.. మౌనంగా ఉంటోంది. అంతేకాదు.. ఎవ‌రూ ఈ విష‌యంపై స్పందించ‌రాద‌ని.. మౌఖిక ఆదేశాలు కూడా ఇచ్చింది. దీంతో నోరేసుకుని ప‌డిపోయే నాయ‌కులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. కానీ, సోము వారు మాత్రం త‌ప్పు మోడీది కాదు.. అంతా రాష్ట్రాలదే అన్న‌ట్టు మాట్లాడుతున్నారు. ఇది ఎంత వ‌ర‌కు స‌బ‌బు! అనేది నిపుణుల మాట‌.

This post was last modified on May 1, 2021 9:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

44 minutes ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

2 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago