తిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న దొంగ ఓటర్ల హవా ఎక్కువగా ఉంది. పర్మినెంటుగా.. కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు వీరిని ప్రోత్సహించి.. తిరుపతికి పంపించి.. భారీ ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నారని.. టీడీపీ ఆరోపిస్తోంది. ఈక్రమంలో ఎన్నడూ లేనిది.. తిరుపతికి.. ఇతర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున బస్సులు క్యూకట్టాయి. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఏ ఒక్క బస్సూ.. ఆర్టీసీది కాదు. అన్నీ ప్రైవేటు టూరిస్టు బస్సులే. ఈ బస్సుల్లోంచి నేరుగా.. ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు కూతవేటు దూరంలో దిగుతున్న యువతీయువకులు, మహిళలు.. నేరుగా.. కేంద్రాల్లోకి వెళ్తున్నారు.
అయితే.. ఈ విషయంలో అలెర్ట్ అయిన.. ప్రతిపక్ష పార్టీల నాయకులు.. దొంగ ఓటర్లను అడ్డుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వీరిని మీడియా ముందుకు తీసుకువచ్చి.. ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఈ ఉదంతంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హుటాహుటిన స్పందించారు. తనదైన శైలిలో .. కవరింగ్ ఇచ్చారు. వాళ్లంతా టూరిస్టులని.. తిరుమల బాలాజీ దర్శనం కోసం వచ్చారని.. దీనిని కూడా టీడీపీ రాజకీయం చేస్తోందనివిరుచుకుపడ్డారు. అంతేకాదు.. టీడీపీ ఓటమిని ఎదుర్కొనే సత్తాలేక.. ఇలా ఎదురు దాడి చేస్తూ.. శ్రీవారి భక్తులను కూడా అవమానిస్తోందని అన్నారు.
అయితే.. పెద్దిరెడ్డి చుట్టూ కొన్ని ప్రశ్నలు సమాధానం లేకుండా ఉండడం గమనార్హం. అవేంటంటే..
.. ఇలా అనేక ప్రశ్నలు సమాధానం లేనివిగా మిగిలిపోయాయంటే.. వీటికి మంత్రి పెద్దిరెడ్డి ఆన్సర్ చేయలేకపోయారంటే.. ఖచ్చితంగా ఏదో మతలబు ఉందనే విషయం స్పష్టం కావడంలేదా? ఎంత కలరింగ్ ఇచ్చినా.. దొంగ ఓటర్లను ఆపడం సాధ్యం కావడంలేదు.. అనే మాట.. వైసీపీలోనే వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on April 17, 2021 2:31 pm
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…