పార్టీలో ఇపుడందరి చూపులు జగన్ పేనే ఉంది. ఎందుకంటే అధికారంలోకి రాగానే నిర్వహించాలని అనుకున్న పార్టీ ప్లీనరీ నిర్వహణ విషయం ఇపుడు సందిగ్దంలో పడింది. అధికారంలోకి రాగానే పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించాలని ప్రతిపక్షంలో ఉన్నపుడే జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. అనుకున్న ప్రకారమైతే 2020, జూలై 8వ తేదీన నాలుగో ప్లీనరీ ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే కరోనా మహమ్మారి కారణంగా వాయిదా వేసుకోక తప్పలేదు.
సరే అప్పుడంటే వాయిదా వేసుకోక తప్పలేదు 2021 జూలై లో అయినా ప్లీనరీని ఘనంగా నిర్వహించాల్సిందే అని అనుకున్నారు. తీరా ఇపుడు జూలై సమయం వచ్చేటప్పటికి మళ్ళీ కరోనా వైరస్ సెకెండ్ వేవ్ వణికించేస్తోంది. జూలై అంటే ఇకా మూడు నెలలుంది. అయితే ఇఫ్పటికైతే కరోనా వైరస్ కేసులు చాలా ఉదృతంగా ఉందన్నది వాస్తవం. మరి ఈ ఉదృతి ఎంతకాలం కంటిన్యు అవుతుందో ఎవరు చెప్పలేకున్నారు.
ఒకవేళ ఇపుడు ప్రభావం తగ్గినా మళ్ళీ మే నెల 3వ వారంలో థర్డ్ వేవ్ మరింత ఉదృతంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికన్నా మరింత ఉదృతంగా మే నెల చివరలో వస్తుందని అనుకుంటున్న కరోనా మహమ్మారి ఎంత కాలం ఉంటుందో ? ఏ స్ధాయిలో అల్లకల్లోలం సృష్టిస్తుందో తలచుకుంటేనే భయమేస్తోంది.
ఇలాంటి పరిస్దితుల్లో జూలై 8 వ తేదీన పార్టీ ప్లీనరీ నిర్వహణ అనుమానమే అని సీనియర్ నేతలు తెగ బాధపడిపోతున్నారు. ఒకవేళ ప్లీనరీని నిర్వహించాలని జగన్ డిసైడ్ చేస్తే వేలాదిమంది నేతలు రెండురోజుల పాటు ఒకేచోట గుమిగూడటం తప్పదు. చివరగా నిర్వహించబోయే బహిరంగసభకు లక్షల మందిని సమీకరిస్తారు. దాంతో వైరస్ ఒక్కసారిగా పెరిగిపోయే ప్రమాదముంది.
అధికారపార్టీ నిర్వహించిన ప్లీనరీ వల్లే కరోనా వైరస్ వ్యాపించిందనే ఆరోపణలను, నిందను జగన్ భరించాల్సుంటుంది. ప్లీనరీ నిర్వహణ విషయంలో అధికారిక నిర్ణయం తీసుకుంటే ఎవరైనా కోర్టుకెక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టే ప్లీనరీ విషయంలో జగన్ ఏమి నిర్ణయం తీసుకుంటారా అని నేతలు ఎదురు చూస్తున్నారు.
This post was last modified on April 29, 2021 4:18 pm
స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…
బాక్సాఫీస్ వద్ద కరుప్పు / వీరభద్రుడు జోరు బాగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో రికార్డులు రాసే దిశగా పరుగులు పెడుతోంది.…
హఠాత్తుగా పెద్ది సినారియో మారిపోయింది. ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ది గురించి రెండు మూడు రోజులు మాట్లాడుకుంటారనుకుంటే దానికి భిన్నంగా…
మంచు మనోజ్.. కొన్నేళ్ల ముందు భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అది అతడికి రెండో పెళ్లి. మరోవైపు…
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్లోని గదికి…