జనసేన కన్ఫ్యూజన్ మామూలుగా లేదు. ఏ విషయంలో ఎలా వ్యవహరించాలి? స్టాండ్ ఏమిటన్న విషయంలో వారిలో స్పష్టత మిస్ అవుతోంది. ఈ తీరు ఆ పార్టీ ఇమేజ్ ను దెబ్బ తీయటమే కాదు..ప్రజల్లో చులకన చేసేలా చేస్తోంది. తాజా ఉదంతం కూడా దీనికి నిదర్శనం. ఓపక్క బీజేపీతో మిత్రత్వం.. ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలన్ని ఏపీకి వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే. అలాంటి పార్టీతో అంటకాగటంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిసినా.. కలిసి ప్రయాణించే తీరుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మిత్రపక్షంతో ఎలా వ్యవహరించాలన్న అంశంపై సరైన క్లారిటీ లేని ఆ పార్టీకి.. పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఏమ్మెల్యే డెవలప్ మెంట్ అంటూ అధికారపార్టీలోకి జంప్ కావటం తెలిసిందే. ఆ నేత విషయంలో ఎలా వ్యవహరించాలన్న విషయంపై ఏటూ తేల్చుకోలేకపోతోంది. ఓవైపు మాట కాదని వెళ్లిపోయిన రాపాకను లైట్ తీసుకోవాలని అనుకుంటూనే.. మరోవైపు పార్టీలోకి వచ్చే విషయం గురించి ఆలోచించుకోవాలని కోరటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
తాజాగా తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో బహిరంగ సభ జరిగింది. ఈ సభకు పార్టీలో పవన్ తర్వాత కనిపించే ఏకైక కీలక నేత నాదెండ్ల మనోహర్ హాజరై ప్రసంగించారు. యధావిధిగా జగన్ సర్కారుపై విమర్శలు చేసిన ఆయన.. రాపాక విషయాన్ని ప్రస్తావించారు. జనసేన నునంచి బయటకు ఎందుకు వెళ్లారో తమకు ఇప్పటికి అర్థం కాలేదన్న ఆయన.. ఏం ఆశించి వెళ్లారన్న ప్రశ్నను సంధించారు.
రాజోలు నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే కానీ.. ఇన్ ఛార్జ్ కానీ లేకున్నా.. జనసైనికులు తమ సత్తా చాటారన్నారు. ఎంతో నమ్మకంతో జనసైనికులు పని చేస్తే వారిని మోసం చేసి వెళ్లిపోయిన రాపాకకు అధికార పార్టీలో ఎలాంటి గౌరవం లభిస్తుందో తెలీయటం లేదన్నారు. రాపాకపై పవన్ కు ఎంతో గౌరవం ఉందని.. మరోసారి ఆలోచించి జనసేనలోకి రావాలని కోరారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతను వదిలేయాల్సింది పోయి.. మళ్లీ వచ్చేందుకు ఆలోచించుకోవాలని పిలవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
ఓవైపు వేదిక మీద నుంచి రాపాకను పార్టీలోకి రావాలని నాదెండ్ల మనోహర్ కోరితే.. ఇంకోపక్క ఇదే సభలో ‘బహిరంగ సభకు రాపాకకు ప్రవేశం లేదు’ అంటూ మీ పల్లకి మోసిన రాజోలు జనసైనికులు అంటూ ఫ్లెక్సీలు కనిపించాయి. అంతేకాదు.. నో ఎంట్రీ అన్న గుర్తులు ఫ్లెక్సీలో స్పష్టంగా ముద్రించారు. ఓవైపు ప్రవేశం లేదంటూ ఫ్లెక్సీలు పెట్టి.. మరోవైపు రాపాక మళ్లీ వచ్చే విషయం మీద ఆలోచించుకోవాలనే పిలుపు చూస్తే.. ఇంతటి కన్ఫ్యూజన్ జనసేన పార్టీలో తప్పించి మరే పార్టీలో ఉండదన్న భావన కలుగక మానదు.
This post was last modified on March 23, 2021 12:58 pm
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…