Political News

ఆ ఎంపీ.. జ‌గ‌న్ మీద మ‌ళ్లీ ఎక్కేశాడుగా!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు కంటిపై కునుకులేకుండా చేస్తున్న అదే పార్టీ రెబ‌ల్ ఎంపీ.. క‌నుమూరి ర‌ఘురామ కృష్ణ‌రాజు.. ఒక‌వైపు త‌న వ్యాఖ్య‌ల‌తోను, మ‌రోవైపు చ‌ర్య‌ల‌తోనూ పార్టీ నేత‌లు ఉలిక్కిప‌డేలా చేస్తున్నారు. ఎక్క‌డ… ఎందుకు.. ఎలా.. మొద‌లైందో తెలియ‌దు కానీ.. చిలికి చిలికి గాలివాన‌గా మారిన.. ఈ వివాదంలో ర‌ఘురామ‌రాజు త‌న‌దైన స్ట‌యిల్‌లో దూకుడుగా వెళ్తూ.. వైసీపీ నేత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. ఏకంగా సీబీఐ కోర్టులోనే పిటిష‌న్ వేయ‌డం.. దానిని కోర్టు విచార‌ణ‌కు తీసుకోవ‌డం అత్యంత కీల‌క ప‌రిణామంగా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

ఇక‌, దీని నుంచే సీఎం జ‌గ‌న్ ఎలా బ‌య‌ట ప‌డాలా? అని ఆలోచిస్తున్న స‌మ‌యంలో మ‌రో సారి ర‌ఘురామ రాజు జ‌గ‌న్ పరువును ఢిల్లీకి ఈడ్చేశారు. రెండు రోజుల కిందట సీఎం జ‌గ‌న్ ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఎఫ్ ఎస్‌ల‌ను త‌న గుప్పిట‌లో పెట్టుకునేలా.. ఆయ‌న వ్యూహం ర‌చించుకున్నారు. వారికి ప్ర‌మోష‌న్ ఇవ్వాల‌న్నా.. వారిని బ‌దిలీ చేయాల‌న్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి అధికారం ఉండేది. జిల్లాల్లో ప‌నిచేస్తున్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల ప‌నితీరును మ‌దింపు చేయ‌డం.. వారికి ప్రోగ్రెస్ కార్డు ఇవ్వ‌డం వంటివి.. సీఎస్ చేస్తున్నారు.

అయితే.. ఇప్పుడు ఈ అధికారాన్ని సీఎం జ‌గ‌న్ త‌న చేతుల్లోకి తీసుకున్నారు. కానీ, ఇది వివాదాస్ప‌ద నిర్ణ‌యం. ఎందుకంటే.. రాష్ట్రాల్లో ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ.. ఐఏఎస్‌లు, ఐపీఎస్ లను నేరుగా రాష్ట్ర‌ప‌తి నియ‌మిస్తారు. వారి ప‌నితీరును సీఎస్ ముందుగా మ‌దింపు చేసి.. కేంద్రంలోని సిబ్బంది వ్య‌వ‌హారాల శాఖ‌కు పంపిస్తారు. దీనివ‌ల్ల పార‌ద‌ర్శ‌క‌త ఉంటుంద‌నేది కేంద్రం చెప్పేమాట‌. అయితే.. ఇప్పుడు ఈ అధికారాన్ని సీఎం జ‌గ‌న్ త‌నే తీసుకున్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల ప‌నితీరును త‌నే మదింపు చేస్తాన‌ని.. వారి వార్షిక ప‌నితీరుకు సంబందించిన నివేదిక‌లు త‌న‌కే ఇవ్వాల‌ని ఆయ‌న ఆదేశించారు. దీనికి సంబంధించి ఉత్త‌ర్వులు కూడా విడుద‌ల‌య్యాయి.

ఈ విష‌యం స‌రికాద‌ని తెలిసిన‌ప్ప‌టికీ.. ఎవ‌రూ మాట్లాడ‌డం లేదు. ఈ క్ర‌మంలో తాజాగా వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఏపీ కేడర్ ఐఏఎస్‌ల వార్షిక నివేదిక ఆమోదం సీఎం చేతుల్లో పెట్టడంపై ఫిర్యాదు చేశారు. ఐఏఎస్‌ల భవితవ్యం సీఎంగా ఉండే రాజకీయ నేతకు ఎలా అప్పగిస్తారని ఎంపీ ప్రశ్నించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై ఎంపీ రఘురామకృష్ణరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజాయితీపరులైన అధికారులకు అన్యాయం చేసే అవకాశముందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ జీవోపై జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. మ‌రి ఇప్పుడు ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on April 16, 2021 8:03 pm

Share

Recent Posts

మోదీని యువత తిడుతుంటే పవన్ కంట్లో నీళ్లు తిరిగాయి

బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…

55 minutes ago

టాలీవుడ్ ఆగస్ట్ కిరీటం – ఎవరికో అవకాశం!

కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…

4 hours ago

మా పిల్లలను శిక్షించలేను… క్షమిస్తున్నాను

జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…

6 hours ago

పవన్… కళాకారులకో వరం

నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…

8 hours ago

మహేష్ వెనుకడుగుకు కారణం ఏంటో

గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…

9 hours ago

ట్విట్టర్ టాక్స్… ప్రీమియర్ మాటలు… నిజాలు కావా

గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది  తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…

15 hours ago