తిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న దొంగ ఓటర్ల హవా ఎక్కువగా ఉంది. పర్మినెంటుగా.. కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు వీరిని ప్రోత్సహించి.. తిరుపతికి పంపించి.. భారీ ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నారని.. టీడీపీ ఆరోపిస్తోంది. ఈక్రమంలో ఎన్నడూ లేనిది.. తిరుపతికి.. ఇతర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున బస్సులు క్యూకట్టాయి. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఏ ఒక్క బస్సూ.. ఆర్టీసీది కాదు. అన్నీ ప్రైవేటు టూరిస్టు బస్సులే. ఈ బస్సుల్లోంచి నేరుగా.. ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు కూతవేటు దూరంలో దిగుతున్న యువతీయువకులు, మహిళలు.. నేరుగా.. కేంద్రాల్లోకి వెళ్తున్నారు.
అయితే.. ఈ విషయంలో అలెర్ట్ అయిన.. ప్రతిపక్ష పార్టీల నాయకులు.. దొంగ ఓటర్లను అడ్డుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వీరిని మీడియా ముందుకు తీసుకువచ్చి.. ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఈ ఉదంతంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హుటాహుటిన స్పందించారు. తనదైన శైలిలో .. కవరింగ్ ఇచ్చారు. వాళ్లంతా టూరిస్టులని.. తిరుమల బాలాజీ దర్శనం కోసం వచ్చారని.. దీనిని కూడా టీడీపీ రాజకీయం చేస్తోందనివిరుచుకుపడ్డారు. అంతేకాదు.. టీడీపీ ఓటమిని ఎదుర్కొనే సత్తాలేక.. ఇలా ఎదురు దాడి చేస్తూ.. శ్రీవారి భక్తులను కూడా అవమానిస్తోందని అన్నారు.
అయితే.. పెద్దిరెడ్డి చుట్టూ కొన్ని ప్రశ్నలు సమాధానం లేకుండా ఉండడం గమనార్హం. అవేంటంటే..
.. ఇలా అనేక ప్రశ్నలు సమాధానం లేనివిగా మిగిలిపోయాయంటే.. వీటికి మంత్రి పెద్దిరెడ్డి ఆన్సర్ చేయలేకపోయారంటే.. ఖచ్చితంగా ఏదో మతలబు ఉందనే విషయం స్పష్టం కావడంలేదా? ఎంత కలరింగ్ ఇచ్చినా.. దొంగ ఓటర్లను ఆపడం సాధ్యం కావడంలేదు.. అనే మాట.. వైసీపీలోనే వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on April 17, 2021 2:31 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…