Political News

బాబాయ్ హత్య కేసులోని నిందితుడ్ని జగన్ కలిశారా?

సంచలన ఆరోపణలు.. విమర్శలు సంధించే నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా మరో షాకింగ్ అంశాన్ని ప్రస్తావించారు. రెండేళ్ల క్రితం మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన వ్యక్తిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నివాసంలో భేటీ అయ్యారంటూ సంచలన ఆరోపణ చేశారు. రెండేళ్ల క్రితం మార్చి 15న సీఎం జగన్ బాబాయ్ వివేకాను నిర్దక్షిణ్యంగా గొడ్డలితో నరికి చంపారన్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఎఫ్ఐఆర్ లో ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గురువారం ఉదయం 10.46 గంటల సమయానికి తాడేపల్లిలోని సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారన్నారు. అదే విధంగా బుధవారం కూడా తన చిన్ననాటి స్నేహితుడిని కలిసినట్లుగా ఆయన పేర్కొన్నారు. పని ఒత్తిళ్లతో బిజీగా ఉండే సీఎం.. తన కేసుల విచారణకు కోర్టుకు హాజరు కాలేనప్పుడు.. బాబాయ్ హత్యలో నిందితుడైన వ్యక్తితో చర్చలు ఎలా జరుపుతారంటూ ప్రశ్నించారు.

అంతేకాదు.. తనను బెదిరిస్తున్న వారికి సంబంధించిన ఫోన్ నెంబర్లను ఇప్పటికే కేంద్ర హోం శాఖకు.. ఐబీకి ఇచ్చేసినట్లు చెప్పారు. తాను హైదరాబాద్ లో ఉన్నా.. ఢిల్లీలో ఉన్నా తనను బెదిరిస్తూ చేసే ఫోన్ కాల్స్ వివరాల్ని అధికారులు రికార్డు చేస్తుంటారని.. ఇందుకు పాల్పడిన వారిని సీఎం జగన్మోహన్ రెడ్డి రక్షించే అవకాశమే లేదన్నారు. జగన్ చిన్ననాటి స్నేహితులే ఇలాంటి పనులు చేస్తారన్న అర్థం వచ్చేలా ఉన్న ఎంపీ రఘురామకృష్ణంరాజు మాటలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.సొంత పార్టీ ఎంపీ చెప్పినట్లుగా.. బాబాయ్ వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని సీఎం జగన్ తన నివాసంలోనే కలిశారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేవారెవరు?

This post was last modified on April 9, 2021 11:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…

3 hours ago

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

4 hours ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

7 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

7 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

8 hours ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

8 hours ago