కరోనా విపత్తును కట్టడి చేసేందుకు విధించన లాక్ డౌన్ వల్ల దేశంలో ప్రజారవాణా స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. మే 17తో లాక్డౌన్ -3 ముగిసిపోబోతోందన్న ఊహాగానాలకు ఊతమిస్తూ తాజాగా పరిమిత సంఖ్యలో రైళ్లు నడపాలని కేంద్రం నిర్ణయించింది. రైళ్ల సర్వీసులను క్రమంగా పునరుద్ధరించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది.
ఈ క్రమంలోనే దాదాపు నెలన్నర రోజులుగా స్టేషన్లకే పరిమితమైన రైళ్లు….మే 12 నుంచి పట్టాలెక్కబోతున్నాయి.15 జతల రైళ్లను (అప్ అండ్ డౌన్ కలిపి 30 రైళ్లు) రైల్వే శాఖ ప్రారంభించనుంది. మే 11న 4 గంటల నుంచి టికెట్ల బుకింగ్ ను ఐఆర్సీటీసీ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులు పాటించాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసింది.
కేవలం ఐఆర్ సీటీసీ వెబ్ సైట్, యాప్ ద్వారా మాత్రమే బుక్ అయిన ఈ-టిక్కెట్లు కన్ఫర్మ్ అయిన వారిని మాత్రమే రైల్వేస్టేషన్లలోకి అనుమతిస్తామని రైల్వే శాఖ స్పష్టం చేసింది. రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లలో వసూలు చేస్తున్న ఛార్జీలనే.. ఇప్పుడు నడిపే ప్రత్యేక రైళ్లకు కూడా వసూలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే రైళ్లలో ప్రయాణానికి అనుమతిస్తామని, ప్రయాణికులంతా తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవాలని తెలిపింది.
ప్రయాణికులను రవాణా చేసే వాహనం డ్రైవర్కు అనుమతి ఉంటుందని తెలిపింది. స్టేషన్, కోచ్ ఎంట్రీ , ఎగ్జిట్ పాయింట్ల వద్ద హ్యాండ్ శానిటైజర్లు పెట్టాలని సూచించింది. ప్రయాణం సమయంలో అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని సూచించింది. బోర్డింగ్, కోచ్లలో ప్రయాణిస్తున్న సమయంలో భౌతికదూరం పాటించాలని ప్రయాణికులకు సూచించింది.
ప్రయాణికుల కోసం ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ ప్రచారం ద్వారా ఆరోగ్య సలహాలు, మార్గదర్శకాలు అందించాలంది. ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు చేరుకున్నాక ఆ రాష్ట్రం సూచించిన ఆరోగ్య నియమాలకు కట్టుబడి ఉండాల్సిందేనని హోంశాఖ తెలిపింది
రైలు ప్రయాణీకులకు కేంద్రం తాజా మార్గదర్శకాలివే
వీటితో పాటు
This post was last modified on May 11, 2020 6:33 pm
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…