తిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఓట్ల చీలిక ఇప్పుడు అన్ని పార్టీలనూ భయపెడుతోంది. గెలుపు తమదేనని.. మెజారిటీనే ముఖ్యమని భావించిన వైసీపీ నుంచి ఇక్కడైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వరకు అన్ని పార్టీల్లోనూ ఓట్ల చీలికపై పెద్ద ఎత్తున రభసే జరుగుతుండడం గమనార్హం. మరి ఇలా ఎందుకు జరుగుతోంది? గతంలో కన్నా ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు? అనే ప్రశ్నలు ఆసక్తిగా మారాయి. వీటికి సమాధానం.. గతంలో కంటే.. ఇప్పుడు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థులు పెరిగిపోయారు.
2019 ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి.. తిరుపతి నుంచి 8 మంది అభ్యర్థులు మాత్రమే పోటీ చేశారు. పైగా అవి సాధారణ ఎన్నికలు. ఈ ఎనిమిది మందిలోనూ ప్రధాన పార్టీల అభ్యర్థులు ఐదుగురు ఉన్నారు. మిగిలిన వారిలో ఇండిపెండెంట్లు ఉన్నారు. కానీ, ఇప్పుడు మాత్రం.. ఏకంగా 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీటిలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ సహా బీఎస్పీ, జనతాదళ్(యు), యునైటెడ్ కాంగ్రెస్, ఇలా అనేక చిన్నా చితకా పార్టీలు, ఇండిపెండెంట్లు, కమ్యూనిస్టులు.. మొత్తంగా 28మంది పోటీ చేస్తున్నారు. వీరిలో కొందరు ఇండిపెండెంట్లకు తమ తమ నియోజకవర్గాల్లో 10 వేల ఓట్ల వరకు చీల్చే సత్తా ఉంది. దీంతో ఇప్పుడు అభ్యర్థుల మధ్య ఓట్ల చీలిక అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా కొన్ని ప్రధాన పార్టీలు.. అధికార పార్టీ తప్ప.. ఉద్దేశ పూర్వకంగానే ఇండిపెండెంట్లను ప్రోత్సహించినట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికితోడు కులాల వారీగా కూడా ఎస్సీ వర్గానికి చెందిన వారు విడిపోయారనే వాదన తెరమీదికి తెస్తున్నారు. దీంతో ఎస్సీ వర్గంలో చీలిక ఏర్పడి.. ఓట్లు చీలిపోవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. మరో వైపు పార్టీల పరంగా.. వ్యక్తుల పరంగా కూడా ఓట్లు చీలిపోవడం కనిపిస్తోంది. అంటే.. ఇక్కడ వైసీపీ భావించినట్టు.. అత్యధిక మెజారిటీ లభించే అవకాశం లేదని తెలుస్తోంది. గెలిచినా అంచనాలకు తగ్గే మెజారిటీతోనే గెలిచేలా ఇతర పక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరించాయని.. అందుకే ఇంత మంది అభ్యర్థులు బరిలో నిలిచారని విశ్లేషణలు వస్తున్నాయి.
This post was last modified on April 6, 2021 7:05 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…