Political News

బీజేపీ పరిస్ధితేంటో ఇక్కడే అర్ధమైపోయిందా ?

గెలిచేస్తామని, పొడిచేస్తామని ఎప్పటినుండో రచ్చ రచ్చ చేస్తున్న బీజేపీ పరిస్దితి ఏమిటో ఇక్కడే అర్ధమైపోయింది. తొందరలోనే జరగబోయే తిరుపతి లోక్ సభ ఉనఎన్నికకు పార్టీలు రంగంలోకి దిగేసిన విషయం అందరికీ తెలిసిందే. టీడీపీ చాలా రోజుల క్రితమే పనబాక లక్ష్మిని అభ్యర్ధిగా ప్రకటించేసిన విషయం తెలిసిందే. ఈమధ్యనే వైసీపీ కూడా డాక్టర్ గురుమూర్తిని అభ్యర్ధిగా ప్రకటించింది. బీజేపీ కూడా ప్రకటించేసింది కానీ అభ్యర్ధిని కాదు ప్రచార కమిటిని.

అవును మీరు చదివింది కరెక్టే. ప్రధాన రెండు పార్టీలు అభ్యర్ధులను ప్రకటిస్తే బీజేపీ మాత్రం ప్రచార కమిటిని ప్రకటించటమే విచిత్రం. అభ్యర్ధిని ప్రకటించకుండా ప్రచారకమిటిని ఎందుకు ప్రకటించిందో పార్టీ చీఫ్ సోమువీర్రాజుకే తెలియాలి. పైగా ఉపఎన్నికలో తామే పోటీ చేస్తామని వీర్రాజు ఎప్పటినుండో ప్రకటిస్తున్నారు. దానికి తగ్గట్లే గతంలోనే ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. పోటీలో తమ అభ్యర్ధే ఉంటారని తెలిసినపుడు మరి అభ్యర్ధిని ఎందుకు రెడీ చేసుకోలేదో అర్ధం కావటంలేదు.

మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారకమిటిని పనిచేస్తుందట. అలాగే నియోజకవర్గాల్లో ఇన్చార్జులుగా సోము వీర్రాజు, టీజీ వెంకటేష్, సుజనా చౌధరి, పురంధేశ్వరి, సునీల్ థియోధర్, జీవీఎల్, కన్నా లక్ష్మీనారాయణ, బైరెడ్డి, ఐవైఆర్, రావెల కిషోర్ బాబును పార్టీ ప్రకటించింది. వీరిలో టీజీ, కన్నా తప్ప మిగిలిన వాళ్ళల్లో చాలామందికి ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలే లేవు. రావెల ఒకసారి ఏదో గాలిలో గెలిచారంతే. ఇక సుజనా, జీవిఎల్, ఐవైఆర్ కైతే ప్రజా జీవితంతో సంబంధమే లేదు.

పురంధేశ్వరి కాంగ్రెస్ జమానాలో రెండుసార్లు గెలిచారు. మళ్ళీ గెలవలేదు. అంటే అప్పట్లో ఆమె గెలుపు పార్టీ గెలుపే కానీ ఆమె సొంతబలం కాదని తేలిపోయింది. వీర్రాజు ప్రజా జీవితం కూడా అంతంతమాత్రమే. ఇలాంటి నేతలను పెట్టుకుని బీజేపీ ఉపఎన్నికలో గెలిచేస్తుందంటే ఎవరైనా నమ్ముతారా ? అన్నదే ప్రశ్న. అయినా ప్రచార కమిటిని నియమించే ముందే అభ్యర్ధిని ప్రకటించాలని వీర్రాజుకు తెలీదా ?

This post was last modified on March 23, 2021 2:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అభిమానులను ఊరిస్తున్న ‘ఉస్తాద్’ తొలిప్రేమ

ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

49 minutes ago

రీల్ కోసం స్టంట్… ప్రాణం తీసిన తుపాకీ

ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…

2 hours ago

పిఠాపురానికి ప్ర‌త్యేకం.. ప‌వ‌న్ ఏం చేశారంటే ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయ‌ల‌పై ప‌ట్టు పెంచుకునే విధంగా కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన…

2 hours ago

దేవి కోసమే తమన్‌‌ రాలేదట

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…

4 hours ago

చివరి నిమిషం ఒత్తిడిలో దురంధర్ రివెంజ్

రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…

4 hours ago

స్వయంభు సౌండ్ చాలా పెంచాలి

ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…

4 hours ago