తిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న దొంగ ఓటర్ల హవా ఎక్కువగా ఉంది. పర్మినెంటుగా.. కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు వీరిని ప్రోత్సహించి.. తిరుపతికి పంపించి.. భారీ ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నారని.. టీడీపీ ఆరోపిస్తోంది. ఈక్రమంలో ఎన్నడూ లేనిది.. తిరుపతికి.. ఇతర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున బస్సులు క్యూకట్టాయి. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఏ ఒక్క బస్సూ.. ఆర్టీసీది కాదు. అన్నీ ప్రైవేటు టూరిస్టు బస్సులే. ఈ బస్సుల్లోంచి నేరుగా.. ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు కూతవేటు దూరంలో దిగుతున్న యువతీయువకులు, మహిళలు.. నేరుగా.. కేంద్రాల్లోకి వెళ్తున్నారు.
అయితే.. ఈ విషయంలో అలెర్ట్ అయిన.. ప్రతిపక్ష పార్టీల నాయకులు.. దొంగ ఓటర్లను అడ్డుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వీరిని మీడియా ముందుకు తీసుకువచ్చి.. ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఈ ఉదంతంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హుటాహుటిన స్పందించారు. తనదైన శైలిలో .. కవరింగ్ ఇచ్చారు. వాళ్లంతా టూరిస్టులని.. తిరుమల బాలాజీ దర్శనం కోసం వచ్చారని.. దీనిని కూడా టీడీపీ రాజకీయం చేస్తోందనివిరుచుకుపడ్డారు. అంతేకాదు.. టీడీపీ ఓటమిని ఎదుర్కొనే సత్తాలేక.. ఇలా ఎదురు దాడి చేస్తూ.. శ్రీవారి భక్తులను కూడా అవమానిస్తోందని అన్నారు.
అయితే.. పెద్దిరెడ్డి చుట్టూ కొన్ని ప్రశ్నలు సమాధానం లేకుండా ఉండడం గమనార్హం. అవేంటంటే..
.. ఇలా అనేక ప్రశ్నలు సమాధానం లేనివిగా మిగిలిపోయాయంటే.. వీటికి మంత్రి పెద్దిరెడ్డి ఆన్సర్ చేయలేకపోయారంటే.. ఖచ్చితంగా ఏదో మతలబు ఉందనే విషయం స్పష్టం కావడంలేదా? ఎంత కలరింగ్ ఇచ్చినా.. దొంగ ఓటర్లను ఆపడం సాధ్యం కావడంలేదు.. అనే మాట.. వైసీపీలోనే వినిపిస్తుండడం గమనార్హం.
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…
మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహించిన…
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…