మోడీ సుదీర్ఘ ప్రసంగం అనంతరం ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పారు. దేశంలో చతికిల పడిన ఎకానమీని పరుగులు పెట్టించడానికి 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించారు ప్రధాని నరేంద్రమోడీ. ఈ సొమ్ము ఎంతో తెలుసా… 2020 బడ్జెట్లో సుమారు 70 శాతం. అయితే ప్యాకేజీలను ఇచ్చేటపుడు దానిని బడ్జెట్ తో కాకుండా దేశ జీడీపీతో పోలుస్తారు. ఎందుకంటే ఉద్దీపనలు ఇవ్వాల్సింది… మన జీడీపీని పెంచడానికే కాబట్టి జీడీపీతో పోలుస్తారు. అయితే ఆ పరంగా చూసినా కూడా చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద ఆర్థిక ప్యాకేజీని నరేంద్రమోడీ ప్రకటించారని చెప్పొచ్చు. గతంలో ప్రకటించిన 1.75 లక్ష కోట్లు, ఇపుడు ప్రకటించిన 20 లక్షల కోట్లు కలిపితే మన దేశ జీడీపీలో ఇది 11 శాతం.
ఇండియా సరే… ప్రపంచమంతటా దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్లో ఉన్నాయి. లాక్ డౌన్లో లేని దేశాల ఆర్థిక పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు. మరి ఆయా దేశాలు ఎలాంటి ప్యాకేజీలను ప్రకటించాయన్న విషయాన్ని పరిశీలించినపుడు కూడా ఇండియా మంచి ప్యాకేజీ ఇచ్చినట్లే చెప్పాలి. కాకపోతే ఈ డబ్బును మార్కెట్లోకి తేవడంలో ఎలాంటి విధానాలు పాటిస్తారనేదే కీలకం. ఈ ప్యాకేజీలో ప్రకటించిన రూపాయ మార్కెట్లో క్యాష్ ఫ్లోగా మారితే దేశం కోలుకోవడం చాలా సులువు. ఈ డబ్బును మార్కెట్లోకి ఎలా తేవాలన్న దానిపై ప్రణాళిక తుదిరూపు దిద్దుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఏ ఏ దేశాలు ఎంత ప్యాకేజీ ప్రకటించాయో చూద్దామా?
జర్మనీ – జీడీలో 60 శాతం
ఇటలీ – జీడీపీలో 44 శాతం.
ఫ్రాన్స్ – జీడీపీలో 26 శాతం
యుకె – జీడీపీలో 21 శాతం
జపాన్ – జీడీపీలో 20 శాతం
స్పెయిన్ – జీడీపీలో 12 శాతం
సింగపూర్ – జీడీపీలో 12 శాతం
అమెరికా -జీడీపీలో 14 శాతం
ఇండియా – జీడీపీలో 11 శాతం
కెనడా – జీడీపీలో 8.4 శాతం
హాంకాంగ్, తైవాన్ – 5.5, 5.3 శాతం
This post was last modified on May 13, 2020 12:49 am
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…