అగ్రరాజ్యమైన అమెరికాలో బఠాణీలు దొరికినంత సింఫుల్ గా గన్లు లభిస్తూ ఉంటాయి. అంతేనా.. కాస్త బుర్రలో గుజ్జు ఉన్న వారైతే.. బజార్లో దొరికే సామాగ్రితో తమకు అవసరమైన గన్లను తయారు చేసుకునేలా వీలు అక్కడ ఉంటుంది. గన్ కల్చర్ విపరీతంగా ఉండే అమెరికాలో.. గడిచిన కొద్దికాలంగా తమ ఇష్టారాజ్య వినియోగానికి పలువురు తెగించటం.. దీంతో పలువురు అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోవటం తెలిసిందే.
ఇటీవల జరిగిన కాల్పుల్లో నిందితులు వినియోగించిన ఆయుధాల్ని చూస్తే.. వారు తమ సొంతంగా తయారు చేసుకున్నవే కావటం గమనార్హం. ఈ నేపథ్యంలో బైడెన్ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అమెరికాలో గన్ కల్చర్ కు ముకుతాడు వేసేలా అడుగు వేసింది. ఎవరికి వారు ఆయుధాల్ని సమకూర్చుకునే అవకాశం లేకుండా చేయాలన్న ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగా ‘గన్ వయలన్స్ పబ్లిక్ హెల్త్ ఎపడిమిక్’ పేరుతో బైడెన్ సర్కారు కీలక ఉత్తర్వుల్ని జారీ చేసింది.
తుపాకీ విడి భాగాల్ని ఇప్పటిమాదిరి స్వేచ్ఛా మార్కెట్ లో సింఫుల్ గా దొరికేందుకు వీలు లేకుండా చర్యలు తీసుకోవాలని బైడెన్ సర్కారు భావిస్తోంది. అంతేకాదు.. నేషనల్ ఫైర్ ఆర్మ్స్ చట్టం కిందకి పిస్టల్స్ని నియంత్రించాలని భావిస్తున్నారు. అయితే.. బైడెన్ సర్కారు తీసుకున్న చర్యల్ని చట్టంగా మారిస్తేనే ప్రయోజనం ఉంటుంది. మరి.. ఇందుకు రిపబ్లికన్లు మద్దతు ఇస్తారా? అన్నది సందేహమే. ఎందుకంటే.. ప్రభుత్వం చేస్తున్న పలు ప్రతిపాదనల విషయంలో విపక్ష రిపబ్లికన్లు వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ సర్కారు తాను అనుకున్నది చేస్తుందా? అన్నది అసలు ప్రశ్న. రిపబ్లికన్లతో పోలిస్తే.. తాజా బైడెన్ సర్కారు గన్ కల్చర్ కు షాకిచ్చేలా నిబంధనల్ని రూపొందించాలన్న పట్టుదలతో ఉన్నట్లు చెప్పక తప్పదు.
This post was last modified on April 9, 2021 11:17 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…