పార్టీ పెట్టలేదు కానీ.. రోజుకో కార్యక్రమాన్నిపక్కాగా నిర్వహిస్తూ.. ఏదో ఒక రీతిలో మీడియాలో తన పేరు వినపడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు వైఎస్ షర్మిల. అయితే జిల్లాల నుంచి.. లేదంటే హైదరాబాద్ కు చెందిన ఎవరో ఒకరు తనతో భేటీ అయ్యేలా ఆమె చేస్తున్న ప్లానింగ్ ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. తాజాగా ఆమెను మాజీ డీజీపీ సర్వరణ్ జీత్ సేన్ భేటీ అయ్యారు. తన భార్యతో కలిసి ఆయన.. లోటస్ పాండ్ లో షర్మిలను కలిసి.. పలు అంశాల్ని చర్చించారు.
ఇదిలా ఉంటే.. ఎప్పుడు లేని రీతిలో సీఎం కేసీఆర్ ఫ్యామిలీ అంశాల్ని నిర్మోహామాటంగా ప్రస్తావించారు షర్మిల. ఓవైపు నిరుద్యోగులుఆత్మహత్య చేసుకుంటున్న వేళ.. అదే అంశానికి సంబంధించి ప్రభుత్వం ఇరుకున పడేలా షర్మిల వ్యాఖ్యలు ఉండటం విశేషం. ఉద్యోగాలు లేక యువత ఇబ్బంది పడుతున్నారని.. కేసీఆర్ ఒక్క ఫ్యామిలీలోనే ఐదు జాబులు ఇచ్చుకున్నారంటూ విమర్శనాస్త్రాన్ని సంధించారు.
నిరుద్యోగులు అధైర్యపడొద్దన్న ఆమె.. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 250 మంది యువకులతో సమావేశమయ్యారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని.. అందరికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డబ్బు లేదని చదువులుమధ్యలో ఆపేయటం ఉండదని.. అందరికి ఫీజురీయింబర్స్ మెంట్ కల్పిస్తామన్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ కేసీఆర్ ప్రభుత్వం మీదా.. ఆయన వ్యక్తిగతం మీదా విమర్శలుసంధిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటివరకు షర్మిల చేసిన విమర్శలపై స్పందించని.. తెలంగాణ అధికార పక్ష నేతలు.. తాజాగా విమర్శపైన అయినా స్పందించారా? మిన్నకుండా ఉండిపోతారా? అన్నది ప్రశ్న. ఏమైనా కేసీఆర్ ఫ్యామిలీని సింఫుల్ గా టచ్ చేసిన షర్మిల ధైర్యాన్ని పలువురు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. మరి..ఈ లెక్కన రేపటి బహిరంగ సభలో సర్కారుకు మరెన్ని చురకలు వేస్తారో చూడాలి.
గొడవలు కానీ మనస్పర్థలతో కానీ భార్యతో భర్త మాట్లాడకపోవటం గృహ హింస కిందకు వస్తుందా? మాట్లాడకుండా ఉండటం వేధింపులకు గురి…
‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…
అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…