రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని పదే పదే వ్యాఖ్యలు సంధిస్తున్న బీజేపీ నేతలకు ఎక్కడికక్కడ ఎదుర వుతున్న వర్గ పోరు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు పగ్గాలు చేపట్టిన తర్వాత.. పార్టీలో అనేక మార్పులు తీసుకువచ్చారు. ప్రక్షాళన పేరుతో.. రాజకీయంగా దూకుడు గా ఉన్న నేతలను సైలెంట్ చేశారు. అదే సయమంలో ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇలా వచ్చిన వారికి బ్యాక్ గ్రౌండ్ ఉందా? లేదా? లేక.. నేతలకు ప్రజాబలం ఎంత ఉంది? అనే ఈక్వేషన్లు వేసుకోవడం మరిచిపోయి.. వచ్చిన వారిని వచ్చినట్టు పార్టీలో చేర్చుకున్నారు.
ఇంతవరకు ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే.. ఇలా వచ్చిన కొత్త వారికి సోము వీర్రాజు.. ప్రోత్సహిస్తు న్నాను అని చెప్పుకొనేందుకు.. వారికి కీలక పదవులు అప్పగించారు. అప్పటి వరకు ఉన్న సీనియర్లను సైతం పక్కన పెట్టి.. కొత్త వారికి అవకాశం కల్పించారు. దీంతో పార్టీలో నేతలు ఎవరికి వారు సోము వీర్రాజు నిర్ణయాలను వ్యతిరేకించడం ప్రారంభించారు. విజయనగరం నుంచి అనంతపురం వరకు ఇలాంటి పరిస్థితే కొనసాగింది.
పార్టీ అధినేత చెప్పిందే వేదం అనే విధంగా సోము వ్యవహరిస్తుండడంతో సీనియర్లు మౌనం పాటిస్తున్నారు. కొన్ని చోట్ల పార్టీ కార్యక్రమాలకు కూడా దూరం అవుతున్నారు. ఫలితంగా పార్టీలో ఐక్యత ఎక్కడా కనిపించడం లేదు. మేం పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నాం. ఇప్పుడు మమ్మల్ని పక్కన పెట్టడం ఎంత వరకు సమంజసం అనే మాట సర్వత్రా వినిపిస్తోంది. అంతేకాదు.. పలు జిల్లాల్లో వర్గాలుగా విడిపోయి.. సొంత రాజకీయాలు చేసుకుంటున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి.
ఈ ఎఫెక్ట్ ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల సమయంలోనూ బీజేపీకి గట్టిగానే తగిలింది. ఎవరూ కలిసి రాలేదు. ఈ కారణంగానే స్థానిక ఎన్నికల్లో సత్తా చూపిస్తుందనే అంచనాలు వేసుకున్నా.. పార్టీ ఎక్కడా పుంజుకోలేదు. ఈ తరహా పరిణామాలు వద్దని.. బూత్ లెవెల్ కమిటీలు వేయాలని పార్టీ అధిష్టానం నుంచి కూడా పలుమార్లు సూచనలు వస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా పార్టీ దెబ్బతింటోంది. మరి ఇప్పటికైనా.. సోము వీర్రాజు.. అందరినీ కలుపుకొని వెళ్తారో లేదో చూడాలి.
టాలీవుడ్లో బాగా ఔట్ స్పోకెన్ అని పేరున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సోషల్ మీడియాలో ఆయనకున్న పాపులారిటీనే వేరు. ప్రస్తుతం…
స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో నటించినపుడు వారి ఇమేజ్కు తగ్గ పాత్రలు లేకపోతే.. అభిమానులు ఫీలవడం…
ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి.…
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…