Political News

తిరుప‌తి బ‌రిలో.. పార్టీల‌ను భ‌య‌పెడుతున్న ఓట్ల చీలిక..‌!

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో ఓట్ల చీలిక ఇప్పుడు అన్ని పార్టీల‌నూ భ‌య‌పెడుతోంది. గెలుపు త‌మ‌దేన‌ని.. మెజారిటీనే ముఖ్య‌మని భావించిన వైసీపీ నుంచి ఇక్క‌డైనా గెలిచి ప‌రువు నిల‌బెట్టుకోవాల‌ని భావిస్తున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ వ‌ర‌కు అన్ని పార్టీల్లోనూ ఓట్ల చీలిక‌పై పెద్ద ఎత్తున ర‌భ‌సే జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇలా ఎందుకు జ‌రుగుతోంది? గతంలో క‌న్నా ఇప్పుడు ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు? అనే ప్ర‌శ్న‌లు ఆస‌క్తిగా మారాయి. వీటికి స‌మాధానం.. గ‌తంలో కంటే.. ఇప్పుడు ఉప ఎన్నిక‌లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థులు పెరిగిపోయారు.

2019 ఎన్నిక‌ల్లో పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి.. తిరుప‌తి నుంచి 8 మంది అభ్య‌ర్థులు మాత్ర‌మే పోటీ చేశారు. పైగా అవి సాధార‌ణ ఎన్నిక‌లు. ఈ ఎనిమిది మందిలోనూ ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థులు ఐదుగురు ఉన్నారు. మిగిలిన వారిలో ఇండిపెండెంట్లు ఉన్నారు. కానీ, ఇప్పుడు మాత్రం.. ఏకంగా 28 మంది అభ్య‌ర్థులు పోటీ చేస్తున్నారు. వీటిలో ప్ర‌ధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ స‌హా బీఎస్పీ, జ‌న‌తాద‌ళ్‌(యు), యునైటెడ్ కాంగ్రెస్, ఇలా అనేక చిన్నా చిత‌కా పార్టీలు, ఇండిపెండెంట్లు, క‌మ్యూనిస్టులు.. మొత్తంగా 28మంది పోటీ చేస్తున్నారు. వీరిలో కొంద‌రు ఇండిపెండెంట్ల‌కు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో 10 వేల ఓట్ల వ‌ర‌కు చీల్చే స‌త్తా ఉంది. దీంతో ఇప్పుడు అభ్య‌ర్థుల మ‌ధ్య ఓట్ల చీలిక అంశం ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ముఖ్యంగా కొన్ని ప్ర‌ధాన పార్టీలు.. అధికార పార్టీ త‌ప్ప‌.. ఉద్దేశ పూర్వ‌కంగానే ఇండిపెండెంట్ల‌ను ప్రోత్స‌హించిన‌ట్టు పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. దీనికితోడు కులాల వారీగా కూడా ఎస్సీ వ‌ర్గానికి చెందిన వారు విడిపోయార‌నే వాద‌న తెర‌మీదికి తెస్తున్నారు. దీంతో ఎస్సీ వ‌ర్గంలో చీలిక ఏర్ప‌డి.. ఓట్లు చీలిపోవ‌డం ఖాయ‌మనే వాద‌న వినిపిస్తోంది. మ‌రో వైపు పార్టీల ప‌రంగా.. వ్య‌క్తుల ప‌రంగా కూడా ఓట్లు చీలిపోవ‌డం క‌నిపిస్తోంది. అంటే.. ఇక్క‌డ వైసీపీ భావించిన‌ట్టు.. అత్య‌ధిక మెజారిటీ ల‌భించే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. గెలిచినా అంచనాల‌కు త‌గ్గే మెజారిటీతోనే గెలిచేలా ఇత‌ర ప‌క్షాలు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాయ‌ని.. అందుకే ఇంత మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచార‌ని విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

This post was last modified on April 6, 2021 7:05 am

Share

Recent Posts

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

8 minutes ago

టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు…

24 minutes ago

ఎన్డీయే క‌న్వీన‌ర్‌గా చంద్ర‌బాబు… ఛాన్స్ ఖాయ‌మేనా?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మిని బ‌లోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మ‌రింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మ‌క అడుగులు…

5 hours ago

ర‌వితేజ హిట్టు కొడితే ఆల్ హ్యాపీస్

తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వ‌ర్గాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందులో ఒక వ‌ర్గానికి ఇంకో వ‌ర్గానికి అస్స‌లు…

6 hours ago

హిందీ డబ్బింగ్ దమ్మేంటో చెప్పిన నాగ్

ఒక‌ప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావ‌డం, ఇక్క‌డ పెద్ద స్థాయిలో రిలీజ్ కావ‌డ‌మే ఉండేది త‌ప్ప‌.. తెలుగు చిత్రాలు…

10 hours ago

య‌శ్‌ను భ‌య‌పెట్టేసిన మ‌ల్లారెడ్డి

మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెర‌వాల్సిందే. అది రాజ‌కీయ స‌భ అయినా.. సినిమా…

11 hours ago