ఏపీ ముఖ్యమంత్రి జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రెండో దశ తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలను సరైన విధంగా ట్రీట్ చేయాల్సిన జగన్ ప్రభుత్వం దీనిని వదిలి పెట్టి.. తన పిచ్చి చేష్టలతో ప్రజలను కరోనాకు ఆహారం వేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా 10 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన పరీక్షల విషయంలో పంతానికి పోయి.. వారిని కరోనా బారిన పడేలా చేస్తున్నారని.. అన్నారు.
విద్యార్థుల పరీక్షలు వాయిదా వేయాలని.. అన్ని వైపుల నుంచి డిమాండ్లు వస్తున్నా.. మొండిగా ముందుకు వెళ్తున్నాడని.. జగన్ను విమర్శించారు. విద్యార్థుల పరీక్షలకు కరోనా అడ్డు కాదని వాదిస్తున్న జగన్.. తాజాగా గురువారం నిర్వహించాల్సిన రాష్ట్ర కేబినెట్ భేటీని ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాలన్నారు. మంత్రులు సహా అధికారులకు కరోనా భయం ఉండడంతో వారంతా కేబినెట్ భేటీకి వచ్చేది లేదని చెప్పడంతోనే జగన్ దీనిని వాయిదా వేసుకున్నాడని.. మరి కేబినెట్ కు ఉన్న కరోనా భయం.. ప్రాణ భీతి.. చిన్నారులైన ఇంటర్ విద్యార్థులకు ఉండదా? ఇదేం పాలన జగన్? అని లోకేష్ నిలదీశారు.
రాష్ట్రంలో కరోనా కేసులు కూడా దాస్తున్నారని, మృతుల సంఖ్యను కూడా తగ్గించి చూపుతున్నారని.. దీంతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారని.. ఇప్పటికైనా నిజాయితీగా కరోనా బాధితుల వివరాలను వెల్లడించాలని.. లోకేష్ సూచించారు. తాజాగా హైకోర్టు కూడా ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రచారానికి ఇస్తున్న ప్రాధాన్యం కరోనా నియంత్రణపై పెట్టడం లేదని.. ప్రతి విషయాన్నీ ప్రచారం ఎందుకు చేస్తున్నారని హైకోర్టు మొట్టి కాయలు వేసిన విషయాన్ని ఈ సందర్భంగా లోకేష్ గుర్తు చేశారు. కరోనా చర్యలను కూడా పటిష్టంగా అమలు చేయాలని.. ప్రతిదానినీ రాజకీయంచేయడం మానుకోవాలని, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…