జగన్మోహన్ రెడ్డి నిర్ణయంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఎంత ఉదృతంగా ఉన్నా, కేసులు ఎన్ని వేలు నమోదవుతున్నా 10వ తరగతి పరీక్షలను మాత్రం యధాతథంగా నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయించింది. జగన్ తాజా నిర్ణయంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. క్షేత్రస్ధాయిలో వాస్తవాలు తెలిసికూడా జగన్ 10వ తరగతి పరీక్షల నిర్వహణలో జగన్ ఎందుకింతగా పట్టుదలకు పోతున్నారో ఎవరికీ అర్ధం కావటంలేదు.
నిజానికి 10వ తరగతి పరీక్షలు నిర్వహించకపోయినా వచ్చే నష్టంలేదు. ఎందుకంటే ఇప్పటికే 10వ తరగతి పరీక్షలను రద్దుచేసి ఆటోమేటిక్ పాస్ చేసేయాలని చాలా రాష్ట్రాలు నిర్ణయించేశాయి. కొన్ని రాష్ట్రాలు ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నాయంటే తమ రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించే అవకాశాలు లేవు కాబట్టే. పరీక్షలకన్నా విద్యార్ధుల ప్రాణాలు ముఖ్యమని కూడా ఆయా ప్రభుత్వాలు భావించబట్టే పరీక్షలను రద్దుచేశాయి.
కానీ ఏపిలో మాత్రం పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం చాలా విచిత్రంగా వ్యవహరిస్తోంది. ప్రజల నుండే కాకుండా ప్రతిపక్షాలు కూడా 10వ తరగతి పరీక్షలను రద్దుచేయాలంటు చాలా డిమాండ్లే చేస్తున్నాయి. అయినా ఎందుకనో షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని జగన్ డిసైడ్ అయిపోయారు. సరే షెడ్యూల్ కు ముందేమైనా పరీక్షలను రద్దు చేస్తు ప్రభుత్వం నిర్ణయిస్తుందేమో తెలీదు. అయితే అప్పటివరకు విద్యార్ధులతో పాటు తల్లి, దండ్రుల్లో టెన్షన్ తప్పదు.
ఓ అంచనా ప్రకారం 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్ధుల సంఖ్య సుమారు 6 లక్షలు. ఇప్పటికే స్కూళ్ళల్లో టీచర్లు, విద్యార్ధులకు కరోనా వైరస్ సోకిన కారణంగా కొన్ని స్కూళ్ళను మూసేశారు. ఒకవైపు కరోనా నియంత్రణకోసం రాత్రుళ్ళు కర్ఫ్యూపెట్టారు. కరోనా నియంత్రణకు ఇన్ని చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఇదే సమయంలో పరీక్షల నిర్వహణలో మాత్రం ఎందుకింత మొండిపట్టుదలకు పోతోందో తెలీటంలేదు. పరీక్షల నిర్వహణపై జనాల్లో వ్యతిరేకత పెరగకముందే ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.
‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…
అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…
ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ…