తిరుపతి నేతల విషయంలో జగన్ పరేషాన్ అవుతున్నారా ? తాను వేసుకున్న అంచనాల మేరకు నేతలు పనిచేయడం లేదని.. స్పష్టమైందా ? లేక.. ఇప్పుడు పెరిగిన తిరుపతి ఉప ఎన్నిక వేడి.. వైసీపీకి సెగ తగలడం ఖాయమని నిర్ణయానికి వచ్చారా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నిక వేడి.. వైసీపీకి బాగానే ఉంది. దీనికి ప్రధాన కారణం.. టీడీపీ ఒకవైపు.. బీజేపీ మరో వైపు.. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని పెంచుకోవడమే. అదే సమయంలో గతంలో జగన్ తిరుపతిపై చేసిన కామెంట్లను టీడీపీ నేతలు వీడియోల రూపంలో ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. దీంతో ఇప్పటి వరకు వైసీపీకి ఉన్న ఎడ్జ్ అంతో ఇంతో కరగడం మొదలైంది.
మరో పది రోజులు ఎన్నికలకు సమయం ఉండడం.. టీడీపీ, బీజేపీలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుండడం వంటి పరిణామాల నేపథ్యంలో వైసీపీ విజయం దక్కించుకున్నా.. తాము అనుకున్న అంచనాలు సాధించడం.. దేశం మొత్తం తిరుపతి వైపు చూసేలా పరిస్థితిని తీసుకురావడం వంటివి సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మరి దీనికి కారణాలు ఏంటి? అంటే.. మొత్తం ఈ తిరుపతి పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. వీటిలో మూడు చోట్ల వైసీపీ శ్రేణులు ముందుకు కదలడం లేదు. వెంకటగిరి, గూడూరు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో వైసీపీ దూకుడు తక్కువగా ఉంది. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారా యణ రెడ్డి అలిగి మౌనం పాటిస్తున్నారు.
గూడూరులో వైసీపీ నేతలు అంతర్గత కలహాలతో పార్టీని బద్నాం చేస్తున్నారు. ఇక, శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదనరెడ్డి దూకుడు ఉన్నా.. ఆయనతో కలిసి రాకుండా కొందరు నేతలు దూరంగా ఉన్నారు. ఈ పరిణామాలకు తోడు.. వెంకటగిరిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ.. దూకుడు పెంచారు. శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రంగంలోకి దిగారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఓటింగ్ ఈ దఫా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అదేసమయంలో పార్టీ శ్రేణులు సైతం.. ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. సీబీఎన్ ఆర్మీ సోషల్ మీడియాలో ప్రచారం దంచికొడుతోంది.
ఆయా పరిణామాలను విశ్లేషిస్తున్న జగన్.. తన పార్టీ నేతలు ఆశించిన విధంగా దూకుడు ప్రదర్శించడం లేదని ఒక నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా నెల్లూరుకు చెందిన మంత్రి అనిల్కు బాధ్యతలు అప్పగించడం.. కొందరికి నచ్చడం లేదు. దీంతో వారు కూడా అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో జగన్ అంతర్మథనం చెందుతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.. దీనికి పరిష్కారంగా తనే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on April 8, 2021 6:47 pm
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన…
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…
రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…
ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…