Political News

అందరి చూపులు జగన్ పైనే

పార్టీలో ఇపుడందరి చూపులు జగన్ పేనే ఉంది. ఎందుకంటే అధికారంలోకి రాగానే నిర్వహించాలని అనుకున్న పార్టీ ప్లీనరీ నిర్వహణ విషయం ఇపుడు సందిగ్దంలో పడింది. అధికారంలోకి రాగానే పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించాలని ప్రతిపక్షంలో ఉన్నపుడే జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. అనుకున్న ప్రకారమైతే 2020, జూలై 8వ తేదీన నాలుగో ప్లీనరీ ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే కరోనా మహమ్మారి కారణంగా వాయిదా వేసుకోక తప్పలేదు.

సరే అప్పుడంటే వాయిదా వేసుకోక తప్పలేదు 2021 జూలై లో అయినా ప్లీనరీని ఘనంగా నిర్వహించాల్సిందే అని అనుకున్నారు. తీరా ఇపుడు జూలై సమయం వచ్చేటప్పటికి మళ్ళీ కరోనా వైరస్ సెకెండ్ వేవ్ వణికించేస్తోంది. జూలై అంటే ఇకా మూడు నెలలుంది. అయితే ఇఫ్పటికైతే కరోనా వైరస్ కేసులు చాలా ఉదృతంగా ఉందన్నది వాస్తవం. మరి ఈ ఉదృతి ఎంతకాలం కంటిన్యు అవుతుందో ఎవరు చెప్పలేకున్నారు.

ఒకవేళ ఇపుడు ప్రభావం తగ్గినా మళ్ళీ మే నెల 3వ వారంలో థర్డ్ వేవ్ మరింత ఉదృతంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికన్నా మరింత ఉదృతంగా మే నెల చివరలో వస్తుందని అనుకుంటున్న కరోనా మహమ్మారి ఎంత కాలం ఉంటుందో ? ఏ స్ధాయిలో అల్లకల్లోలం సృష్టిస్తుందో తలచుకుంటేనే భయమేస్తోంది.

ఇలాంటి పరిస్దితుల్లో జూలై 8 వ తేదీన పార్టీ ప్లీనరీ నిర్వహణ అనుమానమే అని సీనియర్ నేతలు తెగ బాధపడిపోతున్నారు. ఒకవేళ ప్లీనరీని నిర్వహించాలని జగన్ డిసైడ్ చేస్తే వేలాదిమంది నేతలు రెండురోజుల పాటు ఒకేచోట గుమిగూడటం తప్పదు. చివరగా నిర్వహించబోయే బహిరంగసభకు లక్షల మందిని సమీకరిస్తారు. దాంతో వైరస్ ఒక్కసారిగా పెరిగిపోయే ప్రమాదముంది.

అధికారపార్టీ నిర్వహించిన ప్లీనరీ వల్లే కరోనా వైరస్ వ్యాపించిందనే ఆరోపణలను, నిందను జగన్ భరించాల్సుంటుంది. ప్లీనరీ నిర్వహణ విషయంలో అధికారిక నిర్ణయం తీసుకుంటే ఎవరైనా కోర్టుకెక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టే ప్లీనరీ విషయంలో జగన్ ఏమి నిర్ణయం తీసుకుంటారా అని నేతలు ఎదురు చూస్తున్నారు.

This post was last modified on April 29, 2021 4:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

2 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

2 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

3 hours ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

5 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

7 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

7 hours ago