Political News

జ‌గ‌న్‌కు త‌న‌వారిపై ఉన్న ప్రేమ‌.. జ‌నాలపై ఏదీ?

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ మ‌రోసారి నిప్పులు చెరిగారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా రెండో ద‌శ తీవ్రంగా విస్తరిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌ను స‌రైన విధంగా ట్రీట్ చేయాల్సిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం దీనిని వ‌దిలి పెట్టి.. త‌న పిచ్చి చేష్ట‌ల‌తో ప్ర‌జ‌ల‌ను క‌రోనాకు ఆహారం వేస్తున్నార‌ని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ముఖ్యంగా 10 ల‌క్ష‌ల మంది ఇంట‌ర్ విద్యార్థులకు సంబంధించిన ప‌రీక్షల విష‌యంలో పంతానికి పోయి.. వారిని క‌రోనా బారిన ప‌డేలా చేస్తున్నార‌ని.. అన్నారు.

విద్యార్థుల ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని.. అన్ని వైపుల నుంచి డిమాండ్లు వ‌స్తున్నా.. మొండిగా ముందుకు వెళ్తున్నాడ‌ని.. జ‌గ‌న్‌ను విమ‌ర్శించారు. విద్యార్థుల ప‌రీక్ష‌ల‌కు క‌రోనా అడ్డు కాద‌ని వాదిస్తున్న జ‌గ‌న్‌.. తాజాగా గురువారం నిర్వ‌హించాల్సిన రాష్ట్ర కేబినెట్ భేటీని ఎందుకు వాయిదా వేయాల్సి వ‌చ్చిందో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్నారు. మంత్రులు స‌హా అధికారులకు క‌రోనా భ‌యం ఉండ‌డంతో వారంతా కేబినెట్ భేటీకి వ‌చ్చేది లేద‌ని చెప్ప‌డంతోనే జ‌గ‌న్ దీనిని వాయిదా వేసుకున్నాడ‌ని.. మ‌రి కేబినెట్ కు ఉన్న క‌రోనా భయం.. ప్రాణ భీతి.. చిన్నారులైన ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఉండ‌దా? ఇదేం పాల‌న జ‌గ‌న్‌? అని లోకేష్ నిల‌దీశారు.

రాష్ట్రంలో క‌రోనా కేసులు కూడా దాస్తున్నార‌ని, మృతుల సంఖ్య‌ను కూడా త‌గ్గించి చూపుతున్నార‌ని.. దీంతో రాష్ట్ర ప్ర‌జ‌లు తీవ్రంగా ఆవేద‌న చెందుతున్నార‌ని.. ఇప్ప‌టికైనా నిజాయితీగా క‌రోనా బాధితుల వివ‌రాల‌ను వెల్ల‌డించాల‌ని.. లోకేష్ సూచించారు. తాజాగా హైకోర్టు కూడా ప్ర‌భుత్వ వైఖ‌రిని త‌ప్పుబ‌ట్టిన విష‌యాన్ని లోకేష్ గుర్తు చేశారు. ప్ర‌భుత్వం ప్ర‌చారానికి ఇస్తున్న ప్రాధాన్యం క‌రోనా నియంత్ర‌ణ‌పై పెట్ట‌డం లేద‌ని.. ప్ర‌తి విష‌యాన్నీ ప్ర‌చారం ఎందుకు చేస్తున్నార‌ని హైకోర్టు మొట్టి కాయ‌లు వేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా లోకేష్ గుర్తు చేశారు. క‌రోనా చ‌ర్య‌ల‌ను కూడా ప‌టిష్టంగా అమ‌లు చేయాల‌ని.. ప్ర‌తిదానినీ రాజ‌కీయంచేయ‌డం మానుకోవాల‌ని, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.

This post was last modified on April 29, 2021 4:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

36 minutes ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

1 hour ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

2 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

3 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

4 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

4 hours ago