గత కొన్నేళ్లలో ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు తమిళ కథానాయకుడు విజయ్. ఒకప్పుడు ఫాలోయింగ్, మార్కెట్ పరంగా సూపర్ స్టార్ రజినీకాంత్కు దరిదాపుల్లో ఏ హీరో నిలిచేవాడు కాదు. కానీ విజయ్ వరుస బ్లాక్ బస్టర్లతో రజినీని మించి ఎదిగిపోయాడు. ఇప్పుడు తమిళనాట అతనే అతి పెద్ద స్టార్ అనడంలో మరో మాట లేదు. ఆ రాష్ట్రంలో ఇలాంటి ఫాలోయింగ్ సంపాదించిన ప్రతి కథానాయకుడి అంతిమ లక్ష్యం రాజకీయాలే అవుతుంటాయి.
రజినీ ఆరోగ్యం సహకరించక రాజకీయాల్లోకి రాలేదు కానీ.. లేదంటే ఈపాటికి ఎన్నికల్లో పోటీపడేవాడే. ఆయన సమకాలీనుడైన కమల్ హాసన్ ఇప్పటికే ఎన్నికల బరిలో ఉన్న సంగతి తెలిసిందే. రాబోయే కొన్నేళ్లలో విజయ్ కచ్చితంగా రాజకీయాల్లో అడుగు పెడతాడనే అంచనాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో అతను బరిలో ఉంటే ఆశ్చర్యమేమీ లేదు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశాలున్నట్లు తన సినిమాల ద్వారా చెప్పకనే చెబుతుంటాడు విజయ్.
సమకాలీన రాజకీయాల మీద తన సినిమాల ద్వారా విజయ్ కౌంటర్లు వేయడం గమనించవచ్చు. ‘మెర్శల్’ సినిమాలో జీఎస్టీ మీద పంచులు వేశాడు. ‘మాస్టర్’ సినిమాలోనూ పొలిటికల్ టచ్ ఉన్న డైలాగులు కొన్ని ఉన్నాయి. ఐతే సినిమాల ద్వారానే కాక.. బయట కూడా తన చర్యలతో పొలిటికల్ పంచులు వేయడానికి విజయ్ సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం తమిళనాట అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్నాయి. విజయ్ కూడా ఓటేయడానికి వచ్చాడు. ఈ సందర్భంగా అందరు సెలబ్రెటీల్లా కారు వాడకుండా సైకిల్ మీద ర్యాలీగా పోలింగ్ బూత్కు విజయ్ చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది.
పెట్రోల్, డీజిల్ ధరలు గత కొన్ని నెలల్లో విపరీతంగా పెరిగిపోవడం, అది సామాన్యులపై ఎంతగానో ప్రభావం చూపడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని కౌంటర్ చేయడమే ఉద్దేశంగా విజయ్ సైకిల్ మీద వచ్చాడనే చర్చ జరుగుతోంది. విజయ్ నోరు తెరిచి ఏమీ మాట్లాడుకుండానే.. పరోక్షంగా తాను అన్నాడీఎంకే-భాజపా కూటమికి తాను వ్యతిరేకమని, వాళ్లకు ఓటేయొద్దని అభిమానులకు చెప్పకనే చెప్పేశాడనే వాదనలు వినిపిస్తున్నాయి. పోలింగ్ స్టేషన్ దగ్గర్లో ఉండటం.. ట్రాఫిక్, పార్కింగ్ లాంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని విజయ్ సైకిల్ మీద వచ్చాడని అతడి సన్నిహిత వర్గాలు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసినా.. జనాలు మాత్రం దీన్ని మరో దృష్టితోనే చూస్తున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…