తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభ.. హైకోర్టులో పిటిషన్ వేశారు. తిరుపతి లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్ధించారు. ఎన్నికల అక్రమాలపై ఈ నెల 17న కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి తామిచ్చిన వినతి ఆధారంగా విచారణ జరిపి నివేదిక ఆందజేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, తిరుపతి లోక్సభ రిటర్నింగ్ అధికారి, రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి, ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.
అయితే.. రత్నప్రభ కు రాష్ట్ర బీజేపీ నేతలు ఎవరూ అండగా నిలబడక పోవడం గమనార్హం. నిజానికి ఆమె పోటీ చేసిన పార్టీ చిన్నా చితకా పార్టీ యేమీ కాదు. బీజేపీ కేంద్రంలో బలమైన పక్షంగా అధికారంలో ఉంది. అలాంటప్పుడు కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదనే విషయం చర్చకు వస్తోంది. అంతేకాదు, కేంద్ర ఎన్నికల సంఘం కూడా దాదాపు కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటకు, ఆదేశాలకు విలువ ఇస్తుంది. అలాంటప్పుడు కేంద్రానికి ఎందుకు వివరించలేదు. ఇక, కేంద్రంలోని బీజేపీ నేతలు.. తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
సో.. వారికి కూడా రత్నప్రభ వివరించే ప్రయత్నం చేయొచ్చు. కానీ, ఆమె మాత్రం ఎవరికీ చెప్పకుండానే ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. కేంద్రం ద్వారా సమస్యను సానుకూలంగా పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. రత్నప్రభ ఇలా చేశారంటే.. ఈ విషయంలో ఏదో అనుమానించాల్సిన పరిస్థితి నెలకొందనేది పరిశీలకుల మాట. పైగా రాష్ట్ర బీజేపీ నేతలు కూడా కోర్టు వ్యవహారంలో తమ జోక్యం లేనట్టే వ్యవహరిస్తున్నారు. కేవలం రత్న ప్రభే పిటిషన్ వేయడం.. దీనిని రాష్ట్ర నేతలు ఎవరూ మద్దతుగా మాట్లాడక పోవడం గమనార్హం.
నిజానికి బీజేపీ నేతల్లో చాలా మందికి రత్నప్రభ కేసు ఫైల్ చేసిన విషయం కూడా తెలియక పోవడం గమనార్హం. ఆమె విషయం పత్రికలో వచ్చిన తర్వాతే తెలిసిందని.. కోస్తాకు చెందిన బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అంటే.. మొత్తానికి రత్న ప్రభ.. వ్యవహారంలో బీజేపీ ఆశలు వదిలేసుకుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి రత్నప్రభ తన పోరాటాన్ని ఎంత దూరం తీసుకువెళ్తారో చూడాలి.
కొత్త శుక్రవారం వచ్చేసింది. పెద్దికి ఇవాళ తొమ్మిదో రోజు. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం రెండో వారం…
కమల్ హాసన్ అభిమానులే మర్చిపోయిన పేరు ఇండియన్. మొన్న ఏడాది దీని రెండో భాగం వచ్చి ఎంత డిజాస్టర్ అయ్యిందో…
విద్యాశాఖ మంత్రిగా టీడీపీ యువ నాయకుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్.. నారా లోకేష్ దూకుడు చూపిస్తున్నారు. నిజానికి విద్యా శాఖ…
ఈ రోజు విడుదలైన సింగ్ గీతం కమర్షియల్ గా ఎంత వసూలు చేస్తుంది, నిర్మాతలకు డబ్బులు ఇస్తుందా లేదానేది పక్కనపెడితే…
రాష్ట్రంలో కూటమిప్రభుత్వంఏర్పడి జూన్ 12కు రెండేళ్లు పూర్తయ్యాయి. 2024లో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు జనసేన అధినేత…
ఏపీలో పెను కలకలం రేపిన మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చేసింది. వైసీపీ…