Political News

గాల్లో కరోనా.. సోషల్ మీడియాలో వైరల్ ..

గాల్లో కరోనా.. ఇప్పుడీ మాట సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ మస్తుగా వైరల్ గా మారుతోంది. ఒక అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్లుగా పేర్కొంటూ కొన్ని కథనాలు వార్తా పత్రికల్లో జోరుగా దర్శనమిస్తున్నాయి. దీంతో.. అప్రమత్తత కంటే ఆందోళనకు గురి అవుతున్న వారే ఎక్కువ. ఇలాంటి వేళ.. గాల్లో కరోనా వాదనలో వాస్తవం ఎంతన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీసీఎంబీకి చెందిన నిపుణులుకొందరు గాల్లో కరోనా ముప్పునకు సంబంధించిన ఒక అధ్యయనాన్ని గతంలో నిర్వహించారు.

తాజాగా దీనికి సంబంధించిన వివరాల్ని సీసీఎంబీ – ఏఐసీ సీఈవో డాక్టర్ మధుసూదన్ రావు వెల్లడించారు. తాము నిర్వహించిన అధ్యయనాల ప్రకారం కొవిడ్ పాజిటివ్ వ్యక్తుల నుంచి రెండు మీటర్ల దూరం వరకు వైరస్ సూక్ష్మ కణాలు వ్యాపించి ఉంటాయని.. రెండు గంటల కంటే ఎక్కువే గాల్లో ఉంటాయని గుర్తించారు. కోవిడ్ పేషెంట్లు ఒక గదిలో ఎంతసేపు గడిపారన్న అంశంపై దాని వ్యాప్తి ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

“ఏదైనా కుటుంబంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తిని త్వరగా గుర్తించి.. విడిగా ఉంచటం చాలా అవసరం. అలాంటి సమయాల్లో ఇంట్లోని వారంతా మాస్కులతో ఉండటం చాలామంచిది. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఒక గదికి పరిమితం చేయటం అవసరం. దీని ద్వారా వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉంది. సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటానికి కారణం కొత్త వైరస్సే అనటానికి సరైన ఆధారాలు లేవు. యూకే.. ఆఫ్రికా రకం వైరస్ కలిసి వ్యాపిస్తున్న డబుల్ మ్యూటెంటే కారణమని చెప్పలేం. కొన్ని కేసుల ఆధారంగా ఒక నిర్ణయానికి రాలేం. వైరస్ వేగంగా వ్యాపిస్తున్నందున జన సమూహాలు ఉండే ప్రాంతాలకు.. సినిమా హాల్.. ఆడిటోరియం లాంటి వాటి వద్దకు వెళ్లకపోవటం మంచిది” అని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా చెబుతున్నారు. సో.. గాల్లో కరోనా అన్నది అన్ని ప్రాంతాల్లో అని కాదు.. కోవిడ్ పాజిటివ్ పేషెంట్ ఉన్న ప్రాంతాల్లోని దగ్గర్లో అన్నది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

This post was last modified on April 18, 2021 11:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

2 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

4 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

4 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

5 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

13 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

14 hours ago