Political News

జగన్ తప్పు చేస్తున్నాడా ?

చుట్టుపక్కల ప్రపంచంలో ఏమి జరుగుతోందో చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగినట్లు లేదు. ఒకవైపు రోజుకు 7వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే మరణాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటువంటి నేపధ్యంలోనే అనేక రాష్ట్రాలు స్కూళ్ళని మూసేశారు. 10వ తరగతి పరీక్షలను రద్దు చేయటంతో పాటు ఇంటర్మీడియా మొదటిసంవత్సరం పరీక్షలను నిరవధికంగా వాయిదావేశారు.

చివరకు సీబీఎస్ఇ కూడా 10వ తరగతి పరీక్షను రద్దుచేసింది. ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణా, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలను రద్దుచేశాయి. ఇన్ని రాష్ట్రాలను చూసిన తర్వాత కూడా జగన్ మాత్రం తన మొండిగా ముందుకే వెళుతున్నారు. షెడ్యూల్ ప్రకారమే 10, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకే నిర్ణయించారు.

టెన్త్, ఇంటర్ పరీక్షలను యధాతథంగా జరగాలని నిర్ణయించుకున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. పైగా విద్యార్ధులు నష్టపోకుండా ఉండేదుకే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పటమే విచిత్రంగా ఉంది. విద్యార్ధుల ప్రాణాలు ముఖ్యమా ? లేకపోతే పరీక్షలు ముఖ్యమా ? అన్నదే ప్రభుత్వానికి అర్ధమైనట్లు లేదు. మొండిగా స్కూళ్ళని నిర్వహించటం వల్ల ఇప్పటికే అనేకమంది విద్యార్ధులకు కరోనా వైరస్ సోకింది. 1-9 తరగతుల మధ్య విద్యార్ధులకు శెలవులు ప్రకటించిన ప్రభుత్వం 10వ తరతగి విషయంలో మాత్రం విచిత్రమైన నిర్ణయం తీసుకుంది.

స్కూళ్ళల్లో కరోనా వైరస్ బయటపడుతుండటంతో తమ పిల్లలను స్కూళ్ళకు పంపటానికి తల్లి,దండ్రులు భయపడుతున్నారు. చాలా స్కూళ్ళలో విద్యార్ధుల హాజరు బాగా పడిపోయింది. జరుగుతున్న విషయాలను గమనించిన తర్వాత కూడా షెడ్యూల్ ప్రకారమే 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వం నిర్ణయంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. మొత్తానికి పరీక్షల నిర్వహణ నిర్ణయం ఉన్నతాధికారులదా ? లేకపోతే జగన్ దా అన్నదే తెలియటంలేదు. ఏదేమైనా నిందలు భరించాల్సింది మాత్రం తానే అన్న విషయాన్ని జగన్ గ్రహించాలి.

This post was last modified on April 20, 2021 11:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

13 minutes ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

47 minutes ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

2 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

4 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

6 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

7 hours ago