తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారు ? నిజానికి ఇది చాలా సింపుల్ ప్రశ్నే. రాజకీయంగా ఏమాత్రం అవగాహన ఉన్న వారైనా వైసీపీనే గెలుస్తుందని ఠక్కున సమాధానం చెప్పేస్తారు. అయితే ఇదే ఉపఎన్నిక ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడులో కూడా ఓ విధంగా జోష్ నింపిందనే చెప్పుకోవాలి. ఉపఎన్నికలో వైసీపీ గెలిస్తే ఓడిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబులో జోష్ ఎలా వస్తుంది ?
ఎలా వస్తుందంటే ఉపఎన్నికకు ముందు టీడీపీ పూర్తిగా నిస్తేజమైపోయింది. పంచాయితి, మున్సిపల్ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బల ఫలితంగా పార్టీ నేతల్లో బాగా నైరాస్యం పెరిగిపోయింది. టీడీపీ పనైపోయిందనే ప్రచారం పార్టీలోనే పెరిగిపోతోంది. ఇదే సమయంలో తెలంగాణాలో పార్టీ తరపున ఉన్న ఇద్దరు ఎంఎల్ఏలు అధికారికంగా టీఆర్ఎస్ లో చేరిపోయారు. వాళ్ళు చేరటమే కాకుండా టీడీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో కలిపేశారు. దాంతో తెలంగాణాలో పార్టీ జెండా ఎత్తేసినట్లయ్యింది.
ఒకవైపు పార్టీపై దెబ్బమీద దెబ్బ పడుతున్న సమయంలోనే చంద్రబాబు తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలోకి దిగారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి 4.94 లక్షల ఓట్లు వచ్చాయి. ఇపుడు ఆ ఓట్లు తెచ్చుకుంటే అదే మహా భాగ్యమన్నట్లుగా ఉంది పరిస్ధితి. అయితే ఆ ఓట్లు తెచ్చుకుంటుందా లేదా అన్నది పక్కన పెట్టేద్దాం. చంద్రబాబు ప్రచారం చేసిన వెంకటగిరి, శ్రీకాళహస్తి, గూడూరు నియోజకవర్గాల్లో జనాలు భారీ ఎత్తున హాజరయ్యారు.
వచ్చిన వాళ్ళంతా ఓట్లేస్తారా లేదా అన్నది పక్కన పెట్టేస్తే చంద్రబాబు పర్యటనకు జనాలు బాగా స్పందించటమే ముఖ్యం. ప్రచారంలో ఎంత రాత్రయినా జనాలు ఓపిగ్గా వెయిట్ చేయటం చంద్రబాబులో జోష్ నింపిందనటంలో సందేహంలేదు. ఇపుడు ప్రచారంలో జనాల స్పందన గనుక లేకపోయుంటే చంద్రబాబు సంగతి ఎలాగున్నా నేతలు మాత్రం పూర్తిగా నీరసపడిపోయుంటారనటంలో సందేహంలేదు. గెలుపోటములను పక్కనపెట్టేస్తే చంద్రబాబు పర్యటనకు జనాల్లో విశేష స్పందన కనిపించటం పార్టీలో మంచి జోష్ నింపిందనే చెప్పాలి.
This post was last modified on April 13, 2021 12:45 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…