Political News

బాబాయ్ హత్య కేసులోని నిందితుడ్ని జగన్ కలిశారా?

సంచలన ఆరోపణలు.. విమర్శలు సంధించే నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా మరో షాకింగ్ అంశాన్ని ప్రస్తావించారు. రెండేళ్ల క్రితం మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన వ్యక్తిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నివాసంలో భేటీ అయ్యారంటూ సంచలన ఆరోపణ చేశారు. రెండేళ్ల క్రితం మార్చి 15న సీఎం జగన్ బాబాయ్ వివేకాను నిర్దక్షిణ్యంగా గొడ్డలితో నరికి చంపారన్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఎఫ్ఐఆర్ లో ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గురువారం ఉదయం 10.46 గంటల సమయానికి తాడేపల్లిలోని సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారన్నారు. అదే విధంగా బుధవారం కూడా తన చిన్ననాటి స్నేహితుడిని కలిసినట్లుగా ఆయన పేర్కొన్నారు. పని ఒత్తిళ్లతో బిజీగా ఉండే సీఎం.. తన కేసుల విచారణకు కోర్టుకు హాజరు కాలేనప్పుడు.. బాబాయ్ హత్యలో నిందితుడైన వ్యక్తితో చర్చలు ఎలా జరుపుతారంటూ ప్రశ్నించారు.

అంతేకాదు.. తనను బెదిరిస్తున్న వారికి సంబంధించిన ఫోన్ నెంబర్లను ఇప్పటికే కేంద్ర హోం శాఖకు.. ఐబీకి ఇచ్చేసినట్లు చెప్పారు. తాను హైదరాబాద్ లో ఉన్నా.. ఢిల్లీలో ఉన్నా తనను బెదిరిస్తూ చేసే ఫోన్ కాల్స్ వివరాల్ని అధికారులు రికార్డు చేస్తుంటారని.. ఇందుకు పాల్పడిన వారిని సీఎం జగన్మోహన్ రెడ్డి రక్షించే అవకాశమే లేదన్నారు. జగన్ చిన్ననాటి స్నేహితులే ఇలాంటి పనులు చేస్తారన్న అర్థం వచ్చేలా ఉన్న ఎంపీ రఘురామకృష్ణంరాజు మాటలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.సొంత పార్టీ ఎంపీ చెప్పినట్లుగా.. బాబాయ్ వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని సీఎం జగన్ తన నివాసంలోనే కలిశారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేవారెవరు?

This post was last modified on April 9, 2021 11:27 am

Share
Show comments
Published by
satya

Recent Posts

సాయిపల్లవిని టార్గెట్ చేసుకుంటున్నారు

నిన్న రామాయణం పిక్స్ లీకైనప్పటి నుంచి కొన్ని బాలీవుడ్ సోషల్ మీడియా ఫ్యాన్ హ్యాండిల్స్ సాయిపల్లవిని లక్ష్యంగా చేసుకోవడం స్పష్టంగా…

15 mins ago

సమంతా ఇంత మాస్ గా వుందేంటి

తెరమీద మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమంత కొత్త సినిమా తాలూకు ప్రకటన వచ్చేసింది. ఇన్స్ టాలో…

56 mins ago

రజని – కమల్ – చరణ్ ఒకే వేదికపై

కమల్ హాసన్ అభిమానులతో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భారతీయుడు 2కి దారి సుగమం అవుతోంది. జూన్…

1 hour ago

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే…

4 hours ago

గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…

5 hours ago

ఏజెంట్ గారూ ఇప్పటికైనా కరుణించండి

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…

5 hours ago