గాల్లో కరోనా.. ఇప్పుడీ మాట సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ మస్తుగా వైరల్ గా మారుతోంది. ఒక అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్లుగా పేర్కొంటూ కొన్ని కథనాలు వార్తా పత్రికల్లో జోరుగా దర్శనమిస్తున్నాయి. దీంతో.. అప్రమత్తత కంటే ఆందోళనకు గురి అవుతున్న వారే ఎక్కువ. ఇలాంటి వేళ.. గాల్లో కరోనా వాదనలో వాస్తవం ఎంతన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీసీఎంబీకి చెందిన నిపుణులుకొందరు గాల్లో కరోనా ముప్పునకు సంబంధించిన ఒక అధ్యయనాన్ని గతంలో నిర్వహించారు.
తాజాగా దీనికి సంబంధించిన వివరాల్ని సీసీఎంబీ – ఏఐసీ సీఈవో డాక్టర్ మధుసూదన్ రావు వెల్లడించారు. తాము నిర్వహించిన అధ్యయనాల ప్రకారం కొవిడ్ పాజిటివ్ వ్యక్తుల నుంచి రెండు మీటర్ల దూరం వరకు వైరస్ సూక్ష్మ కణాలు వ్యాపించి ఉంటాయని.. రెండు గంటల కంటే ఎక్కువే గాల్లో ఉంటాయని గుర్తించారు. కోవిడ్ పేషెంట్లు ఒక గదిలో ఎంతసేపు గడిపారన్న అంశంపై దాని వ్యాప్తి ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
“ఏదైనా కుటుంబంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తిని త్వరగా గుర్తించి.. విడిగా ఉంచటం చాలా అవసరం. అలాంటి సమయాల్లో ఇంట్లోని వారంతా మాస్కులతో ఉండటం చాలామంచిది. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఒక గదికి పరిమితం చేయటం అవసరం. దీని ద్వారా వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉంది. సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటానికి కారణం కొత్త వైరస్సే అనటానికి సరైన ఆధారాలు లేవు. యూకే.. ఆఫ్రికా రకం వైరస్ కలిసి వ్యాపిస్తున్న డబుల్ మ్యూటెంటే కారణమని చెప్పలేం. కొన్ని కేసుల ఆధారంగా ఒక నిర్ణయానికి రాలేం. వైరస్ వేగంగా వ్యాపిస్తున్నందున జన సమూహాలు ఉండే ప్రాంతాలకు.. సినిమా హాల్.. ఆడిటోరియం లాంటి వాటి వద్దకు వెళ్లకపోవటం మంచిది” అని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా చెబుతున్నారు. సో.. గాల్లో కరోనా అన్నది అన్ని ప్రాంతాల్లో అని కాదు.. కోవిడ్ పాజిటివ్ పేషెంట్ ఉన్న ప్రాంతాల్లోని దగ్గర్లో అన్నది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
This post was last modified on April 18, 2021 11:52 am
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…