పార్టీ పెట్టలేదు కానీ.. రోజుకో కార్యక్రమాన్నిపక్కాగా నిర్వహిస్తూ.. ఏదో ఒక రీతిలో మీడియాలో తన పేరు వినపడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు వైఎస్ షర్మిల. అయితే జిల్లాల నుంచి.. లేదంటే హైదరాబాద్ కు చెందిన ఎవరో ఒకరు తనతో భేటీ అయ్యేలా ఆమె చేస్తున్న ప్లానింగ్ ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. తాజాగా ఆమెను మాజీ డీజీపీ సర్వరణ్ జీత్ సేన్ భేటీ అయ్యారు. తన భార్యతో కలిసి ఆయన.. లోటస్ పాండ్ లో షర్మిలను కలిసి.. పలు అంశాల్ని చర్చించారు.
ఇదిలా ఉంటే.. ఎప్పుడు లేని రీతిలో సీఎం కేసీఆర్ ఫ్యామిలీ అంశాల్ని నిర్మోహామాటంగా ప్రస్తావించారు షర్మిల. ఓవైపు నిరుద్యోగులుఆత్మహత్య చేసుకుంటున్న వేళ.. అదే అంశానికి సంబంధించి ప్రభుత్వం ఇరుకున పడేలా షర్మిల వ్యాఖ్యలు ఉండటం విశేషం. ఉద్యోగాలు లేక యువత ఇబ్బంది పడుతున్నారని.. కేసీఆర్ ఒక్క ఫ్యామిలీలోనే ఐదు జాబులు ఇచ్చుకున్నారంటూ విమర్శనాస్త్రాన్ని సంధించారు.
నిరుద్యోగులు అధైర్యపడొద్దన్న ఆమె.. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 250 మంది యువకులతో సమావేశమయ్యారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని.. అందరికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డబ్బు లేదని చదువులుమధ్యలో ఆపేయటం ఉండదని.. అందరికి ఫీజురీయింబర్స్ మెంట్ కల్పిస్తామన్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ కేసీఆర్ ప్రభుత్వం మీదా.. ఆయన వ్యక్తిగతం మీదా విమర్శలుసంధిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటివరకు షర్మిల చేసిన విమర్శలపై స్పందించని.. తెలంగాణ అధికార పక్ష నేతలు.. తాజాగా విమర్శపైన అయినా స్పందించారా? మిన్నకుండా ఉండిపోతారా? అన్నది ప్రశ్న. ఏమైనా కేసీఆర్ ఫ్యామిలీని సింఫుల్ గా టచ్ చేసిన షర్మిల ధైర్యాన్ని పలువురు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. మరి..ఈ లెక్కన రేపటి బహిరంగ సభలో సర్కారుకు మరెన్ని చురకలు వేస్తారో చూడాలి.
This post was last modified on April 7, 2021 11:03 am
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…