Political News

జ‌గ‌న్ బాట‌లో టీడీపీ.. సోష‌ల్ ఇంజ‌నీరింగ్ త‌థ్యం..!


టీడీపీలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయ‌నే విష‌యాన్ని ఆ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సూచ‌న ప్రాయంగా చెప్పేశారు. త్వ‌ర‌లోనే అంటే.. తిరుప‌తి పార్ల‌మెంటుకు జ‌రుగుతున్న ఉప ఎన్నిక ముగియ‌గానే.. క‌ష్ట ప‌డుతున్న‌.. పార్టీ కోసం శ్ర‌మిస్తున్న వారిని వెతికి ప‌ట్టుకుని మ‌రీ.. ప్రాధాన్యం ఇస్తాన‌ని.. వారికి అండ‌గా ఉంటాన‌ని ఆయ‌న తాజాగా ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో ఒక్క‌సారిగా టీడీపీలో భారీ మార్పులు ఖాయ‌మ‌నే వాద‌న త‌మ్ముళ్ల‌లో చ‌ర్చ‌కు వ‌స్తోంది.

మ‌రి ఏం జ‌రుగుతుంది? నిజానికి 2019 ఎన్నిక‌ల్లో భారీ ఓట‌మి త‌ర్వాత టీడీపీలో పెను మార్పులు తీసుకు వ‌స్తానంటూ.. చంద్ర‌బాబు.. అనేక మందికి ప‌ద‌వులు ఇచ్చారు. పార్ల‌మెంట‌రీ స్థాయి ప‌ద‌వుల నుంచి మండ‌లాల వారీగా కూడా ప‌ద‌వులు కేటాయించారు. అంద‌రికీ ప‌ద‌వులు అనే సూత్రాన్ని ఆధారం చేసుకుని ప్ర‌తి ఒక్క‌రికీ ప‌దవులు పంచారు. అయిన‌ప్ప‌టికీ.. తాజాగా జ‌రిగిన స్థానిక‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఓట‌మి పార్టీని పూర్తిగా డీలా ప‌డేలా చేసింది. ఈ ఎఫెక్ట్ తిరుప‌తిపై కూడా క‌నిపించింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

అయితే.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో పార్టీని పున‌రుజ్జీవింపజేయాలంటే.. సీఎం జ‌గ‌న్ బాట‌లో న‌డ‌వ‌డం త‌ప్ప చంద్ర‌బాబు ముందు మ‌రో ఆప్ష‌న్ లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు ఇచ్చిన ప్రాధాన్యం గ‌మ‌నిస్తే.. పార్టీలో సీనియ‌ర్ల‌కే ఎక్కువ‌గా ఆయ‌న ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే.. వారంతా ఔట్ డేటెడ్ అయిపోయారు. ఎక్క‌డా కూడా కొత్త మొఖాలు క‌నిపించ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన వారు.. వ‌రుస‌గా ఓట‌ములు చ‌విచూస్తున్న‌వారికే ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. కానీ, వైసీపీని తీసుకుంటే.. నేత ఎవ‌ర‌నేది కాదు.. నాయ‌కుడిని బ‌ట్టి.. పార్టీ ఉంటుంద‌నే విష‌యాన్ని స్ప‌ష్టంగా చెబుతున్నారు.

ఇప్పుడు ఇదే సూత్రం ఆధారంగా పార్టీని బ‌లోపేతం చేయాలంటే.. ఎవ‌రు ఏ మూల జెండా ప‌ట్టుకున్నా.. అతి త‌క్కువ స‌మ‌యంలో ఆర్థిక‌, సామాజిక వ‌ర్గాల ఆధారంగా కాకుండా ప‌నితీరును బ‌ట్టి.. ప్రాధాన్యం ఉంటుంద‌నే సంకేతాలు పంపించ‌డం త‌క్ష‌ణావ‌స‌ర‌మ‌నే వాద‌న టీడీపీలోనూ వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ ఇంజ‌నీరింగ్ దిశ‌గా చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నార‌ని.. ఇది తిరుప‌తి ఎన్నిక‌ల్లో వ‌చ్చే ఫ‌లితాన్ని బ‌ట్టి కొంత ఆధార‌ప‌డినా.. మొత్తంగా అయితే.. స‌మూల మార్పులు ఉంటాయ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on April 17, 2021 1:38 pm

Share

Recent Posts

మాస్ ప్రేక్షకులకు ‘ముడి’ వేస్తే చాలు

ఈ వారం విడుదల కాబోతున్న ఇరుముడికి మంచి ఓపెనింగ్ దక్కడం ఖాయం. మాస్ మహారాజా ట్రాక్ రికార్డు పక్కన పెడితే…

12 minutes ago

తెరపైకి దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ

దేశంలో కొత్త రాజకీయ వాతావరణం కనిపిస్తుంది. మూస పార్టీలకు భిన్నంగా సరికొత్త ఆన్ లైన్ పార్టీలు పుట్టుకొని వస్తున్నాయి. నిముషాల…

51 minutes ago

మేకింగ్ వీడియోలతో కామెడీ చేస్తున్నారా

ఇటీవలే విడుదలైన విశాల్ మకుటం దారుణంగా ఫ్లాప్ అయ్యింది. డిజాస్టర్ అనే మాట చిన్నదే అనిపిస్తుంది కలెక్షన్లు చూస్తే. మొదటి…

57 minutes ago

నోలన్‌తో సినిమా… అందులో అతి ఏముంది?

క్రిస్టోఫర్ నోలన్‌తో ఎప్పటికైనా పని చేయాలని ఉందని కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ అనగానే సోషల్ మీడియాలో రకరకాల…

1 hour ago

భారత ఎన్నికల విధానం అమెరికాలో రావాలి: ట్రంప్

అమెరికా ఎన్నికల వ్యవస్థలో ఓటరు గుర్తింపు నిబంధనలను కఠినతరం చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా…

2 hours ago

తండ్రికే ఎదురు తిరిగిన జోగి రాజీవ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో ఆ పార్టీ నేత‌, మాజీ మంత్రి జోగి ర‌మేష్ ఎంత‌గా రెచ్చిపోయారో…

2 hours ago