Political News

పెద్దిరెడ్డి క‌వ‌రింగ్‌: వాళ్లంతా టూరిస్టులేన‌ట‌

తిరుప‌తి పార్లమెంటు స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌స్తున్న దొంగ ఓట‌ర్ల హ‌వా ఎక్కువ‌గా ఉంది. ప‌ర్మినెంటుగా.. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార పార్టీ నేత‌లు వీరిని ప్రోత్స‌హించి.. తిరుప‌తికి పంపించి.. భారీ ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నార‌ని.. టీడీపీ ఆరోపిస్తోంది. ఈక్ర‌మంలో ఎన్న‌డూ లేనిది.. తిరుప‌తికి.. ఇత‌ర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున బ‌స్సులు క్యూక‌ట్టాయి. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. ఏ ఒక్క బ‌స్సూ.. ఆర్టీసీది కాదు. అన్నీ ప్రైవేటు టూరిస్టు బ‌స్సులే. ఈ బ‌స్సుల్లోంచి నేరుగా.. ఎన్నిక‌ల పోలింగ్ కేంద్రాల‌కు కూత‌వేటు దూరంలో దిగుతున్న యువ‌తీయువ‌కులు, మ‌హిళ‌లు.. నేరుగా.. కేంద్రాల్లోకి వెళ్తున్నారు.

అయితే.. ఈ విష‌యంలో అలెర్ట్ అయిన‌.. ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కులు.. దొంగ ఓట‌ర్ల‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. వీరిని మీడియా ముందుకు తీసుకువ‌చ్చి.. ప్ర‌శ్నిస్తున్నారు. అయితే.. ఈ ఉదంతంపై మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి హుటాహుటిన స్పందించారు. త‌న‌దైన శైలిలో .. క‌వ‌రింగ్ ఇచ్చారు. వాళ్లంతా టూరిస్టుల‌ని.. తిరుమ‌ల బాలాజీ ద‌ర్శ‌నం కోసం వ‌చ్చార‌ని.. దీనిని కూడా టీడీపీ రాజ‌కీయం చేస్తోంద‌నివిరుచుకుప‌డ్డారు. అంతేకాదు.. టీడీపీ ఓట‌మిని ఎదుర్కొనే స‌త్తాలేక‌.. ఇలా ఎదురు దాడి చేస్తూ.. శ్రీవారి భ‌క్తుల‌ను కూడా అవ‌మానిస్తోంద‌ని అన్నారు.

అయితే.. పెద్దిరెడ్డి చుట్టూ కొన్ని ప్ర‌శ్న‌లు స‌మాధానం లేకుండా ఉండ‌డం గ‌మ‌నార్హం. అవేంటంటే..

  • వ‌చ్చిన‌వారు శ్రీవారి భ‌క్తులే అయితే.. వారికి పోలింగ్ కేంద్రాల‌తో సంబంధం ఎందుకు?
  • బ‌స్సుల్లోంచి, జీపుల్లోంచి దిగుతున్న వారు టూరిస్టులే అయితే.. వారివ‌ద్ద క‌నీసం బ్యాగేజీ అయినా ఉండాలిగా? కానీ, ఏమీ లేదుగా!
  • టూరిస్టుల ద‌గ్గ‌ర ఓట‌రు కార్డులు ఎందుకు ఉన్నాయి? ఉంటాయి?
  • టూరిస్టులు అయితే.. వారి పిల్లా పాప‌లు ఎక్క‌డ‌? క‌నీసం ప‌ది మందిలో ఇద్ద‌రు ముగ్గురుకైనా.. పిల్ల‌లు ఉండ‌రా? తిరుమ‌ల క్షేత్రానికి వ‌చ్చేప్పుడు వారిని తీసుకురాకుండా ఉంటారా?
  • టూరిస్టులే అయితే.. మీడియా వెంట‌బ‌డిన‌ప్పుడు.. భ‌య‌ప‌డి పారిపోవ‌డం ఎందుకు?

.. ఇలా అనేక ప్ర‌శ్న‌లు స‌మాధానం లేనివిగా మిగిలిపోయాయంటే.. వీటికి మంత్రి పెద్దిరెడ్డి ఆన్స‌ర్ చేయ‌లేక‌పోయారంటే.. ఖ‌చ్చితంగా ఏదో మ‌త‌ల‌బు ఉంద‌నే విష‌యం స్ప‌ష్టం కావ‌డంలేదా? ఎంత క‌ల‌రింగ్ ఇచ్చినా.. దొంగ ఓట‌ర్ల‌ను ఆప‌డం సాధ్యం కావ‌డంలేదు.. అనే మాట‌.. వైసీపీలోనే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 17, 2021 2:31 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

1 hour ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

2 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

3 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

3 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

4 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

6 hours ago