Political News

చిన్నారెడ్డి సంచలనం.. ఎన్నికల్లో పోటీ చేయరట

హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చిన్నారెడ్డి.. అనుకున్న దాని కంటే దారుణంగా ఓటమిపాలయ్యారు. ఆయనకు వచ్చిన ఓట్లు కూడా చాలా తక్కువగా పోల్ అయ్యాయి. 93 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. నాలుగో స్థానంలో ఆయన నిలిచారు.

నీతిగా.. నిజాయితీగా.. మచ్చలేని రాజకీయ నాయకుడిగా ఆయనకు పేరుంది. అలాంటి ఆయన చిత్తుచిత్తుగా ఓడిపోయిన వైనం ఆయనకే అర్థం కావట్లేదు.
ఓటమి కన్ఫర్మ్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన చిన్నారెడ్డి.. సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇకపై తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పేశారు.గతంలో మాదిరి పరిస్థితులు లేవని.. తాను పాతతరం నాయకుడ్ని అని చెప్పుకున్న ఆయన.. ఇప్పుడు ఎన్నికల తీరు పూర్తిగా మారిపోయిందన్నారు.

తనలా వ్యవహరించే జానారెడ్డికి మారిన పరిస్థితుల గురించి ముందే చెబుతానని.. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతానన్నారు. తన తాజా ఎన్నికల అనుభవాన్ని జానారెడ్డితో పంచుకుంటానని చెప్పిన ఆయన.. పట్టభద్రులు సైతం ఓటును రూ.2వేలకు అమ్ముకోవటం బాధ కలిగించినట్లు చెప్పారు.

ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని యువత ఎంతో ఆశపడ్డారని.. ఖాళీగా ఉన్న 1.91లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయలేదని.. ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల్ని కూడా ప్రభుత్వం భర్తీ చేయలేదని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి 26 నెలలు అయినా ఇప్పటివరకు వాస్తవరూపం దాల్చలేదన్నారు.

అయినప్పటికీ యువత.. పట్టభద్రుల ఓటర్లు మరిచిఓటువేయటం బాధ కలిగించిందన్నారు. డబ్బుతోనూ.. .మద్యంతోనూ ఓటర్లను మభ్యపెట్టే తీరును ప్రదర్శిస్తారని.. అలాంటి ధోరణి మారాలన్న అభిలాషను వ్యక్తం చేశారు. చిన్నారెడ్డి మారాలే కానీ.. ఇప్పటికే మారిన పరిస్థితులు మారే అవకావమే లేదన్న చేదు నిజాన్ని ఈ సీనియర్ కాంగ్రెస్ నేత గుర్తిస్తే మంచిది.

This post was last modified on March 21, 2021 2:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్టాలిన్ కు ఇచ్చి పడేసిన పవన్

జనసేన ఆవిర్భావ సభా వేదిక మీద నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా విషయాలను ప్రస్తావించారు. కొన్ని…

5 hours ago

ఛావాకు రెండో బ్రేక్ పడింది

మూడు వారాలు ఆలస్యంగా విడుదలైనా మంచి వసూళ్లతో తెలుగు వెర్షన్ బోణీ మొదలుపెట్టిన ఛావాకు వసూళ్లు బాగానే నమోదవుతున్నా ఏదో…

6 hours ago

ఖైదీ 2 ఎప్పుడు రావొచ్చంటే

సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో…

6 hours ago

దాశరథి, గద్దర్, శ్రీపతి రాములు.. ఎందరెందరో..?

జనసేన ఆవిర్భావ వేడుకల్లో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆ పార్టీ అదినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… తనను…

7 hours ago

భయం లేదు కాబట్టే… బద్దలు కొట్టాం: పవన్ కల్యాణ్

భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…

8 hours ago

11వ ఆవిర్భావం పూర్తి.. 11 స్థానాల‌కు ప‌రిమితం!: ప‌వ‌న్ కల్యాణ్‌

భార‌త దేశానికి బ‌హుభాషే మంచిద‌ని జ‌న‌సేన అధినేత, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జ‌రిగిన…

8 hours ago