రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని పదే పదే వ్యాఖ్యలు సంధిస్తున్న బీజేపీ నేతలకు ఎక్కడికక్కడ ఎదుర వుతున్న వర్గ పోరు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు పగ్గాలు చేపట్టిన తర్వాత.. పార్టీలో అనేక మార్పులు తీసుకువచ్చారు. ప్రక్షాళన పేరుతో.. రాజకీయంగా దూకుడు గా ఉన్న నేతలను సైలెంట్ చేశారు. అదే సయమంలో ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇలా వచ్చిన వారికి బ్యాక్ గ్రౌండ్ ఉందా? లేదా? లేక.. నేతలకు ప్రజాబలం ఎంత ఉంది? అనే ఈక్వేషన్లు వేసుకోవడం మరిచిపోయి.. వచ్చిన వారిని వచ్చినట్టు పార్టీలో చేర్చుకున్నారు.
ఇంతవరకు ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే.. ఇలా వచ్చిన కొత్త వారికి సోము వీర్రాజు.. ప్రోత్సహిస్తు న్నాను అని చెప్పుకొనేందుకు.. వారికి కీలక పదవులు అప్పగించారు. అప్పటి వరకు ఉన్న సీనియర్లను సైతం పక్కన పెట్టి.. కొత్త వారికి అవకాశం కల్పించారు. దీంతో పార్టీలో నేతలు ఎవరికి వారు సోము వీర్రాజు నిర్ణయాలను వ్యతిరేకించడం ప్రారంభించారు. విజయనగరం నుంచి అనంతపురం వరకు ఇలాంటి పరిస్థితే కొనసాగింది.
పార్టీ అధినేత చెప్పిందే వేదం అనే విధంగా సోము వ్యవహరిస్తుండడంతో సీనియర్లు మౌనం పాటిస్తున్నారు. కొన్ని చోట్ల పార్టీ కార్యక్రమాలకు కూడా దూరం అవుతున్నారు. ఫలితంగా పార్టీలో ఐక్యత ఎక్కడా కనిపించడం లేదు. మేం పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నాం. ఇప్పుడు మమ్మల్ని పక్కన పెట్టడం ఎంత వరకు సమంజసం
అనే మాట సర్వత్రా వినిపిస్తోంది. అంతేకాదు.. పలు జిల్లాల్లో వర్గాలుగా విడిపోయి.. సొంత రాజకీయాలు చేసుకుంటున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి.
ఈ ఎఫెక్ట్ ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల సమయంలోనూ బీజేపీకి గట్టిగానే తగిలింది. ఎవరూ కలిసి రాలేదు. ఈ కారణంగానే స్థానిక ఎన్నికల్లో సత్తా చూపిస్తుందనే అంచనాలు వేసుకున్నా.. పార్టీ ఎక్కడా పుంజుకోలేదు. ఈ తరహా పరిణామాలు వద్దని.. బూత్ లెవెల్ కమిటీలు వేయాలని పార్టీ అధిష్టానం నుంచి కూడా పలుమార్లు సూచనలు వస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా పార్టీ దెబ్బతింటోంది. మరి ఇప్పటికైనా.. సోము వీర్రాజు.. అందరినీ కలుపుకొని వెళ్తారో లేదో చూడాలి.
This post was last modified on April 25, 2021 12:57 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…