దేశంలో కరోనా రెండో దశ తీవ్రస్థాయిలో విజృంభించింది. ఎక్కడికక్కడ కరోనా బాధితులతో దేశం అల్లాడి పోతోంది. ప్రపంచంలో ఇప్పుడు కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశం.. కేవలం భారతే. ఒకప్పుడు కరోనాపై తీవ్రస్థాయిలో యుద్ధం చేశామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేతులు ఎత్తేసింది. అయితే.. రెండో దశ కరోనా వ్యాప్తికి కారణం ఎవరు? అనే విషయంపై ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వాలు మౌనంగా ఉన్నాయి. గతంలో అయితే.. చైనా నుంచి వచ్చిన వారు.. తబ్లిగీ సమావేశాల ద్వారా వ్యాపించిందని చెప్పారు.
కానీ, సెకండ్ వేవ్పై మాత్రం ఎవరికి వారు మౌనంగా ఉన్నారు. అయితే.. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు సంచల న వ్యాఖ్యలు చేసింది. కరోనా రెండో దశవ్యాప్తికి కేంద్ర ఎన్నికల సంఘమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేసిం ది. దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘమే కరోనా వ్యాప్తికి.. ఇన్ని వేల మంది ప్రాణా లు పోవడానికి కారణంమని సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు.. ఎన్నికల ర్యాలీలను, బహిరంగ సభలను నిలువరించడంలోను, నియంత్రించడంలోను పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం విఫలమైందని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది.
దేశంలో ఇన్ని లక్షల మంది .. మరణాలకు కారణమైన ఎన్నికల సంఘం అధికారులపై హత్యా నేరం కింది సెక్షన్ 302 ఐపీసీ కింద కేసులు ఎందుకుపెట్టకూడదో వివరణ ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఇక, మే 2 న ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కరోనా నిబంధనలు పాటించకపోతే.. పూర్తిగా ఎన్నికలనే రద్దు చేస్తామని.. కూడా మద్రాస్ హైకోర్టు హెచ్చరించింది. అంతేకాదు.. ప్రజల ప్రాణాలకు మద్దతు తెలపాల్సిన నాయకులు సైతం ఎలాంటి రక్షణలు తీసుకోకుండానే ప్రచారంలో పాల్గొన్నారని.. వారు కూడా కరోనా మరణాలకు బాధ్యులలేనని వ్యాఖ్యానించింది. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై స్టే ఇవ్వాలంటూ.. దాఖలైన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు విచారణలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
This post was last modified on April 26, 2021 2:29 pm
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…
స్టార్ హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లు భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం…
గ్యారెంటీ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ సినిమాలకు పేరు. కానీ గత కొన్నేళ్లుగా ఈ జానర్ కు ఆదరణ తగ్గడం,…