Political News

ఇది.. మోడీ పెట్టిన మంటే: క‌న్నీరు పెట్టిస్తున్న ‘TIME’ క‌థ‌నం!

“అది భార‌త దేశ రాజ‌ధాని ఢిల్లీలోని స‌బ‌ర్బ్ ప్రాంతం. సూర్యుడు నెమ్మ‌దిగా అస్త‌మిస్తున్నాడు. సంధ్యా స‌మ‌యం ఆవ‌రిస్తోంది. వాతావ‌ర‌ణంలో మెల్ల‌గా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కానీ, స‌బ‌ర్బ్ హిందూ శ్మ‌శాన వాటిక నుంచి నిరంత‌రాయంగా గాలిలోకి ధూళి లేస్తూనే ఉంది. భ‌గ‌భ‌గ‌మ‌ని మండుతున్న చితుల‌ మంట‌లు.. ఉప్పొంగి భోగి మంట‌లుగా ఎగిసి ప‌డుతూనే ఉన్నాయి. వీటి నుంచి వ‌స్తున్న బూడిద‌, దుర్వాస‌న.. ప‌ర్యావ‌ర‌ణంలో క‌లిసిపోయి.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నిర్ల‌క్ష్య‌పు జ్వాల‌ల న‌డుమ క‌రోనా బాధిత నిర్జీవ దేహాల‌ను నుసి చేస్తూ.. దేశ పాల‌క వ్య‌వ‌స్థ‌కు స‌వాల్ రువ్వుతోంది”

ఇదీ.. ప్ర‌పంచ స్థాయిలో పేరెన్నిక‌గ‌న్న‌.. అమెరికాకు చెందిన ‘TIME’ మేగ‌జీన్ రాసిన ముఖ‌చిత్ర క‌థ‌నం ‘India’s COVID-19 Crisis Is Spiraling Out of Control. It Didn’t Have to Be This Way’.. భార‌త దేశంలో క‌రోనా తీవ్ర‌త‌ను, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నిర్ల‌క్ష్యాన్ని.. క‌ళ్ల‌కు క‌ట్టేసింది. విధాన ప‌ర‌మైన లోపాలు.. ‘మేకిన్ ఇండియా’ అనే దుర్బ‌ల‌మైన నినాదాన్ని నిజం చేయాల‌నే ల‌క్ష్యం.. వంటివి మోడీకి ప్ర‌తిబంధ‌కంగా మారి.. దేశ ప్ర‌జ‌ల‌ను క‌రోనా మ‌హ‌మ్మారికి ఎర‌వేశాయ‌ని.. ‘TIME’ ముఖ చిత్ర క‌థ‌నం కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది.

నిశిత దృష్టి.. మేధావుల నుంచి అభిప్రాయాలు, క్షేత్ర‌స్థాయి వాస్త‌వాల‌తో ఏప్రిల్ 26-27 తేదీల్లో దేశంలో ఉన్న క‌రోనా ప‌రిస్థితిని.. అంతకు ముందున్న ప‌రిస్థితిని వివ‌రించింది. దీనిలో ప్ర‌ధానంగా త‌గ్గిపోతున్న ద‌శ‌లో ఉన్న క‌రోనాను పాల‌కులు పెంచిపోషించార‌నేది ప్ర‌ధాన విమ‌ర్శ కాగా.. ‘ఆత్మ‌నిర్భ‌ర భార‌త్‌’ నినాదాన్ని నిజం చేసుకునేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన ప్ర‌యోగాలు.. కూడా వైర‌స్‌ను పెంచి పోషించాయ‌ని.. అదేస‌మ‌యంలో రాజ‌కీయ కార‌ణాలు.. ఎన్నిక‌ల వ్యూహాలు.. వంటివి.. దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభించ‌డానికి కార‌ణాలు TIME పేర్కొంది.

అంతేకాదు, TIME.. ముఖ‌చిత్రం కూడా ఢిల్లీలో స‌బ‌ర్బ్‌.. శ్మ‌శాన వాటిలో కాలుతున్న చితులు, ఇంకా త‌మ వ‌రుస రాలేదా? అని ఎద‌రు చూస్తున్న మూటల్లోని శ‌వాలతో కూడిన ఫొటోను ప్ర‌చురించి.. దేశంలో క‌రోనా వైర‌స్ తీవ్ర‌త‌ను TIME ప్ర‌పంచం క‌ళ్ళ‌కు 70MM లో చూపించింది. ప్ర‌స్తుతం TIME క‌థ‌నం.. ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మోడీ సంపాయించుకున్నాన‌ని చెబుతున్న గౌర‌వం.. చితిమంట‌ల్లో కాలిపోతోంది అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on April 30, 2021 11:01 am

Share

Recent Posts

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

5 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

6 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

7 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

7 hours ago

కూతురి పెద్ద మాటలు… నాకు సంబంధం లేదన్న కొండా

సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…

10 hours ago

బాలయ్య చెప్పేదాకా నమ్మలేని విషయమది

నందమూరి అభిమానుల ఎదురు చూపులను రెన్యూవల్ చేయడమే తప్ప ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చెప్పకుండా దోబూచులాడుతున్న మోక్షజ్ఞ మరోసారి వార్తల్లోకి…

11 hours ago