Political News

షాక్: 24 గంటల్లో కరోనాతో గాంధీలో 17 మంది మృతి

షాకింగ్ నిజం ఒకటి బయటకు వచ్చింది. కరోనా తీవ్రత ఎంత ఉందన్న విషయాన్ని వెల్లడించే వైనం వెల్లడైంది. కరోనాతో మరణాలు తక్కువనే మాటకు.. చేతలకు మధ్యనున్న అంతరం ఏమిటన్న విషయాన్ని ఒక ప్రముఖ మీడియా సంస్థ మరోసారి బయటపెట్టింది. సెకండ్ వేవ్ లో కరోనా తీవ్రత తక్కువగా ఉందన్న ప్రచారాన్ని ఏ మాత్రం నమ్మొద్దన్న విషయం తాజాగా నిరూపితమైంది. కేవలం 24 గంటల వ్యవధిలో గాంధీ ఆసుపత్రిలో ఏకంగా 17 మంది మరణించిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. కరోనా కేసుల పెరుగుదల మాత్రమే కాదు.. మరణాలు సైతం వేగంగా పెరుగుతున్నాయన్న కఠిన నిజం కళ్ల ముందు కనపడేలా వాస్తవం ఇప్పుడు బయటకు వచ్చింది.

రోజువారీ బులిటెన్లలో పేర్కొన్న వివరాలకు.. వాస్తవానికి మధ్య దూరం చాలా ఎక్కువగా ఉందన్నది ఇప్పుడు స్పష్టమైంది. కరోనా కారణంగా బుధవారం నలుగురు మరణించినట్లుగా రోజువారీగా విడుదల చేసే ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం రాత్రి 8 గంటల 24 గంటల వ్యవధిలో ఏకంగా 17 మంది మరణించిన వైనం ఇప్పుడు సంచలనమైంది.

తాజాగా మరణించిన వారంతా వారం.. రెండు వారాల పాటు పలు ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారు.. తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారిని మూడు రోజుల క్రితం గాంధీకి తరలించారు. తీవ్రమైన శ్వాస సంబంధిత ఇబ్బందులతో వెంటిలేటర్ పై ఉన్న వీరిని వెంటనే ఐసీయూలో చేరర్చి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. మరణించిన వారిలో ఎక్కువమంది 45 – 95 ఏళ్ల మధ్యలో ఉన్నట్లుగా తేలింది. మృతుల్లో హైదరాబాదీయులు ఎక్కువ మంది కాగా.. పలువురు జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. ఈ మరణాల ఉదంతం చెప్పేదొక్కటే.. కరోనాను ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోవద్దని మాత్రమే.

This post was last modified on April 2, 2021 9:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

47 minutes ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

1 hour ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

2 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

2 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

3 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

4 hours ago