Political News

ఈ ఈక్వేష‌న్‌.. జ‌గ‌న్‌కు బెడిసి కొడుతోందా ?


రాజ‌కీయాల్లో ఈక్వేష‌న్లు.. కలిసి వ‌స్తాయ‌ని నాయ‌కులు భావిస్తుంటారు. అవి పొలిటికల్ కావొచ్చు లేదా.. సామాజిక వ‌ర్గాల స‌మీక‌ర‌ణ‌లు కావొచ్చు.. ఏవైనా.. అంతిమ ల‌క్ష్యంగా పార్టీని బ‌లోపేతం చేయ‌డ‌మే. అయితే.. ఇప్పుడు జ‌గ‌న్ తీసుకున్న కొన్ని ఈక్వేష‌న్లు.. బెడిసి కొడుతున్నాయ‌ని అంటున్నారు వైసీపీ సీనియ‌ర్లు. రాష్ట్రంలో ఇటీవ‌ల కార్పొరేష‌న్‌, మునిసిప‌ల్ ఎన్నిక‌లు ముగిశాయి. ఈ క్ర‌మంలో 50 శాతం కార్పొరేష‌న్ల‌ను రిజ‌ర్వేష‌న్ కేట‌గిరీకి ఇచ్చారు. మిగిలిన వాటిలో కొన్ని మ‌హిళ‌ల‌కు, కొన్ని పురుషుల ప్రాతిప‌దిక‌న జ‌న‌ర‌ల్‌కు కేటాయించారు.

ఇలాంటి వాటిపై జ‌న‌ర‌ల్ కేట‌గిరీకి చెందిన క‌మ్మ‌, రెడ్డి, బ్రాహ్మ‌ణ‌, కాపు సామాజిక వ‌ర్గాలు ఆశ‌లు పెట్టుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన నేప‌థ్యంలో త‌మ‌కు ఖ‌చ్చితంగా ప‌ద‌వులు ల‌భిస్తాయ‌ని ఆశించారు. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల‌కు ముందు నుంచి పార్టీని బ‌లోపేతం చేయ‌డం, ఏక‌గ్రీవాలు చేసుకోవ‌డం వంటివాటిని చేప‌ట్టారు. అయితే.. తీరా ఎన్నిక‌లు ముగిసి.. ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత‌.. జ‌గ‌న్‌.. జ‌నర‌ల్‌కు కేటాయించిన స్థానాల‌ను, ప‌ద‌వుల‌ను కూడా బీసీ సామాజిక వ‌ర్గాల‌కు, మైనార్టీల‌కు ఎక్కువుగా కేటాయించారు. ఈ ప‌రిణామం.. క‌మ్మ‌, రెడ్డి, బ్రాహ్మ‌ణ‌, కాపు సామాజిక‌వ ర్గాల‌కు చెందిన వైసీపీ నేత‌ల‌ను హ‌ర్ట్ చేసింది.

అదే స‌మ‌యంలో చాలా మంది ఓపెన్ కులాల వారు త్వ‌ర‌లోనే జ‌రిగే మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌నలో త‌మ‌కు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే జ‌రిగిన మంత్రి వ‌ర్గం ఏర్పాటులో రెడ్డి వ‌ర్గానికి, క‌మ్మ వ‌ర్గానికి కేవ‌లం ఏదో ఇచ్చామంటే ఇచ్చాం.. అన్న‌ట్టుగా ప‌దవులు కేటాయించారు. రెడ్డి వ‌ర్గం ఎమ్మెల్యేలు ఏకంగా 51 మంది ఉంటే… న‌లుగురికే ప‌ద‌వులు వ‌చ్చాయి. క‌మ్మ‌ల నుంచి ఒక్క కొడాలి నాని మాత్ర‌మే మంత్రిగా ఉన్నారు.

ఈ క్ర‌మంలో మ‌రికొన్నాళ్ల‌లో జ‌రిగే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో త‌మ‌కు ప్రాధాన్యం పెంచాల‌ని.. రెడ్డి, క‌మ్మ నేత‌లు కోరుకుంటున్నారు. క‌మ్మ‌ల్లో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు హామీ ఉంది. ఇక రెడ్డి వ‌ర్గం నేత‌ల్లో మంత్రి ప‌ద‌వులు ఆశిస్తోన్న వారి సంఖ్య‌కు లెక్కే లేదు. వీరు అయితే మూడు నుంచి నాలుగు ప‌ద‌వులు ఇవ్వాల‌ని వీరు డిమాండ్ చేస్తున్నారు. “ఎన్నిక‌ల్లో డ‌బ్బులు పెట్టేది మేం.. పార్టీ కోసం శ్ర‌మించేది మేం… కానీ, మాకు మాత్రం ఎప్పుడూ మొండి చెయ్యేనా?.. ” అని ఈ సామాజిక వ‌ర్గం వారు నిష్టూరంగా మాట్లాడుతుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. జ‌గ‌న్ చేస్తున్న సోష‌ల్ ఇంజ‌నీరింగ్ వ్య‌తిరేక ఫ‌లితం ఇస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on April 16, 2021 3:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బిగ్ డే – కంటెంట్లతో ఆకట్టుకునే ప్రయత్నం

టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…

2 hours ago

మండలి ఛైర్మన్ పై చేయి చేసుకున్న మంత్రి అతనేనా?

ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి…

2 hours ago

పేర్ని నాని… ఎవరికైనా వార్నింగ్ ఇచ్చేయగలరా?

రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…

3 hours ago

హైదరాబాద్ ‘హై’ వోల్టేజ్ పెర్ఫార్మెన్స్.. కానీ..

ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్‌లో ఎదురుదెబ్బ తగిలినా, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్‌లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్‌కతాలోని…

5 hours ago

అలా చెప్పుకోవడం కరెక్టేనా సీఎం గారు?

కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…

9 hours ago

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

10 hours ago