Political News

జగన్‌ దిగి రాక తప్పదా?


దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవాన్ని చూస్తున్నాం. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు తీవ్రత చాలా ఎక్కువ అన్నది స్పష్టం. ఒకప్పుడు రోజుకు గరిష్టంగా లక్ష కేసులు వస్తేనే గుండెలు బాదేసుకున్నాం. కానీ ఇప్పుడు రోజువారీ కేసులు 4 లక్షలకు చేరువగా ఉన్నాయి. రోజూ వేల సంఖ్యలోనే రోగులు ప్రాణాలు వదులతున్నారు. ప్రభుత్వాలు మరణాల విషయంలో సరైన డేటా ఇవ్వకపోవడం వల్ల కొందరికి తీవ్రత అర్థం కాక పోతుండొచ్చు.

ఈ సమయంలో మనిషి ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిందే. ముఖ్యంగా విద్యార్థుల పరీక్షల విషయంలో గత ఏడాది లాగే వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు దిగి వస్తున్నాయి. పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. తెలంగాణ సైతం పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, అంతర్గత పరీక్షల ఆధారంగా వారిని ప్రమోట్ చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. మాత్రం పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించబోతున్నారు. తొమ్మిదో తరగతి వరకు స్కూళ్లన్నీ మూసి వేయించి టెన్త్ విద్యార్థులకు మాత్రం పరీక్షలు ఉంటాయని ప్రకటించడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఈ నిర్ణయం పట్ల ఎవరూ సంతృప్తిగా లేరు. పిల్లల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదంటున్న తల్లిదండ్రులు ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. అయినా సరే.. జగన్ సర్కారు వెనక్కి తగ్గకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పటితో పోలిస్తే తీవ్రత బాగా పెరిగింది.

అమరావతిలో ముఖ్యమంత్రి రోజూ విధుల కోసం వెళ్లే సచివాలయంలో గత కొన్ని రోజుల్లో ఐదుగురు ఉద్యోగులు కరోనాతో ప్రాణాలు వదలడం గమనార్హం. తాను పని చేస్తున్న చోట పరిస్థితి ఇంత ప్రమాదకరంగా ఉన్నపుడు జగన్ పదో తరగతి విద్యార్థుల పరీక్షల విషయంలో అంత మొండిగా ఉండటం విడ్డూరం. ప్రతిపక్షాలకు ఇది ఆయుధంగా మారే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో జగన్ సర్కారు నిర్ణయం మార్చుకోక తప్పేలా లేదు.

This post was last modified on April 26, 2021 8:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవర 2 భవిష్యత్తు ఏంటి

బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…

4 hours ago

వైసీపీలో వ‌రుస అరెస్టులు.. అంతా రెడీనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ శుక్ర‌వారం నుంచి యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. దాదాపు 20 రోజుల‌కు పైగానే ఆయ‌న రాష్ట్రానికి దూరంగా…

4 hours ago

కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ చేస్తున్నారా?

తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…

5 hours ago

నిప్పురవ్వతో ఉస్తాద్ పోలిక చాలా బాగుంది

బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…

6 hours ago

‘చెడు’ చూపించకుంటే ‘మంచి’ బయోపిక్ ఎలా?

70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…

6 hours ago

ప్రేమ కావాలంటే డార్లింగ్ జోరు తగ్గాలి

కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…

6 hours ago