Political News

రజినీకి అవార్డ్.. ఎన్నికల స్టంట్?


సూపర్ స్టార్ రజినీకాంత్‌ను అత్యున్నత సినీ పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. ఇది ఆయనతో పాటు అభిమానులందరికీ ఎంతో సంతోషాన్నిచ్చే విషయమే. ఈ విషయం వెల్లడి కాగానే ఆయనపై అభినందనల వర్షం కురుస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి అందరూ కృతజ్ఞతలు చెబుతున్నారు.

ఐతే రజినీ ఈ పురస్కారానికి పూర్తి అర్హుడే అయినా.. ఆయనకీ అవార్డు దక్కడం అందరినీ ఆనందింపజేస్తున్నా.. ఈ అవార్డు ఇప్పుడే ఆయనకు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం మీద చర్చ జరుగుతోంది. మరి కొన్ని రోజుల్లో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అందులో ప్రయోజనం కోసమే మోడీ సర్కారు రజినీకి అవార్డు ప్రకటించిందని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకేతో కలిసి బీజేపే పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

తమిళనాట బీజేపీ ప్రభావం అంతంతమాత్రమే అయినప్పటికీ.. జయలలిత మరణానంతరం నాటకీయ పరిణామాల మధ్య అధికార పార్టీని తన చెప్పుచేతల్లో ఉండేలా చేసుకోగలిగింది కేంద్ర ప్రభుత్వం. దాని అండతో ఆ రాష్ట్రంలో బలపడేందుకు గట్టి ప్రయత్నమే చేస్తోంది భాజపా. మరోవైపు రజినీని తమ పార్టీలోకి లాగడానికి భాజపా గట్టి ప్రయత్నమే చేసింది. ఆయన్ని ఎప్పట్నుంచో దువ్వుతోంది. ఆయన పార్టీ పెట్టినా కూడా భాజపాకు మద్దతు ఇచ్చేలా చూడాలని ప్రయత్నించారు. కానీ రజినీ రాజకీయాల్లోకి అడుగు పెట్టినట్లే పెట్టి ఆరోగ్య కారణాల రీత్యా వెనక్కి తగ్గారు.

ఐతే రజినీ రాజకీయాల్లో లేడు కాబట్టి ఆయన నుంచి పరోక్ష మద్దతు అయినా తీసుకోవాలని అన్నాడీఎంకే-భాజపా కూటమి గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే రజినీకి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించడం ద్వారా ఆయన అభిమానుల మనసు గెలిచి ఎన్నికల్లో తమ కూటమికి సానుకూల ఫలితాలు రాబట్టాలనే వ్యూహాత్మకంగా ప్రకటన చేశారని భావిస్తున్నారు.

This post was last modified on April 1, 2021 6:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అభిమానులను ఊరిస్తున్న ‘ఉస్తాద్’ తొలిప్రేమ

ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

49 minutes ago

రీల్ కోసం స్టంట్… ప్రాణం తీసిన తుపాకీ

ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…

2 hours ago

పిఠాపురానికి ప్ర‌త్యేకం.. ప‌వ‌న్ ఏం చేశారంటే ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయ‌ల‌పై ప‌ట్టు పెంచుకునే విధంగా కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన…

2 hours ago

దేవి కోసమే తమన్‌‌ రాలేదట

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…

4 hours ago

చివరి నిమిషం ఒత్తిడిలో దురంధర్ రివెంజ్

రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…

4 hours ago

స్వయంభు సౌండ్ చాలా పెంచాలి

ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…

4 hours ago