Political News

రెండో రాజ‌ధానిగా తిరుప‌తి.. చింతా వ్యాఖ్య‌ల‌తో వైసీపీ సెగ‌!

తిరుప‌తి ఎన్నిక‌ల వేళ‌.. వైసీపీలో సెగ పుడుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ గెలుపుతమ‌దేన‌ని.. దేశం మొత్తం తిరుప‌తి వైపు చూసేలా మెజారిటీ ద‌క్కించుకోవాల‌ని.. వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌న పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేసి 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క పోవ‌డంతో తిరుప‌తి వైసీపీలో క‌ల‌క‌లం రేగింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతా మోహ‌న్ చేసిన వ్యాఖ్య‌లే. తిరుప‌తిని రెండో రాజ‌ధానిగా ప్ర‌క‌టించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగినా.. రాయ‌ల‌సీమ‌కు ప్ర‌త్యేక గుర్తింపు లేకుండా పోయింద‌న్న ఆయ‌న‌.. తిరుప‌తిని రెండో రాజ‌ధానిగా మార్చాల‌న్నారు.

వాస్త‌వానికి ఈ డిమాండ్ ఇప్ప‌టిది కాద‌ని చెప్పిన చింతా.. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలోనే తాను ఈ ప్ర‌తిపాద ‌న చేశాన‌ని. దీనికి అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌సింగ్ కూడా ఓకే చెప్పార‌ని.. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను తాను అప్ప‌ట్లోనే ప్ర‌ధానికి అందించాన‌ని.. అయితే.. త‌ర్వాత ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ ప్ర‌తిపాద‌న మ‌రు గున ప‌డిపోయింద‌న్నారు. ఇప్పుడు తిరుప‌తి ఉప ఎన్నిక జ‌రుగుతున్న నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ దీనిపై క్లా రిటీ ఇవ్వాల‌ని.. డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. తాను ఈ నినాదాన్ని తిరుప‌తి పార్ల‌మెంటు ప‌రిధిలోని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్తాన‌ని చెప్పారు.

ప్ర‌స్తుతం చింతా వ్యాఖ్య‌లు తిరుప‌తి రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌భావం చూపుతాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కు లు. రెండో రాజ‌ధాని విష‌యంపై ఇక్క‌డి ప్ర‌జ‌లు కూడా ఆస‌క్తిగా ఉన్నార‌ని చింతా చెప్ప‌డం.. గెలుపు ఏక‌ప‌క్షం అవుతుంద‌ని వైసీపీ నాయ‌కులు అంచ‌నావేసుకోవ‌డం వంటి నేప‌థ్యంలో రాజ‌ధాని సెంటిమెంటు క‌నుక వ‌ర్క‌వుట్ అయితే.. వైసీపీకి ఇబ్బందిక‌ర ప‌రిణామాలు ఎదురు కావ‌డం త‌థ్య‌మ‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి ఇక్క‌డ వైసీపీ చేసిన అభివృద్ధి కూడా ఏమీలేదు.

నేత‌లు ఉన్న‌ప్ప‌టికీ.. ఒక రోడ్డు కూడా వేయ‌లేదు. ప్ర‌తిప‌క్షాల మాట‌గా చెప్పాలంటే.. ఒక త‌ట్ట మ‌ట్టి కూడా తీయ‌లేదు. దీనిని బ‌ట్టి.. తిరుప‌తి ప్ర‌జ‌ల్లో ఇప్పుడు ఈ అంస‌తృప్తికితోడు.. రెండో రాజ‌ధాని విష‌యం క‌నుక రాజుకుంటే.. వైసీపీకి ఆశించిన విధంగా విజ‌యం ద‌క్క‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on March 21, 2021 1:44 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

55 minutes ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

2 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

3 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

3 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

4 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

6 hours ago