రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని పదే పదే వ్యాఖ్యలు సంధిస్తున్న బీజేపీ నేతలకు ఎక్కడికక్కడ ఎదుర వుతున్న వర్గ పోరు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు పగ్గాలు చేపట్టిన తర్వాత.. పార్టీలో అనేక మార్పులు తీసుకువచ్చారు. ప్రక్షాళన పేరుతో.. రాజకీయంగా దూకుడు గా ఉన్న నేతలను సైలెంట్ చేశారు. అదే సయమంలో ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇలా వచ్చిన వారికి బ్యాక్ గ్రౌండ్ ఉందా? లేదా? లేక.. నేతలకు ప్రజాబలం ఎంత ఉంది? అనే ఈక్వేషన్లు వేసుకోవడం మరిచిపోయి.. వచ్చిన వారిని వచ్చినట్టు పార్టీలో చేర్చుకున్నారు.
ఇంతవరకు ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే.. ఇలా వచ్చిన కొత్త వారికి సోము వీర్రాజు.. ప్రోత్సహిస్తు న్నాను అని చెప్పుకొనేందుకు.. వారికి కీలక పదవులు అప్పగించారు. అప్పటి వరకు ఉన్న సీనియర్లను సైతం పక్కన పెట్టి.. కొత్త వారికి అవకాశం కల్పించారు. దీంతో పార్టీలో నేతలు ఎవరికి వారు సోము వీర్రాజు నిర్ణయాలను వ్యతిరేకించడం ప్రారంభించారు. విజయనగరం నుంచి అనంతపురం వరకు ఇలాంటి పరిస్థితే కొనసాగింది.
పార్టీ అధినేత చెప్పిందే వేదం అనే విధంగా సోము వ్యవహరిస్తుండడంతో సీనియర్లు మౌనం పాటిస్తున్నారు. కొన్ని చోట్ల పార్టీ కార్యక్రమాలకు కూడా దూరం అవుతున్నారు. ఫలితంగా పార్టీలో ఐక్యత ఎక్కడా కనిపించడం లేదు. మేం పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నాం. ఇప్పుడు మమ్మల్ని పక్కన పెట్టడం ఎంత వరకు సమంజసం అనే మాట సర్వత్రా వినిపిస్తోంది. అంతేకాదు.. పలు జిల్లాల్లో వర్గాలుగా విడిపోయి.. సొంత రాజకీయాలు చేసుకుంటున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి.
ఈ ఎఫెక్ట్ ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల సమయంలోనూ బీజేపీకి గట్టిగానే తగిలింది. ఎవరూ కలిసి రాలేదు. ఈ కారణంగానే స్థానిక ఎన్నికల్లో సత్తా చూపిస్తుందనే అంచనాలు వేసుకున్నా.. పార్టీ ఎక్కడా పుంజుకోలేదు. ఈ తరహా పరిణామాలు వద్దని.. బూత్ లెవెల్ కమిటీలు వేయాలని పార్టీ అధిష్టానం నుంచి కూడా పలుమార్లు సూచనలు వస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా పార్టీ దెబ్బతింటోంది. మరి ఇప్పటికైనా.. సోము వీర్రాజు.. అందరినీ కలుపుకొని వెళ్తారో లేదో చూడాలి.
This post was last modified on April 25, 2021 12:57 pm
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…
రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…
నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…