అగ్రరాజ్యమైన అమెరికాలో బఠాణీలు దొరికినంత సింఫుల్ గా గన్లు లభిస్తూ ఉంటాయి. అంతేనా.. కాస్త బుర్రలో గుజ్జు ఉన్న వారైతే.. బజార్లో దొరికే సామాగ్రితో తమకు అవసరమైన గన్లను తయారు చేసుకునేలా వీలు అక్కడ ఉంటుంది. గన్ కల్చర్ విపరీతంగా ఉండే అమెరికాలో.. గడిచిన కొద్దికాలంగా తమ ఇష్టారాజ్య వినియోగానికి పలువురు తెగించటం.. దీంతో పలువురు అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోవటం తెలిసిందే.
ఇటీవల జరిగిన కాల్పుల్లో నిందితులు వినియోగించిన ఆయుధాల్ని చూస్తే.. వారు తమ సొంతంగా తయారు చేసుకున్నవే కావటం గమనార్హం. ఈ నేపథ్యంలో బైడెన్ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అమెరికాలో గన్ కల్చర్ కు ముకుతాడు వేసేలా అడుగు వేసింది. ఎవరికి వారు ఆయుధాల్ని సమకూర్చుకునే అవకాశం లేకుండా చేయాలన్న ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగా ‘గన్ వయలన్స్ పబ్లిక్ హెల్త్ ఎపడిమిక్’ పేరుతో బైడెన్ సర్కారు కీలక ఉత్తర్వుల్ని జారీ చేసింది.
తుపాకీ విడి భాగాల్ని ఇప్పటిమాదిరి స్వేచ్ఛా మార్కెట్ లో సింఫుల్ గా దొరికేందుకు వీలు లేకుండా చర్యలు తీసుకోవాలని బైడెన్ సర్కారు భావిస్తోంది. అంతేకాదు.. నేషనల్ ఫైర్ ఆర్మ్స్ చట్టం కిందకి పిస్టల్స్ని నియంత్రించాలని భావిస్తున్నారు. అయితే.. బైడెన్ సర్కారు తీసుకున్న చర్యల్ని చట్టంగా మారిస్తేనే ప్రయోజనం ఉంటుంది. మరి.. ఇందుకు రిపబ్లికన్లు మద్దతు ఇస్తారా? అన్నది సందేహమే. ఎందుకంటే.. ప్రభుత్వం చేస్తున్న పలు ప్రతిపాదనల విషయంలో విపక్ష రిపబ్లికన్లు వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ సర్కారు తాను అనుకున్నది చేస్తుందా? అన్నది అసలు ప్రశ్న. రిపబ్లికన్లతో పోలిస్తే.. తాజా బైడెన్ సర్కారు గన్ కల్చర్ కు షాకిచ్చేలా నిబంధనల్ని రూపొందించాలన్న పట్టుదలతో ఉన్నట్లు చెప్పక తప్పదు.
This post was last modified on April 9, 2021 11:17 am
దేశ భద్రతపై మళ్లీ శాంతిభంగం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయని నిఘా సంస్థలు హెచ్చరించాయి. శనివారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…