రాష్ట్ర విభజన తర్వాత.. అనేక విషయాలపై ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉప్పు-నిప్పుగా ఉన్న పరిస్థితి తెలిసిందే. ప్రధానంగా నీటి సమస్య, ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్ బకాయిలు, విద్యుత్ ఉద్యోగుల సమస్య(ఇది కొంత పరిష్కారమైనా.. ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం కాలేదు), హైదరాబాద్లోని ప్రభుత్వ కార్యాలయాలు.. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. అయితే.. ఏపీలో రెండు ప్రభుత్వాలు మారినా.. తెలంగాణలో మాత్రం విభజన తర్వాత నుంచి ఒకే ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో కొనసాగుతోంది.
అయితే.. ఆయా సమస్యలపై మాత్రం ఇప్పటికీ పరిష్కారం లభించలేదు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని ప్రయత్నాలు చేసినా.. సానుకూల ఫలితాలు మాత్రం లభించలేదు. పైగా విద్యుత్ బకాయిలు.. ఏపీకి తెలంగాణ నుంచి 5 వేల కోట్ల పైచిలుకు రావాల్సి ఉందని.. చంద్రబాబు పేర్కొంటే.. కాదు.. మీరే మాకు కట్టాలి! అని అప్పట్లో తెలంగాణ మంత్రులు ఎదురు దాడి చేశారు. ఇక, సాగునీరు, తాగునీరు, కృష్నా, గోదావరి జిలాల వినియోగం, వాటాలు.. ప్రాజెక్టులు వంటి అనేక సమస్యలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు విషయంపై సుప్రీం కోర్టులో టీఆర్ఎస్ నేతలు వేసిన కేసు ఇప్పటికీ విచారణ దశలోనే ఉంది.
ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు కూడా కొన్ని సమస్యలను చర్చించుకుని పరిష్కారం చేసుకుంటామని ప్రకటించినా.. ఆ దిశగా అడుగులు పడలేదు. దీంతో చాలా విషయాలు న్యాయ పరిధిలో ను, మరికొన్ని విషయాలు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వద్దకు చేరాయి. వీటిలో కీలకమైంది.. నీటి సమస్య, విద్యుత్ బకాయిలు. అయితే, నిన్న మొన్నటి వరకు ఈ సమస్యలపై కేంద్రం దృష్టి పెడుతుందని.. తమకు సానుకూలంగా సమస్యను పరిష్కరిస్తుందని ఇరు రాష్ట్రాలు భావించాయి. అయితే.. తాజాగా మాత్రం కేంద్రం చేతులు ఎత్తేసినట్టు కనిపిస్తోంది.
టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు తాజాగా జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న అపరిష్కృత సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించారు. అదేసమయంలో ఏపీకి ప్రత్యేక హోదాపైనా ఆయన మరోసారి గళం వినిపించారు. దీనికి సమాధానంగా కేంద్ర మంత్రి నిత్యానంద్రాయ్ మాట్లాడుతూ.. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అనేక మినహాయింపులు ఇచ్చామని తెలిపారు.
ఇక, అత్యంత కీలకమైన తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలున్నాయని ఒప్పుకొన్న ఆయన.. పరిష్కారం మాత్రం తమ చేతుల్లో లేదని, తెలుగు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలలని ఉచిత సలహా విసిరారు. అంటే.. దీనిని బట్టి.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చోద్యం చూస్తానని చెప్పినట్టే అయింది. ఇక, మిగిలింది తెలుగు రాష్ట్రాలకు సామరస్య పూర్వక పరిష్కారం లేదంటే.. కొట్టుకుచావడమే!!
This post was last modified on March 24, 2021 10:48 am
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…