కరోనా విపత్తును కట్టడి చేసేందుకు విధించన లాక్ డౌన్ వల్ల దేశంలో ప్రజారవాణా స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. మే 17తో లాక్డౌన్ -3 ముగిసిపోబోతోందన్న ఊహాగానాలకు ఊతమిస్తూ తాజాగా పరిమిత సంఖ్యలో రైళ్లు నడపాలని కేంద్రం నిర్ణయించింది. రైళ్ల సర్వీసులను క్రమంగా పునరుద్ధరించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది.
ఈ క్రమంలోనే దాదాపు నెలన్నర రోజులుగా స్టేషన్లకే పరిమితమైన రైళ్లు….మే 12 నుంచి పట్టాలెక్కబోతున్నాయి.15 జతల రైళ్లను (అప్ అండ్ డౌన్ కలిపి 30 రైళ్లు) రైల్వే శాఖ ప్రారంభించనుంది. మే 11న 4 గంటల నుంచి టికెట్ల బుకింగ్ ను ఐఆర్సీటీసీ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులు పాటించాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసింది.
కేవలం ఐఆర్ సీటీసీ వెబ్ సైట్, యాప్ ద్వారా మాత్రమే బుక్ అయిన ఈ-టిక్కెట్లు కన్ఫర్మ్ అయిన వారిని మాత్రమే రైల్వేస్టేషన్లలోకి అనుమతిస్తామని రైల్వే శాఖ స్పష్టం చేసింది. రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లలో వసూలు చేస్తున్న ఛార్జీలనే.. ఇప్పుడు నడిపే ప్రత్యేక రైళ్లకు కూడా వసూలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే రైళ్లలో ప్రయాణానికి అనుమతిస్తామని, ప్రయాణికులంతా తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవాలని తెలిపింది.
ప్రయాణికులను రవాణా చేసే వాహనం డ్రైవర్కు అనుమతి ఉంటుందని తెలిపింది. స్టేషన్, కోచ్ ఎంట్రీ , ఎగ్జిట్ పాయింట్ల వద్ద హ్యాండ్ శానిటైజర్లు పెట్టాలని సూచించింది. ప్రయాణం సమయంలో అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని సూచించింది. బోర్డింగ్, కోచ్లలో ప్రయాణిస్తున్న సమయంలో భౌతికదూరం పాటించాలని ప్రయాణికులకు సూచించింది.
ప్రయాణికుల కోసం ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ ప్రచారం ద్వారా ఆరోగ్య సలహాలు, మార్గదర్శకాలు అందించాలంది. ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు చేరుకున్నాక ఆ రాష్ట్రం సూచించిన ఆరోగ్య నియమాలకు కట్టుబడి ఉండాల్సిందేనని హోంశాఖ తెలిపింది
రైలు ప్రయాణీకులకు కేంద్రం తాజా మార్గదర్శకాలివే
వీటితో పాటు
బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్మ్యాన్లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్షిప్లు ఉండి ఆర్థిక…
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమాను గత ఏడాది అనౌన్స్ చేయడం గుర్తుండే…