చాలా రోజుల తర్వాత కరోనా పరిస్థితులు.. కేసుల నమోదుపై తెలంగాణ హైకోర్టు తాజాగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా కరోనా పరీక్షలు.. చికిత్స.. నియంత్రణపై నివేదికను ప్రభుత్వం సమర్పించింది. ఈ సందర్భంగా విచారణ జరిపిన హైకోర్టు సూటిగా పలు ప్రశ్నల్ని సంధించింది. బార్లు.. పబ్ లు.. సినిమా థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించలేదో తెలపాలని ఆదేశించింది. ఇందుకోసం రెండు రోజులు గడువు ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు.
ర్యాపిడ్ టెస్టులు చేస్తున్న ప్రభుత్వం.. ఆర్టీపీసీఆర్ పరీక్షలు అతి తక్కువ చేయటంపై హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల్ని నెమ్మదిగా పెంచుతున్నట్లుగా చెప్పిన ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు తెలుపగా.. హైకోర్టు అందుకు భిన్నంగా స్పందించింది. రెండో దశలో కరోనా వేగంగా విస్తరిస్తుంటే.. నెమ్మదిగా పెంచటం ఏమిటంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. అధికారులు పూర్తిగా ర్యాపిడ్ టెస్టుల మీదనే ఫోకస్ పెట్టిందని.. ఆర్టీపీసీఆర్ పరీక్షలు పది శాతం కూడా లేవని పేర్కొంది.
వివాహాలు.. శుభకార్యాల్లోనూ.. అంత్యక్రియల్లోనూ జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచన చేసింది. బస్టాండ్లు.. రైల్వే స్టేషన్లు.. రద్దీ ప్రాంతాల్లో చేపట్టిన పరీక్షల వివరాల్ని తెలపాలని కోరింది. కరోనా నిబంధనల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలన్న కోర్టు.. నిబంధనల్ని పాటించని వారిపై నమోదైన కేసులు.. జరిమానాల్ని వెల్లడిస్తూ 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు అడిగిన పలు ప్రశ్నలకు తెలంగాణ ప్రభుత్వం ఏమని బదులిస్తుందో చూడాలి.
గొడవలు కానీ మనస్పర్థలతో కానీ భార్యతో భర్త మాట్లాడకపోవటం గృహ హింస కిందకు వస్తుందా? మాట్లాడకుండా ఉండటం వేధింపులకు గురి…
‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…
అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…