తిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న దొంగ ఓటర్ల హవా ఎక్కువగా ఉంది. పర్మినెంటుగా.. కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు వీరిని ప్రోత్సహించి.. తిరుపతికి పంపించి.. భారీ ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నారని.. టీడీపీ ఆరోపిస్తోంది. ఈక్రమంలో ఎన్నడూ లేనిది.. తిరుపతికి.. ఇతర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున బస్సులు క్యూకట్టాయి. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఏ ఒక్క బస్సూ.. ఆర్టీసీది కాదు. అన్నీ ప్రైవేటు టూరిస్టు బస్సులే. ఈ బస్సుల్లోంచి నేరుగా.. ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు కూతవేటు దూరంలో దిగుతున్న యువతీయువకులు, మహిళలు.. నేరుగా.. కేంద్రాల్లోకి వెళ్తున్నారు.
అయితే.. ఈ విషయంలో అలెర్ట్ అయిన.. ప్రతిపక్ష పార్టీల నాయకులు.. దొంగ ఓటర్లను అడ్డుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వీరిని మీడియా ముందుకు తీసుకువచ్చి.. ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఈ ఉదంతంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హుటాహుటిన స్పందించారు. తనదైన శైలిలో .. కవరింగ్ ఇచ్చారు. వాళ్లంతా టూరిస్టులని.. తిరుమల బాలాజీ దర్శనం కోసం వచ్చారని.. దీనిని కూడా టీడీపీ రాజకీయం చేస్తోందనివిరుచుకుపడ్డారు. అంతేకాదు.. టీడీపీ ఓటమిని ఎదుర్కొనే సత్తాలేక.. ఇలా ఎదురు దాడి చేస్తూ.. శ్రీవారి భక్తులను కూడా అవమానిస్తోందని అన్నారు.
అయితే.. పెద్దిరెడ్డి చుట్టూ కొన్ని ప్రశ్నలు సమాధానం లేకుండా ఉండడం గమనార్హం. అవేంటంటే..
.. ఇలా అనేక ప్రశ్నలు సమాధానం లేనివిగా మిగిలిపోయాయంటే.. వీటికి మంత్రి పెద్దిరెడ్డి ఆన్సర్ చేయలేకపోయారంటే.. ఖచ్చితంగా ఏదో మతలబు ఉందనే విషయం స్పష్టం కావడంలేదా? ఎంత కలరింగ్ ఇచ్చినా.. దొంగ ఓటర్లను ఆపడం సాధ్యం కావడంలేదు.. అనే మాట.. వైసీపీలోనే వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on April 17, 2021 2:31 pm
బాలీవుడ్లో విలక్షణ పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించి.. దక్షిణాదిన కూడా కొన్ని సినిమాల్లో నటించింది రాధికా ఆప్టే.. ‘ధోని’, ‘కబాలి’ చిత్రాల్లో నటించిన…
మంచు ఫ్యామిలీ గొడవ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్గా మారిపోన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు…
"ఈ రోజు నుంచే.. ఈ క్షణం నుంచే నేను రాజకీయాల్లోకి వస్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే ప్రకటిస్తా. జగన్…
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కల్యాణ్ సతీమణి, ఇటాలియన్ అన్నాలెజెనోవో తిరుమల…
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…