పరిస్దితులు బాగాలేనపుడు తాడే పామై కరుస్తుందనేది నానుడి. జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో ఇపుడీ నానుడే నిజమవుతుందా ? అనే చర్చ జోరుగా మొదలైంది. ఎలాగంటే వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు వ్యవహారంపై ఇపుడిదే చర్చ జరుగుతోంది. జగన్ బెయిల్ ను రద్దుచేసి వెంటనే యాక్షన్ తీసుకోవాలంటు వేసిన పిటీషన్ పై వచ్చే వారంనుండి విచారణ ప్రారంభించటానికి సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.
జగన్ బెయిల్ రద్దు చేసి యాక్షన్ తీసుకోవాలంటు ఈమధ్య తిరుగుబాటు ఎంపి సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటీషన్ వేశారు. దానిపై వాదోపవాదనలు విన్న కోర్టు చివరకు ఎంపి కేసుకు అన్నీ విధాలుగా విచారణార్హత ఉందని తేల్చారు. అందుకనే తిరుగుబాటు ఎంపి వేసిన కేసును విచారణకు అడ్మిట్ చేసుకుని జగన్ కు నోటీసులు ఇవ్వాలని డిసైడ్ చేసింది.
జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరో, అరబిందోలకు సంబందించిన భూకేటాయింపులపై సీబీఐ నమోదుచేసిన కేసులో జగన్ బెయిల్ రద్దుచేయాలని ఎంపి తన పిటీషన్లో కోరారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ సాక్ష్యులను బెదిరిస్తున్నట్లు కూడా ఆరోపించారు. తన సహనిందుతులకు కీలక పదవులను కట్టబెట్టడం ద్వారా సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నట్లు చెప్పటమే కీలకం.
సరే ఇఫుడు ఎంపి వేసిన కేసు వల్ల జగన్ కు వచ్చే సమస్య ఏమీ లేదని వైసీపీ వర్గాలు సర్దిచెప్పుకుంటున్నాయి. కాని ఏం జరుగుతుందో అన్న ఆందోళన మాత్రం అందరిలో ఉంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే విచారణలో అన్నీ విధాలుగా సహకరిస్తానని కోర్టుకు చెప్పిన జగన్ ఇపుడు విచారణకు గైర్హాజరవుతున్నట్లు చెప్పారు. తన కార్యక్రమాలను కోర్టు వాయిదా తేదీలకు అనుగుణంగా రూపొందించుకుని జగన్ వాయిదాలకు రావడం లేదన్న విషయాన్ని కూడా రఘురామ తరఫు లాయర్లు వాదించారు.
మొత్తానికి ఇప్పటికైతే తిరుగుబాటు ఎంపి పార్టీకి, జగన్ కు తలనొప్పిగానే తయారయ్యారు. మరి ఈ వ్యవహరాన్ని జగన్ ఎలా డీల్ చేస్తారో చూడాల్సిందే.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…