షాకింగ్ నిజం ఒకటి బయటకు వచ్చింది. కరోనా తీవ్రత ఎంత ఉందన్న విషయాన్ని వెల్లడించే వైనం వెల్లడైంది. కరోనాతో మరణాలు తక్కువనే మాటకు.. చేతలకు మధ్యనున్న అంతరం ఏమిటన్న విషయాన్ని ఒక ప్రముఖ మీడియా సంస్థ మరోసారి బయటపెట్టింది. సెకండ్ వేవ్ లో కరోనా తీవ్రత తక్కువగా ఉందన్న ప్రచారాన్ని ఏ మాత్రం నమ్మొద్దన్న విషయం తాజాగా నిరూపితమైంది. కేవలం 24 గంటల వ్యవధిలో గాంధీ ఆసుపత్రిలో ఏకంగా 17 మంది మరణించిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. కరోనా కేసుల పెరుగుదల మాత్రమే కాదు.. మరణాలు సైతం వేగంగా పెరుగుతున్నాయన్న కఠిన నిజం కళ్ల ముందు కనపడేలా వాస్తవం ఇప్పుడు బయటకు వచ్చింది.
రోజువారీ బులిటెన్లలో పేర్కొన్న వివరాలకు.. వాస్తవానికి మధ్య దూరం చాలా ఎక్కువగా ఉందన్నది ఇప్పుడు స్పష్టమైంది. కరోనా కారణంగా బుధవారం నలుగురు మరణించినట్లుగా రోజువారీగా విడుదల చేసే ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం రాత్రి 8 గంటల 24 గంటల వ్యవధిలో ఏకంగా 17 మంది మరణించిన వైనం ఇప్పుడు సంచలనమైంది.
తాజాగా మరణించిన వారంతా వారం.. రెండు వారాల పాటు పలు ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారు.. తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారిని మూడు రోజుల క్రితం గాంధీకి తరలించారు. తీవ్రమైన శ్వాస సంబంధిత ఇబ్బందులతో వెంటిలేటర్ పై ఉన్న వీరిని వెంటనే ఐసీయూలో చేరర్చి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. మరణించిన వారిలో ఎక్కువమంది 45 – 95 ఏళ్ల మధ్యలో ఉన్నట్లుగా తేలింది. మృతుల్లో హైదరాబాదీయులు ఎక్కువ మంది కాగా.. పలువురు జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. ఈ మరణాల ఉదంతం చెప్పేదొక్కటే.. కరోనాను ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోవద్దని మాత్రమే.
This post was last modified on April 2, 2021 9:28 am
వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలైన తర్వాత.. కూటమి పార్టీల అభ్యర్థుల ప్రచారంలో భారీ మార్పు చోటు చేసుకుంది. ముఖ్యంగా ఉమ్మడి…
మహేష్ బాబు బావ అనే గుర్తింపుతో హీరోగా అడుగు పెట్టి కెరీర్ ఆరంభంలో కుదురుకోవడానికి చాలా కష్టపడ్డాడు సుధీర్ బాబు.…
2024లో టాలీవుడ్ నుంచి రాబోయే పెద్ద సినిమాలకు విడుదలకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక క్లారిటీ వచ్చేసినట్లే. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు…
నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం. రెండు సార్లు గెలిచి మంత్రి పదవి, ఒకసారి ఓడినా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. ముచ్చటగా…
పవన్ బాబాయికి ఒక్కసారి ఓటేయండి. ఒక్కసారి ఆయనను అసెంబ్లీకి పంపించండి .. ప్లీజ్ అంటూ.. మెగా ప్రిన్స్ నాగబాబు కుమారుడు…
మొన్నటిదాకా వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరైన నాగార్జున ఈ సంవత్సరం నా సామిరంగతో ఊరట చెందారు. సోగ్గాడే చిన్ని నాయన రేంజ్…