Political News

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్ద‌వుతుందా? ఎంపీ పిటిష‌న్‌తో హీటెక్కిన పాలిటిక్స్‌

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్ద‌వుతుందా?– ఇప్పుడు ఇదే విష‌యం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ అస‌మ్మ‌తి నాయ‌కుడు.. న‌ర‌సాపురం ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. తాజాగా.. సీఎం జ‌గ‌న్ బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. హైకోర్టులో పిటిష‌న్ వేశారు. సీబీఐ కోర్టులో ఉన్న అక్ర‌మాస్తుల‌ కేసుల్లో ఏ-1గా ఉన్న సీఎం జగన్‌ బెయిల్‌‌ను రద్దు చేయాలని కోర్టును అభ్య‌ర్థించారు. ఇప్ప‌టికే జ‌గ‌న్‌పై 11 సీబీఐ ఛార్జిషీట్లు వేసింద‌ని పేర్కొన్నారు. ఆయా కేసుల్లో జ‌గ‌న్‌ ఏ-1గా ఉన్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇన్ని ఛార్జిషీట్లు వేసినా…విచార‌ణ‌ ఆలస్యంగా జరుగుతోందని కోర్టుకు వివ‌రించారు.

కేసుల విచారణలో జాప్యం జరుగుతున్నందున‌, ఆయన త్వరగా కేసుల నుంచి బయట‌పడాలనే ఉద్దేశంతోనే ఈ కేసు వేశానని ర‌ఘురామ చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకోవాలని, జయలలిత, లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ తదితరులు తమ స్థానంలో వేరే వారికి సీఎంగా ఛాన్స్ ఇచ్చినట్టే జగన్ కూడా వేరొకరికి అవకాశమిచ్చి.. కేసుల నుంచి బయటపడాలని జ‌గ‌న్‌కు సూచించారు. ఇంత వ‌ర‌కు బాగానే.. ఉన్నా.. ఇప్పుడు ఒక్క‌సారిగా.. వైసీపీలో ఈ త‌ర‌హా ప‌రిస్థితి హీటెక్కించింది. నిజానికి ఈ పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంది? విచార‌ణ‌కు స్వీక‌రించే అవ‌కాశం ఉందా? తీసుకుంటే.. ప‌రిస్థితి ఏంటి? వంటి విష‌యాలు.. వైసీపీ నేత‌ల మ‌ధ్య హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ నేప‌థ్యంలో.. కొన్నాళ్ల కింద‌ట హైకోర్టు న్యాయ‌మూర్తిగా ప‌నిచేసి.. రిటైరైన జ‌స్టిజ్ రాకేష్ కుమార్ వ్యాఖ్య‌లు కూడా వైసీపీ నేత‌ల చ‌ర్చ‌ల్లో వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇన్ని చార్జిషీట్‌లు ప‌డిన‌ప్ప‌టికీ.. కేసుల విచార‌ణ ఎందుకు ఆల‌స్య‌మ‌వుతోందో.. నాకు సైతం అర్ధం కావ‌డం లేద‌ని.. ఆయ‌న గ‌తంలో జ‌గ‌న్‌ను ఉద్దేశించి ప‌రోక్షంగా వేరే కేసులో వ్యాఖ్య‌లు సంధించారు. అదే స‌మ‌యంలో గూగుల్ ఓ నెంబ‌ర్‌ను వెతికితే.. ఎవ‌రి చ‌రిత్ర క‌నిపిస్తుందో తెలిసి.. ఆశ్చ‌ర్య‌పోయానంటూ.. వ్యాఖ్యానించారు. అప్ప‌ట్లో ఈ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టించ‌గా.. ఇప్పుడు ర‌ఘు వేసిన పిటిష‌న్ మ‌రోసారి వైసీపీలో పెను కుదుపుల‌కు కార‌ణంగా మారింది.

ర‌ఘురామ వేసిన ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించే అవ‌కాశం ఉంద‌ని కొంద‌రు చెబుతున్నారు. తాను వైసీపీ ఎంపీని కాబ‌ట్టి.. ప్ర‌జాప్ర‌యోజ‌నాల నేప‌థ్యంలో ఈపిటిష‌న్‌ను వేశాన‌ని చెప్పుకొనే అవ‌కాశం ర‌ఘురామ‌కు ఉంది. అయితే.. నేరుగా ఈ కేసుల‌తో ఏ ప్ర‌మేయం లేనందున .. ఆయ‌న పిటిష‌న్‌ను తిర‌స్క‌రించే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం కూడా వైసీపీ నేత‌ల మ‌ధ్య సాగుతోంది. అయితే.. ఏదేమైనా.. ప్ర‌స్తుత ప‌రిణామం .. మాత్రం పార్టీలో తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌గా మార‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 7, 2021 1:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

2 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

2 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

2 hours ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

3 hours ago

చావానే టార్గెట్… అంత సీన్ లేదు రాజా

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…

4 hours ago

తరుణ్ క్యాలికులేషన్ ఎక్కడ తప్పుతోంది

పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…

6 hours ago