Political News

అందరి ఆశలు హైకోర్టుపైనే

ఇపుడిదే అంశంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయటానికి కేంద్రప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రైవీటకరణపై ఇప్పటికే కేంద్రమంత్రులు చాలాసార్లు పార్లమెంటులోనే చాలా ప్రకటనలు చేశారు. ప్రైవేటకరణను నిరసిస్తు విశాఖపట్నంలోని ప్రజాసంఘాలు, పార్టీలు ఎంతగా ఆందోళన చేస్తున్నా కేంద్రం ఏమాత్రం పట్టించుకోవటంలేదు.

ఈ నేపధ్యంలోనే జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో పిటీషన్ వేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జేడీ దాఖలు చేసిన పిటీషన్ ఆధారంగా హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీచేసింది. ప్రైవేటీకరణ నిర్ణయానికి ముందు కేంద్రం పరిశీలించిన అంశాలు ఏమిటో చెప్పమని కోర్టు స్పష్టంగా కోరింది. నష్టాలు వస్తున్నాయన్న ఏకైక కారణంతో వేలాదిమంది పనిచేస్తున్న సంస్ధను ప్రైవేటుపరం చేసేస్తారా ? అంటు హైకోర్టు కేంద్రాన్ని నిలదీసింది.

నష్టాలను అధిగమించేందుకు తీసుకున్న చర్యలేమిటి ? ప్రైవేటుపరం కాకుండా రాష్ట్రప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు ఏమిటి ? అసలు నష్టాలు ఎందుకు వస్తున్నాయి ? ఎప్పటినుండి వస్తున్నాయంటూ ఘాటైన ప్రశ్నలే వేసింది. ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తుత ఆర్ధిక పరిస్దితి ఏమిటనే విషయమై పూర్తి వివరాలు సమర్పించాలంటు కోర్టు ఒకవైపు కేంద్రాన్ని మరోవైపు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కూడా ఆదేశించింది.

జేడీ పిటీషన్ పై హైకోర్టు ఈ స్ధాయిలో స్పందిస్తుందని బహుశా చాలామంది ఊహించుండరు. ప్రైవేటీకరణ నిర్ణయంలో తాను జోక్యం చేసుకునేది లేదని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఆ నిర్ణయం వల్ల తలెత్తే దుష్ఫలితాలు, ప్రభావాలు, బాధితుల విషయంలో జోక్యం చేసుకునే హక్కు న్యాయస్ధానానికి ఉందని చెప్పింది.

ఫ్యాక్టరీ నిర్మాణం అప్పుడు సేకరించిన భూములు, అప్పట్లో భూయజమానులకు ఇచ్చిన హామీలు నెరవేరాయా లేదా ? అనే విషయాన్ని పరిశీలించనున్నట్లు చెప్పింది. కోర్టు జారీచేసిన నోటీసులోని అంశాలను పరిగణలోకి తీసుకుంటే ప్రైవేటీకరణ ఆగిపోతుందనే అనుకుంటున్నారు. ఎందుకంటే అప్పట్లో భూయజమానులకు ఇచ్చిన హామీల్లో చాలావరకు నెరవేర్చలేదు. కాబట్టి ఈ విషయంలోనే ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని హైకోర్టు అడ్డుకుంటుందని అనుకుంటున్నారు. మరి విచారణలో ఏమి తేలుతుందో చూడాలి.

This post was last modified on April 16, 2021 10:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

4 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

6 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

10 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

10 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

11 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

11 hours ago