Political News

తిరుప‌తి అరాచ‌కాన్ని ప్రశ్నించ‌ని బీజేపీ.. రీజ‌నేంటి?

తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాం.. గెలిచి తీరుతాం.. అంటూ ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన బీజేపీ నేతలు.. ఇప్పుడు అస‌లైన యుద్ధంలో అధికార పార్టీ వైసీపీ నుంచి అరాచ‌కాలు జ‌రుగుతున్నట్టు పెద్ద ఎత్తున మీడియాలో సాక్ష్యాల‌తో స‌హా గుట్టు బ‌య‌ట పెడుతుంటే.. ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా కిమ్మ‌న‌కుండా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం రాజ‌కీయంగానే కాకుండా.. సాధార‌ణ పౌరుల మ‌ధ్య కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు.. ఇత‌ర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వంద‌ల కొద్దీ బ‌స్సులు తిరుప‌తిపార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌కు క్యూ క‌ట్టాయి.

దాదాపు 250 బ‌స్సుల‌ను తాము సీజ్ చేసి.. వెన‌క్కి పంపించామ‌ని.. సాక్షాత్తూ డీజీపీ గౌతం సవాంగే వెల్ల‌డించారు. ఇక‌, ప‌ట్టుబడని బ‌స్సులు.. పోలీసుల క‌న్న‌గ‌ప్పి.. తిరుప‌తికి చేరుకున్న బ‌స్సుల సంఖ్య వీటికి రెండింత‌లు ఉంటుంద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో దొంగ ఓట‌ర్ల హ‌వాను అరిక‌ట్టేందుకు.. ప్ర‌తిప‌క్షం టీడీపీ జోరుగా రంగంలోకి దిగి ఎక్క‌క్క‌డ ప్ర‌శ్నిస్తున్నారు. ఓట‌రు కార్డు ల్లోని పేర్ల‌ను ప్ర‌శ్నిస్తూ.. దొంగ ఓట‌ర్ల గుట్టును బ‌ట్ట‌బ‌య‌లు చేస్తున్నారు. వాస్త‌వానికి ప్ర‌స్తుతం తిరుప‌తి ఉప ఎన్నిక బాధ్య‌త‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే చూస్తోంది. ఈ క్ర‌మంలో కేంద్రంలోని పెద్ద‌ల‌కు రాష్ట్ర బీజేపీ నేత‌లు ఫిర్యాదు చేసే అవ‌కాశం ఉంది.

అంతేకాదు.. పెద్ద ఎత్తున సాగిన దొంగ ఓట్ల త‌తంగానికి ఫుల్ స్టాప్ పెట్టేలా కూడా రాష్ట్ర బీజేపీ నేత‌లు చ‌ర్య‌లు తీసుకుని ఉండాల్సింది. కానీ, తిరుప‌తి బ‌రిలో పోటీ చేస్తున్న ర‌త్న ప్ర‌భ త‌ప్ప‌.. ఏ ఒక్క‌రూ స్పందించ‌లేదు. కీల‌క‌మైన నాయ‌కులు సోము వీర్రాజు, విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి, జీవీఎల్ న‌ర‌సింహారావు.. వంటివారు ఏమ‌య్యారు.? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. తాము ఎలాగూ.. గెలిచే ప‌రిస్థితి లేదుక‌నుక‌.. వైసీపీకి స‌హ‌క‌రిస్తే.. మున్ముందు.. ‘మేళ్లు’ జ‌రుగుతాయ‌ని.. ఆశించారా? లేక‌.. ముందుగానే చేసుకున్న ఒప్పందం మేర‌కు మిలాఖ‌త్ అయి.. సైలెంట్ అయ్యారా? అనేది ఇప్పుడు తిరుప‌తి ఉప ఎన్నిక‌ల‌ను నిశితంగా ప‌రిశీలిస్తున్న వారి నుంచి ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌.

ఎక్క‌డైనా చిన్న‌తేడా వ‌స్తే.. ఫ‌లితం తారుమారు అవుతుంద‌ని.. పార్టీలు గ‌గ్గోలు పెడుతుంటాయి. అయితే..నేరుగా వేలాది మందిని త‌ర‌లించి.. దొంగ ఓట్లు వేయిస్తున్న వైనం.. రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్నా.. క‌మ‌ల నాథుల‌కు చీమ‌కుట్టిన‌ట్టుకూడా అనిపించ‌క‌పోవ‌డంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం.. అనుమానం క‌లుగుతున్నాయి. మ‌రి ఏం చెబుతారో చూడాలి. చేతిలో కేంద్ర ప్ర‌బుత్వాన్ని పెట్టుకుని.. ఇప్పుడు ఇలా రాష్ట్ర ప్ర‌భుత్వానికి లొంగిపోయారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 17, 2021 7:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అభిమానులను ఊరిస్తున్న ‘ఉస్తాద్’ తొలిప్రేమ

ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

49 minutes ago

రీల్ కోసం స్టంట్… ప్రాణం తీసిన తుపాకీ

ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…

2 hours ago

పిఠాపురానికి ప్ర‌త్యేకం.. ప‌వ‌న్ ఏం చేశారంటే ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయ‌ల‌పై ప‌ట్టు పెంచుకునే విధంగా కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన…

2 hours ago

దేవి కోసమే తమన్‌‌ రాలేదట

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…

4 hours ago

చివరి నిమిషం ఒత్తిడిలో దురంధర్ రివెంజ్

రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…

4 hours ago

స్వయంభు సౌండ్ చాలా పెంచాలి

ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…

4 hours ago