Political News

ఈ ఈక్వేష‌న్‌.. జ‌గ‌న్‌కు బెడిసి కొడుతోందా ?


రాజ‌కీయాల్లో ఈక్వేష‌న్లు.. కలిసి వ‌స్తాయ‌ని నాయ‌కులు భావిస్తుంటారు. అవి పొలిటికల్ కావొచ్చు లేదా.. సామాజిక వ‌ర్గాల స‌మీక‌ర‌ణ‌లు కావొచ్చు.. ఏవైనా.. అంతిమ ల‌క్ష్యంగా పార్టీని బ‌లోపేతం చేయ‌డ‌మే. అయితే.. ఇప్పుడు జ‌గ‌న్ తీసుకున్న కొన్ని ఈక్వేష‌న్లు.. బెడిసి కొడుతున్నాయ‌ని అంటున్నారు వైసీపీ సీనియ‌ర్లు. రాష్ట్రంలో ఇటీవ‌ల కార్పొరేష‌న్‌, మునిసిప‌ల్ ఎన్నిక‌లు ముగిశాయి. ఈ క్ర‌మంలో 50 శాతం కార్పొరేష‌న్ల‌ను రిజ‌ర్వేష‌న్ కేట‌గిరీకి ఇచ్చారు. మిగిలిన వాటిలో కొన్ని మ‌హిళ‌ల‌కు, కొన్ని పురుషుల ప్రాతిప‌దిక‌న జ‌న‌ర‌ల్‌కు కేటాయించారు.

ఇలాంటి వాటిపై జ‌న‌ర‌ల్ కేట‌గిరీకి చెందిన క‌మ్మ‌, రెడ్డి, బ్రాహ్మ‌ణ‌, కాపు సామాజిక వ‌ర్గాలు ఆశ‌లు పెట్టుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన నేప‌థ్యంలో త‌మ‌కు ఖ‌చ్చితంగా ప‌ద‌వులు ల‌భిస్తాయ‌ని ఆశించారు. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల‌కు ముందు నుంచి పార్టీని బ‌లోపేతం చేయ‌డం, ఏక‌గ్రీవాలు చేసుకోవ‌డం వంటివాటిని చేప‌ట్టారు. అయితే.. తీరా ఎన్నిక‌లు ముగిసి.. ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత‌.. జ‌గ‌న్‌.. జ‌నర‌ల్‌కు కేటాయించిన స్థానాల‌ను, ప‌ద‌వుల‌ను కూడా బీసీ సామాజిక వ‌ర్గాల‌కు, మైనార్టీల‌కు ఎక్కువుగా కేటాయించారు. ఈ ప‌రిణామం.. క‌మ్మ‌, రెడ్డి, బ్రాహ్మ‌ణ‌, కాపు సామాజిక‌వ ర్గాల‌కు చెందిన వైసీపీ నేత‌ల‌ను హ‌ర్ట్ చేసింది.

అదే స‌మ‌యంలో చాలా మంది ఓపెన్ కులాల వారు త్వ‌ర‌లోనే జ‌రిగే మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌నలో త‌మ‌కు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే జ‌రిగిన మంత్రి వ‌ర్గం ఏర్పాటులో రెడ్డి వ‌ర్గానికి, క‌మ్మ వ‌ర్గానికి కేవ‌లం ఏదో ఇచ్చామంటే ఇచ్చాం.. అన్న‌ట్టుగా ప‌దవులు కేటాయించారు. రెడ్డి వ‌ర్గం ఎమ్మెల్యేలు ఏకంగా 51 మంది ఉంటే… న‌లుగురికే ప‌ద‌వులు వ‌చ్చాయి. క‌మ్మ‌ల నుంచి ఒక్క కొడాలి నాని మాత్ర‌మే మంత్రిగా ఉన్నారు.

ఈ క్ర‌మంలో మ‌రికొన్నాళ్ల‌లో జ‌రిగే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో త‌మ‌కు ప్రాధాన్యం పెంచాల‌ని.. రెడ్డి, క‌మ్మ నేత‌లు కోరుకుంటున్నారు. క‌మ్మ‌ల్లో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు హామీ ఉంది. ఇక రెడ్డి వ‌ర్గం నేత‌ల్లో మంత్రి ప‌ద‌వులు ఆశిస్తోన్న వారి సంఖ్య‌కు లెక్కే లేదు. వీరు అయితే మూడు నుంచి నాలుగు ప‌ద‌వులు ఇవ్వాల‌ని వీరు డిమాండ్ చేస్తున్నారు. “ఎన్నిక‌ల్లో డ‌బ్బులు పెట్టేది మేం.. పార్టీ కోసం శ్ర‌మించేది మేం… కానీ, మాకు మాత్రం ఎప్పుడూ మొండి చెయ్యేనా?.. ” అని ఈ సామాజిక వ‌ర్గం వారు నిష్టూరంగా మాట్లాడుతుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. జ‌గ‌న్ చేస్తున్న సోష‌ల్ ఇంజ‌నీరింగ్ వ్య‌తిరేక ఫ‌లితం ఇస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

పట్టపగలే కారు చీకట్లోకి బికనీర్!

సాంకేతికంగా మనిషి ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. వాటిని తన జీవన విధానంలో భాగం చేసుకున్నాడు. సుఖమయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే…

7 minutes ago

వైసీపీ నేతలకు షాకిచ్చిన లేడీ ఆఫీసర్

ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్ష వైసీపీ బారీ అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.…

2 hours ago

రెండు బెనిఫిట్ షోలు సేఫా రిస్కా

పెద్ది ప్రీమియర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీ వచ్చేసింది. రాత్రి 8…

2 hours ago

తేడా అంటూనే డబుల్ సెంచరీ కొట్టింది

దృశ్యం 3 ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల గ్రాస్ దాటేసింది. కేవలం పది రోజుల్లోపే ఈ ఫీట్ సాధించడం అనూహ్యం.…

2 hours ago

పవన్ అంతే… ఏదైనా పూర్తిగా తెలియాల్సిందే!

జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాలకు కొత్తే. సినిమా నటుడిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న…

3 hours ago

దాసరి స్మృతి వనం… కదిలిపోయిన మనోజ్

తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు దాసరి నారాయణరావు. అగ్ర దర్శకుడిగా ఉంటూ 150 సినిమాలు తీయడం…

5 hours ago