Political News

త్వ‌ర‌లో మ‌హానేత‌ ప‌థ‌కం.. స్కెచ్ సిద్ధం చేస్తున్న స‌ల‌హాదారు..!


రాష్ట్రంలో వివిధ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమలు చేస్తున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. ఆయా ప‌థ‌కాల‌కు త‌మ కుటుంబ స‌భ్యుల పేర్లు పెట్టుకుంటున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా కొన్ని ప‌థ‌కాల‌కు త‌న పేరును, పార్టీ అధినేత ఎన్టీఆర్ పేరును పెట్టుకున్నారు. అయితే.. అప్ప‌ట్లో చంద్ర‌బాబును విమ‌ర్శించిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తాను అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే.. త‌ను ప్ర‌వేశ పెడుతున్న ప‌థ‌కాల‌కు త‌న పేరు, త‌న తండ్రి పేరును పెట్టుకోవ‌డం ఆన‌వాయితీగా మార్చుకున్నారు.

జ‌గ‌న‌న్న విద్యాదీవెన‌, జ‌గ‌న‌న్న అమ్మ ఒడి, వైఎస్సార్ రైతు భ‌రోసా.. వైఎస్సార్ వాహ‌న మిత్ర‌, ఇలా అనేక ప‌థ‌కాల‌కు పేర్లు పెట్టున్నారు. ఇలా ఒక్కొక్క ప‌థ‌కానికి పేర్లు పెట్టేందుకు, ఆయా పేర్ల వెనుక ఉన్న సంద‌ర్భాన్ని వివ‌రించేందుకు కొంద‌రు స‌ల‌హాదారులు జ‌గ‌న్ ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో నూత‌నంగా ప్ర‌వేశ పెట్టే ప‌థ‌కానికి సంబందించి వారు కూలంక‌షంగా చ‌ర్చించుకుని.. ఆయా ప‌థ‌కాల‌కు ఎవ‌రి పేరు అయితే.. బాగుంటుంద‌నే విష‌యాన్ని సూచిస్తున్నారు. రైతుల‌తో ముడిప‌డిన ప‌థ‌కాల‌కు వైఎస్సార్ పేరును, యువ‌త‌, ఓ వ‌ర్గం మ‌హిళ‌ల‌కు సంబంధించిన ప‌థ‌కాల‌కు జ‌గ‌న్ పేరును సూచించారు.

దీనివెనుక ప‌థ‌కాలు పొంది ప్ర‌జ‌లు ఎంత ల‌బ్ధి పొందుతున్నారో.. అదేవిధంగా.. ఆయా ప‌థ‌కాల పేర్ల‌తో పార్టీ కూడా ల‌బ్ధి పొందాల‌నే సూత్రం ఇమిడి ఉంద‌నేది వాస్త‌వం. ఇక‌, ఇప్పుడు ఈ కోవ‌లోనే మ‌హానేత‌ పేరుతో ఒక ప‌థ‌కాన్ని తీసుకు వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ పేరు వైసీపీ వ‌ర్గాల్లో మార్మోగుతోంది. మ‌రికొన్ని నెల్ల‌లోనే మేనిఫెస్టోలో పేర్కొన్న ఒక‌టి రెండు ప‌థ‌కాల‌ను కూడా అమ‌లు చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో ఒక ప‌థ‌కానికి మ‌హానేత అనే పేరు పెట్టాల‌ని డిసైడ్ అయిన‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి మ‌హానేత అనేది వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని కొనియాడేందుకు వైసీపీ వాడే ప‌దం.

అయితే.. ఎల్లో మీడియాగా వైసీపీ పేర్కొనే కొన్ని ప‌త్రిక‌లు ఈ పేరును వ్యంగ్యాస్త్రంగా సంధిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఇక‌పై ఇలాంటి ఛాన్స్ ఇవ్వ‌కుండా చేసేందుకు మ‌హానేత‌ పేరుతో ఒక కీల‌క ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చి.. మంచి ప్రాచుర్యం క‌ల్పించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఆ ప‌థ‌కం ఏంటి? ఎలా ? అనే విష‌యాల‌పై స‌ల‌హాదారులు వ‌ర్క‌వుట్ చేస్తున్నార‌ని వైసీపీ నేత‌ల మ‌ధ్య గుస‌గుస వినిపిస్తోంది.

This post was last modified on March 31, 2021 6:50 pm

Share

Recent Posts

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

13 minutes ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

30 minutes ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

1 hour ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

2 hours ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

2 hours ago

బెంగ‌ళూరులో స్ట్రాట‌జిస్టుల‌తో జ‌గ‌న్ భేటీ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు కీల‌క రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారా?  వ‌చ్చే ఎన్నిక‌లు.. దీనికి ముందు ఆయ‌న చేయ‌నున్న…

3 hours ago