Political News

తిరుప‌తి బ‌రిలో.. పార్టీల‌ను భ‌య‌పెడుతున్న ఓట్ల చీలిక..‌!

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో ఓట్ల చీలిక ఇప్పుడు అన్ని పార్టీల‌నూ భ‌య‌పెడుతోంది. గెలుపు త‌మ‌దేన‌ని.. మెజారిటీనే ముఖ్య‌మని భావించిన వైసీపీ నుంచి ఇక్క‌డైనా గెలిచి ప‌రువు నిల‌బెట్టుకోవాల‌ని భావిస్తున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ వ‌ర‌కు అన్ని పార్టీల్లోనూ ఓట్ల చీలిక‌పై పెద్ద ఎత్తున ర‌భ‌సే జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇలా ఎందుకు జ‌రుగుతోంది? గతంలో క‌న్నా ఇప్పుడు ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు? అనే ప్ర‌శ్న‌లు ఆస‌క్తిగా మారాయి. వీటికి స‌మాధానం.. గ‌తంలో కంటే.. ఇప్పుడు ఉప ఎన్నిక‌లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థులు పెరిగిపోయారు.

2019 ఎన్నిక‌ల్లో పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి.. తిరుప‌తి నుంచి 8 మంది అభ్య‌ర్థులు మాత్ర‌మే పోటీ చేశారు. పైగా అవి సాధార‌ణ ఎన్నిక‌లు. ఈ ఎనిమిది మందిలోనూ ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థులు ఐదుగురు ఉన్నారు. మిగిలిన వారిలో ఇండిపెండెంట్లు ఉన్నారు. కానీ, ఇప్పుడు మాత్రం.. ఏకంగా 28 మంది అభ్య‌ర్థులు పోటీ చేస్తున్నారు. వీటిలో ప్ర‌ధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ స‌హా బీఎస్పీ, జ‌న‌తాద‌ళ్‌(యు), యునైటెడ్ కాంగ్రెస్, ఇలా అనేక చిన్నా చిత‌కా పార్టీలు, ఇండిపెండెంట్లు, క‌మ్యూనిస్టులు.. మొత్తంగా 28మంది పోటీ చేస్తున్నారు. వీరిలో కొంద‌రు ఇండిపెండెంట్ల‌కు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో 10 వేల ఓట్ల వ‌ర‌కు చీల్చే స‌త్తా ఉంది. దీంతో ఇప్పుడు అభ్య‌ర్థుల మ‌ధ్య ఓట్ల చీలిక అంశం ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ముఖ్యంగా కొన్ని ప్ర‌ధాన పార్టీలు.. అధికార పార్టీ త‌ప్ప‌.. ఉద్దేశ పూర్వ‌కంగానే ఇండిపెండెంట్ల‌ను ప్రోత్స‌హించిన‌ట్టు పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. దీనికితోడు కులాల వారీగా కూడా ఎస్సీ వ‌ర్గానికి చెందిన వారు విడిపోయార‌నే వాద‌న తెర‌మీదికి తెస్తున్నారు. దీంతో ఎస్సీ వ‌ర్గంలో చీలిక ఏర్ప‌డి.. ఓట్లు చీలిపోవ‌డం ఖాయ‌మనే వాద‌న వినిపిస్తోంది. మ‌రో వైపు పార్టీల ప‌రంగా.. వ్య‌క్తుల ప‌రంగా కూడా ఓట్లు చీలిపోవ‌డం క‌నిపిస్తోంది. అంటే.. ఇక్క‌డ వైసీపీ భావించిన‌ట్టు.. అత్య‌ధిక మెజారిటీ ల‌భించే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. గెలిచినా అంచనాల‌కు త‌గ్గే మెజారిటీతోనే గెలిచేలా ఇత‌ర ప‌క్షాలు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాయ‌ని.. అందుకే ఇంత మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచార‌ని విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

This post was last modified on April 6, 2021 7:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్ర‌బాబు నిర్ణ‌యమే.. తెలంగాణ‌కు ఊపిరా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రం చేసిన ప్ర‌తిపాద‌న తీవ్ర సంక‌ట స్థితిలోకి నెట్టేసింది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. కేంద్ర…

4 hours ago

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

6 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

13 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

14 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

14 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

16 hours ago