తిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న దొంగ ఓటర్ల హవా ఎక్కువగా ఉంది. పర్మినెంటుగా.. కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు వీరిని ప్రోత్సహించి.. తిరుపతికి పంపించి.. భారీ ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నారని.. టీడీపీ ఆరోపిస్తోంది. ఈక్రమంలో ఎన్నడూ లేనిది.. తిరుపతికి.. ఇతర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున బస్సులు క్యూకట్టాయి. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఏ ఒక్క బస్సూ.. ఆర్టీసీది కాదు. అన్నీ ప్రైవేటు టూరిస్టు బస్సులే. ఈ బస్సుల్లోంచి నేరుగా.. ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు కూతవేటు దూరంలో దిగుతున్న యువతీయువకులు, మహిళలు.. నేరుగా.. కేంద్రాల్లోకి వెళ్తున్నారు.
అయితే.. ఈ విషయంలో అలెర్ట్ అయిన.. ప్రతిపక్ష పార్టీల నాయకులు.. దొంగ ఓటర్లను అడ్డుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వీరిని మీడియా ముందుకు తీసుకువచ్చి.. ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఈ ఉదంతంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హుటాహుటిన స్పందించారు. తనదైన శైలిలో .. కవరింగ్ ఇచ్చారు. వాళ్లంతా టూరిస్టులని.. తిరుమల బాలాజీ దర్శనం కోసం వచ్చారని.. దీనిని కూడా టీడీపీ రాజకీయం చేస్తోందనివిరుచుకుపడ్డారు. అంతేకాదు.. టీడీపీ ఓటమిని ఎదుర్కొనే సత్తాలేక.. ఇలా ఎదురు దాడి చేస్తూ.. శ్రీవారి భక్తులను కూడా అవమానిస్తోందని అన్నారు.
అయితే.. పెద్దిరెడ్డి చుట్టూ కొన్ని ప్రశ్నలు సమాధానం లేకుండా ఉండడం గమనార్హం. అవేంటంటే..
.. ఇలా అనేక ప్రశ్నలు సమాధానం లేనివిగా మిగిలిపోయాయంటే.. వీటికి మంత్రి పెద్దిరెడ్డి ఆన్సర్ చేయలేకపోయారంటే.. ఖచ్చితంగా ఏదో మతలబు ఉందనే విషయం స్పష్టం కావడంలేదా? ఎంత కలరింగ్ ఇచ్చినా.. దొంగ ఓటర్లను ఆపడం సాధ్యం కావడంలేదు.. అనే మాట.. వైసీపీలోనే వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on April 17, 2021 2:31 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…