అగ్రరాజ్యమైన అమెరికాలో బఠాణీలు దొరికినంత సింఫుల్ గా గన్లు లభిస్తూ ఉంటాయి. అంతేనా.. కాస్త బుర్రలో గుజ్జు ఉన్న వారైతే.. బజార్లో దొరికే సామాగ్రితో తమకు అవసరమైన గన్లను తయారు చేసుకునేలా వీలు అక్కడ ఉంటుంది. గన్ కల్చర్ విపరీతంగా ఉండే అమెరికాలో.. గడిచిన కొద్దికాలంగా తమ ఇష్టారాజ్య వినియోగానికి పలువురు తెగించటం.. దీంతో పలువురు అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోవటం తెలిసిందే.
ఇటీవల జరిగిన కాల్పుల్లో నిందితులు వినియోగించిన ఆయుధాల్ని చూస్తే.. వారు తమ సొంతంగా తయారు చేసుకున్నవే కావటం గమనార్హం. ఈ నేపథ్యంలో బైడెన్ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అమెరికాలో గన్ కల్చర్ కు ముకుతాడు వేసేలా అడుగు వేసింది. ఎవరికి వారు ఆయుధాల్ని సమకూర్చుకునే అవకాశం లేకుండా చేయాలన్న ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగా ‘గన్ వయలన్స్ పబ్లిక్ హెల్త్ ఎపడిమిక్’ పేరుతో బైడెన్ సర్కారు కీలక ఉత్తర్వుల్ని జారీ చేసింది.
తుపాకీ విడి భాగాల్ని ఇప్పటిమాదిరి స్వేచ్ఛా మార్కెట్ లో సింఫుల్ గా దొరికేందుకు వీలు లేకుండా చర్యలు తీసుకోవాలని బైడెన్ సర్కారు భావిస్తోంది. అంతేకాదు.. నేషనల్ ఫైర్ ఆర్మ్స్ చట్టం కిందకి పిస్టల్స్ని నియంత్రించాలని భావిస్తున్నారు. అయితే.. బైడెన్ సర్కారు తీసుకున్న చర్యల్ని చట్టంగా మారిస్తేనే ప్రయోజనం ఉంటుంది. మరి.. ఇందుకు రిపబ్లికన్లు మద్దతు ఇస్తారా? అన్నది సందేహమే. ఎందుకంటే.. ప్రభుత్వం చేస్తున్న పలు ప్రతిపాదనల విషయంలో విపక్ష రిపబ్లికన్లు వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ సర్కారు తాను అనుకున్నది చేస్తుందా? అన్నది అసలు ప్రశ్న. రిపబ్లికన్లతో పోలిస్తే.. తాజా బైడెన్ సర్కారు గన్ కల్చర్ కు షాకిచ్చేలా నిబంధనల్ని రూపొందించాలన్న పట్టుదలతో ఉన్నట్లు చెప్పక తప్పదు.
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…