Political News

జగన్‌ దిగి రాక తప్పదా?


దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవాన్ని చూస్తున్నాం. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు తీవ్రత చాలా ఎక్కువ అన్నది స్పష్టం. ఒకప్పుడు రోజుకు గరిష్టంగా లక్ష కేసులు వస్తేనే గుండెలు బాదేసుకున్నాం. కానీ ఇప్పుడు రోజువారీ కేసులు 4 లక్షలకు చేరువగా ఉన్నాయి. రోజూ వేల సంఖ్యలోనే రోగులు ప్రాణాలు వదులతున్నారు. ప్రభుత్వాలు మరణాల విషయంలో సరైన డేటా ఇవ్వకపోవడం వల్ల కొందరికి తీవ్రత అర్థం కాక పోతుండొచ్చు.

ఈ సమయంలో మనిషి ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిందే. ముఖ్యంగా విద్యార్థుల పరీక్షల విషయంలో గత ఏడాది లాగే వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు దిగి వస్తున్నాయి. పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. తెలంగాణ సైతం పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, అంతర్గత పరీక్షల ఆధారంగా వారిని ప్రమోట్ చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. మాత్రం పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించబోతున్నారు. తొమ్మిదో తరగతి వరకు స్కూళ్లన్నీ మూసి వేయించి టెన్త్ విద్యార్థులకు మాత్రం పరీక్షలు ఉంటాయని ప్రకటించడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఈ నిర్ణయం పట్ల ఎవరూ సంతృప్తిగా లేరు. పిల్లల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదంటున్న తల్లిదండ్రులు ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. అయినా సరే.. జగన్ సర్కారు వెనక్కి తగ్గకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పటితో పోలిస్తే తీవ్రత బాగా పెరిగింది.

అమరావతిలో ముఖ్యమంత్రి రోజూ విధుల కోసం వెళ్లే సచివాలయంలో గత కొన్ని రోజుల్లో ఐదుగురు ఉద్యోగులు కరోనాతో ప్రాణాలు వదలడం గమనార్హం. తాను పని చేస్తున్న చోట పరిస్థితి ఇంత ప్రమాదకరంగా ఉన్నపుడు జగన్ పదో తరగతి విద్యార్థుల పరీక్షల విషయంలో అంత మొండిగా ఉండటం విడ్డూరం. ప్రతిపక్షాలకు ఇది ఆయుధంగా మారే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో జగన్ సర్కారు నిర్ణయం మార్చుకోక తప్పేలా లేదు.

This post was last modified on April 26, 2021 8:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

త్రిష ‘నో’ చెప్పడానికి సిద్ధపడిందా

రజనీకాంత్, కమల్ హాసన్ కలయికలో తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ క్యాస్టింగ్ సెట్ చేసుకోవడం దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కు పెద్ద…

1 hour ago

కూతురి డేటింగ్.. కియారా కామెంట్‌పై దుమారం

బాలీవుడ్ అగ్ర క‌థానాయిక‌ల్లో ఒక‌రైన కియారా అద్వానీ.. కెరీర్ పీక్స్‌లో ఉండ‌గానే త‌న స‌హ న‌టుడు సిద్దార్థ్ మ‌ల్హోత్రాను పెళ్లి…

3 hours ago

భ‌గీర‌థ్ కోసం లుకౌట్ నోటీసులు

బాలిక‌పై లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్న భ‌గీర‌థ్ విష‌యంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఆయ‌న దేశం విడిచి పారిపోకుండా…

3 hours ago

ప్రెస్ మీట్లో హీరో క‌న్నీళ్లు

త‌మిళ టాప్ స్టార్లలో ఒక‌డైన ర‌వి మోహ‌న్.. రెండేళ్ల ముందు భార్య ఆర్తి నుంచి విడిపోవ‌డం.. కెనీషా అనే సింగ‌ర్‌తో…

4 hours ago

మాఫియా పాత్రల ప్రభావంతో తల్లి ప్రాణమే తీశాడు..

రాజాంలో జరిగిన స్పందన హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. నవమాసాలు మోసి పెంచిన తల్లినే కన్నకొడుకు స్నేహితుడి…

5 hours ago

బుచ్చిబాబు ఆన్ డ్యూటీ… ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దర్శకుడు బుచ్చిబాబు వీడియో క్లిప్పులు దర్శనమిస్తున్నాయి. పెద్ది ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన…

5 hours ago