తిరుపతి పార్లమెంటుకు ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. టీడీపీని గాడిలో పెట్టేందుకు పార్టీ అధినేత చంద్రబాబు ఒకవైపు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు.. పార్టీ పరిస్థితి ఏమీలేదని.. వచ్చే 17 తర్వాత పార్టీ పని అయిపోయినట్టేనని.. సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఓ హోటల్లో టిఫిన్ చేస్తున్న సమయంలో అచ్చెన్న చేసిన కామెంట్లు స్టింగ్ ఆపరేషన్ రూపంలో బయటకు వచ్చాయి.
పక్కనే ఓ సీనియర్ నాయకుడు.. “ముప్పై ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నామని.. కానీ, రాజగోపాల్ సహా ఎవరూ ఫోన్ ఎత్తడం లేదని, ఇలా అయితే.. ఎలా ?” అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా టిఫిన్ చేస్తూనే మాట్లాడిన అచ్చెన్న.. “17 తర్వాత.. పార్టీ లేదు.. బొక్కాలేదు” అనేశారు. అప్పటి వరకు ఓపిక పట్టండి! అని సూచించడం గమనార్హం. అంతేకాదు.. పార్టీని తాము గట్టిగా పట్టుకుని నిలబెడుతున్నామని.. లేక పోతే.. ఇంత మాత్రం కూడా ఉండదని అచ్చెన్న చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యల స్టింగ్ వీడియో.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండడం గమనార్హం. అయితే.. ఈ స్టింగ్పై అచ్చెన్న రియాక్ట్ అయ్యారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు లోకేష్తో తనకున్న అనుబంధాన్ని ఈ ఆపరేషన్లు విడదీయలేవని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో జగన్కు ఓటమి భయం పట్టుకుందని అచ్చెన్నాయుడు విమర్శించారు. తన సంభాషణల్ని వక్రీకరించారని, దీని వెనుక జగన్ హస్తం ఉందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. “నువ్వూ, నీ దొంగ సాక్షి ఎన్ని తప్పుడు వీడియోలు వేసినా టీడీపీలో విభేదాలు సృష్టించలేవు” అని జగన్ పై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మొత్తానికి ఈ స్టింగ్ ఆపరేషన్ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.
This post was last modified on April 13, 2021 11:47 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…