రాష్ట్రంలో వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న జగన్ ప్రభుత్వం.. ఆయా పథకాలకు తమ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకుంటున్న విషయం తెలిసిందే. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కొన్ని పథకాలకు తన పేరును, పార్టీ అధినేత ఎన్టీఆర్ పేరును పెట్టుకున్నారు. అయితే.. అప్పట్లో చంద్రబాబును విమర్శించిన వైసీపీ అధినేత జగన్.. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే.. తను ప్రవేశ పెడుతున్న పథకాలకు తన పేరు, తన తండ్రి పేరును పెట్టుకోవడం ఆనవాయితీగా మార్చుకున్నారు.
జగనన్న విద్యాదీవెన, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ రైతు భరోసా.. వైఎస్సార్ వాహన మిత్ర, ఇలా అనేక పథకాలకు పేర్లు పెట్టున్నారు. ఇలా ఒక్కొక్క పథకానికి పేర్లు పెట్టేందుకు, ఆయా పేర్ల వెనుక ఉన్న సందర్భాన్ని వివరించేందుకు కొందరు సలహాదారులు జగన్ దగ్గర పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో నూతనంగా ప్రవేశ పెట్టే పథకానికి సంబందించి వారు కూలంకషంగా చర్చించుకుని.. ఆయా పథకాలకు ఎవరి పేరు అయితే.. బాగుంటుందనే విషయాన్ని సూచిస్తున్నారు. రైతులతో ముడిపడిన పథకాలకు వైఎస్సార్ పేరును, యువత, ఓ వర్గం మహిళలకు సంబంధించిన పథకాలకు జగన్ పేరును సూచించారు.
దీనివెనుక పథకాలు పొంది ప్రజలు ఎంత లబ్ధి పొందుతున్నారో.. అదేవిధంగా.. ఆయా పథకాల పేర్లతో పార్టీ కూడా లబ్ధి పొందాలనే సూత్రం ఇమిడి ఉందనేది వాస్తవం. ఇక, ఇప్పుడు ఈ కోవలోనే మహానేత పేరుతో ఒక పథకాన్ని తీసుకు వస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పేరు వైసీపీ వర్గాల్లో మార్మోగుతోంది. మరికొన్ని నెల్లలోనే మేనిఫెస్టోలో పేర్కొన్న ఒకటి రెండు పథకాలను కూడా అమలు చేయనున్నారు. ఈ క్రమంలో ఒక పథకానికి మహానేత అనే పేరు పెట్టాలని డిసైడ్ అయినట్టు సమాచారం. వాస్తవానికి మహానేత అనేది వైఎస్ రాజశేఖరరెడ్డిని కొనియాడేందుకు వైసీపీ వాడే పదం.
అయితే.. ఎల్లో మీడియాగా వైసీపీ పేర్కొనే కొన్ని పత్రికలు ఈ పేరును వ్యంగ్యాస్త్రంగా సంధిస్తున్నాయి. ఈ క్రమంలో ఇకపై ఇలాంటి ఛాన్స్ ఇవ్వకుండా చేసేందుకు మహానేత పేరుతో ఒక కీలక పథకాన్ని తీసుకువచ్చి.. మంచి ప్రాచుర్యం కల్పించాలని నిర్ణయించుకున్నట్టు వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తుండడం గమనార్హం. మరి ఆ పథకం ఏంటి? ఎలా ? అనే విషయాలపై సలహాదారులు వర్కవుట్ చేస్తున్నారని వైసీపీ నేతల మధ్య గుసగుస వినిపిస్తోంది.
This post was last modified on March 31, 2021 6:50 pm
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…