Political News

క‌రోనాకు ఈసీనే కార‌ణం.. మ‌ర్డ‌ర్ కేసు బుక్ చేస్తాం: హైకోర్టు

దేశంలో క‌రోనా రెండో ద‌శ తీవ్ర‌స్థాయిలో విజృంభించింది. ఎక్క‌డిక‌క్క‌డ క‌రోనా బాధితుల‌తో దేశం అల్లాడి పోతోంది. ప్ర‌పంచంలో ఇప్పుడు క‌రోనా వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న దేశం.. కేవ‌లం భార‌తే. ఒక‌ప్పుడు క‌రోనాపై తీవ్ర‌స్థాయిలో యుద్ధం చేశామ‌ని చెప్పిన కేంద్ర ప్ర‌భుత్వం ఇప్పుడు చేతులు ఎత్తేసింది. అయితే.. రెండో ద‌శ క‌రోనా వ్యాప్తికి కార‌ణం ఎవ‌రు? అనే విష‌యంపై ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు అటు కేంద్ర ప్ర‌భుత్వాలు మౌనంగా ఉన్నాయి. గ‌తంలో అయితే.. చైనా నుంచి వ‌చ్చిన వారు.. త‌బ్లిగీ స‌మావేశాల ద్వారా వ్యాపించింద‌ని చెప్పారు.

కానీ, సెకండ్ వేవ్‌పై మాత్రం ఎవ‌రికి వారు మౌనంగా ఉన్నారు. అయితే.. ఇప్పుడు మ‌ద్రాస్ హైకోర్టు సంచ‌ల న వ్యాఖ్య‌లు చేసింది. క‌రోనా రెండో ద‌శ‌వ్యాప్తికి కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే కార‌ణ‌మ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిం ది. దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌లు నిర్వ‌హించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే క‌రోనా వ్యాప్తికి.. ఇన్ని వేల మంది ప్రాణా లు పోవ‌డానికి కార‌ణంమ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అంతేకాదు.. ఎన్నిక‌ల ర్యాలీల‌ను, బ‌హిరంగ స‌భ‌ల‌ను నిలువ‌రించ‌డంలోను, నియంత్రించ‌డంలోను పూర్తిగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం విఫ‌ల‌మైంద‌ని మ‌ద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది.

దేశంలో ఇన్ని ల‌క్ష‌ల మంది .. మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మైన ఎన్నిక‌ల సంఘం అధికారుల‌పై హ‌త్యా నేరం కింది సెక్షన్ 302 ఐపీసీ కింద కేసులు ఎందుకుపెట్ట‌కూడ‌దో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని మ‌ద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఇక‌, మే 2 న ఎన్నిక‌లకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌లో క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే.. పూర్తిగా ఎన్నిక‌ల‌నే ర‌ద్దు చేస్తామ‌ని.. కూడా మ‌ద్రాస్ హైకోర్టు హెచ్చ‌రించింది. అంతేకాదు.. ప్ర‌జ‌ల ప్రాణాల‌కు మ‌ద్ద‌తు తెల‌పాల్సిన నాయ‌కులు సైతం ఎలాంటి ర‌క్ష‌ణ‌లు తీసుకోకుండానే ప్ర‌చారంలో పాల్గొన్నార‌ని.. వారు కూడా క‌రోనా మ‌ర‌ణాల‌కు బాధ్యులలేన‌ని వ్యాఖ్యానించింది. ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌పై స్టే ఇవ్వాలంటూ.. దాఖ‌లైన పిటిష‌న్‌పై మ‌ద్రాస్ హైకోర్టు విచార‌ణ‌లో ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

అత్తెసరు వసూళ్లతో ముంచేసేలా ఉంది

హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…

37 seconds ago

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

2 hours ago

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

3 hours ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

5 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

5 hours ago

సాయికృష్ణ కుటుంబానికి చంద్రబాబు భరోసా

విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…

5 hours ago