Political News

బాబు హిస్ట‌రీలోనే ఫ‌స్ట్ టైం.. సంచ‌ల‌న నిర్ణ‌యం

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. త‌న రాజ‌కీయ జీవితంలో ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న తాజాగా చేశారు. రాజ‌కీయాల్లో నాయ‌కులు ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం ప‌రిపాటే అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు వంటి సీనియ‌ర్‌.. 40 ఏళ్ల త‌న రాజ‌కీయ జీవితంలో ఏం మాట్లాడినా.. ఆచి తూచి మాట్లాడుతుంటారు. అదేవిధంగా పెద్ద‌గా స‌వాళ్లు.. ప్ర‌తిస‌వాళ్ల జోలికి కూడా పోరు. అయితే.. ఏపీలో సీఎం జ‌గ‌న్ పాల‌న చూసి.. ఆయ‌న ర‌క్తం ఉడికిపోతోంది(ఈ విష‌యాన్ని ఆయ‌నే చెప్పుకొచ్చారు) ఈ క్ర‌మంలో.. ఇటీవ‌ల కాలంలో చంద్ర‌బాబు స‌వాళ్లు రువ్వుతున్నారు.

అదే స‌మ‌యంలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు సైతం చేస్తున్నారు. తాజాగా తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక కోసం ప్ర‌చారం ముగిసిన నేప‌థ్యంలో ఆయ‌న‌.. స‌త్య‌వేడు ప్రాంతంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా రైతులు, వ్యాపార వ‌ర్గాలతో ఆయ‌న మాట్లాడారు. సత్యవేడు మండలం పరిధిలోని ఇసుక రేవుల వ‌ద్ద చంద్రబాబు పర్యటించారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుకపై ప్రజల తరఫున తాను పోరాడతానన్నారు. న్యాయం కోసం తాను అవ‌స‌ర‌మైతే జైలు కెళ్లడానికైనా సిద్ధమని సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. వాస్త‌వానికి చంద్ర‌బాబు త‌న రాజ‌కీయ జీవితంలో ఇలాంటి ప్ర‌క‌ట‌న గ‌తంలో చేయ‌లేద‌ని.. టీడీపీ సీనియ‌ర్లు చెబుతున్నారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి సోదరుడు ఇసుకను దోచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. మొత్తంగా సత్యవేడు మండల పరిధిలోని 3 ఇసుక రేవులను పరిశీలించారు. అరణియార్ నదిపై నాగలాపురం మండల పరిధిలో సురుటుపల్లి, నందనం, సుబ్బానాయుడు కండ్రిగ గ్రామాల వద్ద ఇసుక రేవులు ఉన్నాయని… అక్కడి నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నా రని స్థానికులు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.

పొలాల నుంచి అడ్డంగా రోడ్లు ఏర్పాటు చేసుకుని భారీ వాహనాలతో ఇసుకను తరలిస్తున్నట్లు రైతులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేస్తూ.. అక్కడి నుంచి తరలిస్తుండడం వల్ల భూగర్భ జలాలు అడుగంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణా నివారించడానికి వారి తరఫున పోరాటం చేస్తానని.. న్యాయం కోసం అవసరమైతే జైలుకు వెళ్లేందుకైనా తాను సిద్ధమని చంద్ర‌బాబు అన్నారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారాయి.

This post was last modified on April 16, 2021 9:24 pm

Share
Show comments

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago