“ప్రస్తుత పరిణామాలు ఏమాత్రం బాగోలేదు. మనమే సర్దుకు పోవాలి!”-ఇదీ టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి స్థానిక నేతలకు.. అందుతున్న సమాచారం. ఆయన నేరుగా చెప్పలేక పోయినా.. కీలక నేతల ద్వారా ఆయన మనసులో మాట చెప్పిస్తున్నారు. దీనికి కారణం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నేతలపై వైసీపీ సర్కారు వివిధ రూపాల్లో కేసులు నమోదు చేసింది. అదే సమయంలో ఆర్థికంగా కూడా వారి వ్యాపారాలను దెబ్బతీస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ మారాలని.. లేకపోతే.. ఇబ్బందులు తప్పవని ఒత్తిళ్లు కూడా వస్తున్నాయని వారు వాపోతున్నారు..
ఈ క్రమంలో ఏదైనా చేయాలంటూ.. పార్టీ సీనియర్లకు విన్నవిస్తున్నారు. దీంతో వారంతా కూడా అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరి విషయంలో స్పందిస్తున్నా.. మరికొందరి విషయాల్లో చంద్రబాబు స్పందించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం సర్దుకు పోవాలని.. త్వరలోనే మార్పు వస్తుందని.. ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కీలక నేతలు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. బాధల్లో ఉన్నవారిని ఊరడిస్తున్నారు. అయితే. వారు ఈ ఊరడింపులు కోరుకోవడం లేదు.
తమకు ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయంగా ఏదైనా మార్గం చూపించాలని అడుగుతున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి వంటి చోట గెలిస్తే.. పార్టీ తలెత్తుకుని పోరాడేందుకు అవకాశం ఉంటుందని బావించిన చంద్రబాబు అక్కడ తనే రంగంలోకి దిగారు. కానీ, ఫలితంపై మాత్రం ఊగిసలాట కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఏమీ చేసే పరిస్థితి లేదని.. సీనియర్లు కూడా చెప్పేస్తున్నారు. అయితే.. ఇలా నిర్బంధాలు ఎదుర్కొంటున్నవారిలో ఎక్కువ మంది మాజీ ఎమ్మెల్యేల అనుచరులు ఉండడం గమనార్హం.
పోనీ.. ఆ మాజీలైనా అందుబాటులో ఉన్నారా ? అంటే.. వారు కూడా తలకో దిక్కూ వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు పార్టీ మారడమా ? లేక.. వైసీపీ అధికారంలో ఉన్నంత సేపు మౌనంగా ఉండడమా ? అని నిర్ణయించుకుంటున్నారు. ఏదేమైనా.. టీడీపీలో అతిపెద్ద పెను సవాలుగా మారిన ఈ విషయాన్ని చంద్రబాబు సీరియస్గానే తీసుకున్నా.. ఇప్పటికిప్పుడు వారిని ఒడ్డెక్కించే ప్రయత్నం మాత్రం చేయలేక పోతుండడం గమనార్హం. ఇదే అలుసును కనిపెట్టిన వైసీపీ నేతలు మరింతగా రెచ్చిపోతున్నారని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
This post was last modified on April 22, 2021 10:52 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…