ఏపీలో ఇటీవల ముగిసిన పురపోరుకు సంబంధించి ఇప్పటికే పలు ఆరోపణలు.. విమర్శలు వార్తల రూపంలో రావటం తెలిసిందే. అయితే.. వీటన్నింటికి మించినట్లుగా ఉన్న ఒక ఉదంతం కాస్త ఆలస్యంగా వెలుగు చేసింది. వైరల్ గా మారిన ఈ ఉదంతం వైసీపీ నేతల తీరు ఎలా ఉందన్న విషయం అర్థమయ్యేలా చేయటమే కాదు.. ఇలాంటి వారి తీరు కారణంగా పార్టీని నష్టం వాటిల్లుతుందన్న ఆలోచనలో అధికారులు లేరంటున్నారు.
ఇంతకూ జరిగిందేమంటే.. శ్రీకాకుళం జిల్లా పలాసా మున్సిపల్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు బల్ల గిరిబాబు. ఆయన భార్య 24వ వార్డులో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన మున్సిపల్ ఛైర్మన్.. తన కింద పని చేసే వార్డు వాలంటీర్లకు.. సదరు వార్డులోని ఓటర్లకు ఎలాంటి పని చేయొద్దని చెప్పేశారు. అయితే.. ఈ విషయాలేవీ బయటకు రాలేదు.
ఇదే వార్డుకు చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తి తన కొడుకు ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో వాలంటీర్ సంతకం పెట్టకుండా అదే పనిగా తిప్పుతున్నారు. దీంతో విసిగిపోయిన అతను నేరుగా ఛైర్మన్ బల్లాకు ఫోన్ చేసి తన సమస్యను చెప్పుకొచ్చాడు. దీనికి స్పందించిన ఆ వైసీపీ నేత షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు.
‘మీ వార్డులో వాలంటీర్లను పని చేయొద్దని చెప్పా. నా మాట వినకుండా వాలంటీర్లు పనులు చేస్తే.. వారి ఉద్యోగాలు తీస్తానని తాను వార్నింగ్ ఇచ్చానన్న విషయాన్ని మా గొప్పగా చెప్పేసుకున్నారు. అయితే.. బాధితుడి ఫోన్లో కాల్ రికార్డు సెట్టింగ్ యాక్టివ్ గా ఉండటంతో.. తాను చేసిన తప్పును తానే బయటకు చెప్పేసుకున్నాడు. ఈ ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారి చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో ఎంత తన భార్యను ఓడిస్తే మాత్రం.. మున్సిపల్ ఛైర్మన్ ఈ రేంజ్ లో రివేంజ్ తీర్చుకోవటం సాకింగ్ గా మారింది.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…