Political News

అన్నీ అనుకున్న‌ట్టు లేదు.. జ‌గ‌న్ అంత‌ర్మ‌థ‌నం వెన‌క ?

తిరుప‌తి నేత‌ల విష‌యంలో జ‌గ‌న్ ప‌రేషాన్ అవుతున్నారా ?  తాను వేసుకున్న అంచ‌నాల మేర‌కు నేత‌లు ప‌నిచేయ‌డం లేద‌ని.. స్ప‌‌ష్ట‌మైందా ?  లేక‌.. ఇప్పుడు పెరిగిన తిరుపతి ఉప ఎన్నిక వేడి.. వైసీపీకి సెగ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం తిరుప‌తి ఉప ఎన్నిక వేడి.. వైసీపీకి బాగానే ఉంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. టీడీపీ ఒక‌వైపు.. బీజేపీ మ‌రో వైపు.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ప్ర‌చారాన్ని పెంచుకోవ‌డ‌మే. అదే స‌మ‌యంలో గ‌తంలో జ‌గ‌న్ తిరుప‌తిపై చేసిన కామెంట్ల‌ను టీడీపీ నేత‌లు వీడియోల రూపంలో ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీకి ఉన్న ఎడ్జ్ అంతో ఇంతో క‌ర‌గ‌డం మొద‌లైంది.

మ‌రో పది రోజులు ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉండ‌డం.. టీడీపీ, బీజేపీలు వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతుండ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ విజ‌యం ద‌క్కించుకున్నా.. తాము అనుకున్న అంచ‌నాలు సాధించ‌డం.. దేశం మొత్తం తిరుప‌తి వైపు చూసేలా ప‌రిస్థితిని తీసుకురావ‌డం వంటివి సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. మ‌రి దీనికి కార‌ణాలు ఏంటి? అంటే.. మొత్తం ఈ తిరుప‌తి ప‌రిధిలో ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటే.. వీటిలో మూడు చోట్ల వైసీపీ శ్రేణులు ముందుకు క‌ద‌ల‌డం లేదు. వెంక‌ట‌గిరి, గూడూరు, శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ దూకుడు త‌క్కువ‌గా ఉంది. వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారా య‌ణ  రెడ్డి అలిగి మౌనం పాటిస్తున్నారు.

గూడూరులో వైసీపీ నేత‌లు అంత‌ర్గ‌త క‌ల‌హాల‌తో పార్టీని బ‌ద్నాం చేస్తున్నారు. ఇక‌, శ్రీకాళ‌హ‌స్తిలో బియ్య‌పు మ‌ధుసూద‌న‌రెడ్డి దూకుడు ఉన్నా.. ఆయ‌న‌తో క‌లిసి రాకుండా కొంద‌రు నేత‌లు దూరంగా ఉన్నారు. ఈ ప‌రిణామాల‌కు తోడు.. వెంక‌ట‌గిరిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామ‌కృష్ణ‌.. దూకుడు పెంచారు. శ్రీకాళ‌హ‌స్తిలో బొజ్జ‌ల సుధీర్ రంగంలోకి దిగారు. దీంతో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ ఓటింగ్ ఈ ద‌ఫా పెరిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. అదేస‌మ‌యంలో పార్టీ శ్రేణులు సైతం.. ఇంటింటి ప్ర‌చారం చేస్తున్నారు. సీబీఎన్ ఆర్మీ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం దంచికొడుతోంది.

ఆయా ప‌రిణామాల‌ను విశ్లేషిస్తున్న జ‌గ‌న్‌.. త‌న పార్టీ నేత‌లు ఆశించిన విధంగా దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం లేద‌ని ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. ముఖ్యంగా నెల్లూరుకు చెందిన మంత్రి అనిల్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం.. కొంద‌రికి న‌చ్చ‌డం లేదు. దీంతో వారు కూడా అంటీ ముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో జ‌గ‌న్ అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నార‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు.. దీనికి ప‌రిష్కారంగా త‌నే స్వ‌యంగా రంగంలోకి దిగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on April 8, 2021 6:47 pm

Share

Recent Posts

జ‌న‌సేన ఎమ్మెల్యే రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తారా ..?

తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన జ‌న‌సేన నాయ‌కుడు, సీనియ‌ర్ నేత ఆర‌ణి శ్రీనివాసులు రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై ఆస‌క్తిక‌ర…

25 minutes ago

రకుల్ సినిమాల్లోకి వచ్చింది కారు కోసమే

కొందరు నటనలోకి రావాలని ముందే ఒక లక్ష్యం పెట్టుకుని పని చేస్తారు. కొందరు అనుకోకుండా ఈ రంగంలోకి అడుగు పెడతారు.…

41 minutes ago

హెచ్చరికలతో సరిపెడితే ఎలా బాబు గారు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైఖ‌రి.. పార్టీ నాయ‌కులకు బాగా క‌లిసి వ‌స్తోంద‌న్న‌వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికి రెండు సంవ‌త్స‌రాలుగా చంద్ర‌బాబు.. త‌మ్ముళ్ల‌కు…

1 hour ago

పార్టీ సమస్యలు పట్టించుకోండి సీఎం సార్

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎప్పటికప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఈ తరహా పరిస్థితులు కొత్తేమీ…

3 hours ago

ఏజెంట్‌లో నన్ను చూసి అసహ్యమేసింది – అఖిల్

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…

5 hours ago

దేవర కలెక్షన్లపై డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ

ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…

9 hours ago