‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద 2020–21 ఫీజు రీయింబర్స్మెంట్ మొదటి విడత నగదును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. అయితే.. ఈ నిధుల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన సొమ్ములు ఏమైనా ఉన్నాయా? అంటే.. లేవు. వివిధ సామాజిక వర్గాల సంక్షేమం కోసం.. కేటాయించే నిధులనే గుండుగుత్తుగా చూపించి.. వీటినే విద్యాదీవెన కింద విడుదల చేయడం సీఎం జగన్ తెలివి తేటలకు నిదర్శనం అంటున్నారు పరిశీలకులు.
కాగా, విద్వాదీవెన ప్రారంభింస్తూ.. సీఎం ఏమన్నారంటే.. విద్యా దీవెన ద్వారా 10.88లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరుతుందన్నారు. “2018-19లో బకాయిలు ఉన్న రూ.1800 కోట్లను మన ప్రభుత్వమే చెల్లించింది. 2019-20 ఏడాదికి పూర్తి రీయింబర్స్మెంట్ను చెల్లించాం. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు లేకుండా చేశాం. ఏ ఏడాది ఫీజు రియింబర్స్మెంట్ను అదే ఏడాదిలో చెల్లిస్తున్నాం. నేరుగా తల్లుల ఖాతాల్లోకి నగదును జమ చేస్తున్నాం” అన్నారు.
ఈ సారి .. ప్రతి త్రైమాసికంలో నేరుగా తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని సీఎం చెప్పారు. అంగన్ వాడీ కేంద్రాలను ప్రీప్రైమరీలుగా మార్చామని, నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలను మార్చుతున్నామని, పిల్లల ప్రతి అడుగులో ప్రభుత్వం తోడుగా ఉందని వెల్లడించారు. పిల్లల తల్లులకు ప్రభుత్వం తరఫున లేఖలు కూడా రాశామని, వసతి దీవెన కూడా ఎప్పుడు ఇస్తామన్నది లేఖలో రాశామని సీఎం జగన్ పేర్కొన్నారు. మొదటి విడత కింద 10,88,439 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.671.45 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు.
ఇవీ.. నిధులు..
This post was last modified on April 19, 2021 3:07 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…