Political News

రైతుల‌పై ఏపీ మంత్రి ఫైర్‌..

‘వరి ఒక సోమరిపోతు వ్యవసాయం’ అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన వైసీపీ ప్ర‌భుత్వంలో ప‌ట్ట‌ణ‌గృహ నిర్మాణ‌శాఖ మంత్రిగా ఉన్న శ్రీరంగ‌నాథ‌రాజు.. ఈ వ్యాఖ్య‌ల‌ను ఉద్దేశ పూర్వ‌కంగానే చేశారా? లేక యాదృచ్ఛికంగా అన్నారా? అంటే.. ఆయ‌న ఉద్దేశ పూర్వ‌కంగా నే ఇలాంటి వ్యాఖ్య‌లు చేశార‌ని అంటున్నారు వైసీపీ సీనియ‌ర్లు గుస‌గుస‌గా! గ‌తంలోను, ఇప్పుడు కూడా రాజ‌కీయా లు రంగ‌నాథ ‌రాజుకు కొత్త‌కాదు. ఇప్ప‌టికే ఆయ‌న సీనియ‌ర్ నాయ‌కుడిగా జిల్లాలో ప్ర‌చారంలో ఉన్నారు. అయితే.. ఆయ‌న ప‌రిస్థితి ఇటీవ‌ల కాలంలో వివాదంగా మారింది. అది కూడా సొంత‌పార్టీలోనే నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన మంత్రి రంగ‌నాథ‌రాజు మంత్రి అయిన ద‌గ్గ‌ర నుంచి(ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరి.. ఆచం ట నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు) జిల్లాలో త‌న‌దైన దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ముఖ్యంగా డెల్టా ప్రాంతంలోని నియోజ‌క‌వర్గాల్లో మంత్రి ప‌ట్టు పెంచుకున్నారు. త‌న‌దైన దూకుడుతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో ఇత‌ర నేత‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. పైగా మంత్రిగారి అల్లుడు కూడా జిల్లాలో హ‌వా చూపిస్తున్నార‌నే విష‌యం దాచినా దాగ‌డం లేదు. ఈ ప‌రిస్థితి జిల్లాలోనే కాకుండా పార్టీలోనూ ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌టికే కొంద‌రు సీనియ‌ర్లు.. మంత్రిపై ఫిర్యాదులు చేశార‌ని.. వార్త‌లు గుప్పుమంటున్నాయి.

ఈ నేప‌థ్యంలో త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌లు, వ్యాఖ్య‌ల‌ను దారిమ‌ళ్లించేందుకు మంత్రిగారు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని.. రైతుల విష‌యం సెంటిమెంటుతో కూడిన వ్య‌వ‌హారం కావ‌డంతో ఆయ‌న ఈ విష‌యంలో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి.. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌పై జ‌రుగుతున్న యాంటీ ప్ర‌చారాన్ని ప‌క్కదారి ప‌ట్టించేందుకు ప్ర‌య‌త్నించార‌ని జిల్లాకు చెందిన సీనియ‌ర్లు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. ‘సోమరి పోతు వ్యవసాయం ఏదైనా ఉందంటే అది వరి సాగే. రైతులు కష్టపడాల్సిన అవసరం లేదు. ఏఈగారు కాల్వలకు నీరు వదిలితే పొలంలోకి నీళ్లు వస్తున్నాయి. ఒరేయ్‌ బాబూ ఆకుమడి దున్ను… అంటే వచ్చి దున్నుతాడు. బస్తా విత్తనాలు పొలంలో పడేస్తే… ఇంతని డబ్బులు ఇస్తే విత్తనాలు, ఎరువులు చల్లుతున్నారు. ఊడ్పులకూ అంతే! బస్తాకు ఇంత అని ఇస్తే సరిపోతుంది’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్య‌లు రాష్ట్ర వ్యాప్తంగా వివాదానికి దారితీశాయి. దీంతో ఒక్క‌సారిగా మంత్రిగారిపై ఉన్న ఇత‌ర విష‌యాలు ప‌క్క‌దారి ప‌ట్టి..ఈ విష‌య‌మే హైలెంట్ అయింది. అయితే.. దీనిపై వెంట‌నే స‌మాధానం ఇచ్చిన మంత్రి.. తమ ప్రాంతంలో ఎక్కువగా వరి వ్యవసాయం చేస్తారని తెలిపారు. ప్రభుత్వ పథకాలు కౌలు రైతులకు అందటం లేదన్నారు. భూ యజమానులు పథకాలు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. తాను రైతు బిడ్డను కావటంతో తొందరపాటులో మాట్లాడానని వివరణ ఇచ్చారు. రైతులను కించపరిచే ఉద్దేశం లేదని రంగనాథరాజు ప్రకటించారు. అయితే.. ఇదంతా కూడా ఒక త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు చేసిన మ‌రో త‌ప్ప‌ని గుస‌గుస‌లాడుతున్నారు వైసీపీ సీనియ‌ర్లు.

This post was last modified on March 28, 2021 10:37 pm

Share

Recent Posts

లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది.…

3 minutes ago

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

13 minutes ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

14 minutes ago

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

27 minutes ago

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

1 hour ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

1 hour ago