Political News

రెండో రాజ‌ధానిగా తిరుప‌తి.. చింతా వ్యాఖ్య‌ల‌తో వైసీపీ సెగ‌!

తిరుప‌తి ఎన్నిక‌ల వేళ‌.. వైసీపీలో సెగ పుడుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ గెలుపుతమ‌దేన‌ని.. దేశం మొత్తం తిరుప‌తి వైపు చూసేలా మెజారిటీ ద‌క్కించుకోవాల‌ని.. వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌న పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేసి 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క పోవ‌డంతో తిరుప‌తి వైసీపీలో క‌ల‌క‌లం రేగింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతా మోహ‌న్ చేసిన వ్యాఖ్య‌లే. తిరుప‌తిని రెండో రాజ‌ధానిగా ప్ర‌క‌టించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగినా.. రాయ‌ల‌సీమ‌కు ప్ర‌త్యేక గుర్తింపు లేకుండా పోయింద‌న్న ఆయ‌న‌.. తిరుప‌తిని రెండో రాజ‌ధానిగా మార్చాల‌న్నారు.

వాస్త‌వానికి ఈ డిమాండ్ ఇప్ప‌టిది కాద‌ని చెప్పిన చింతా.. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలోనే తాను ఈ ప్ర‌తిపాద ‌న చేశాన‌ని. దీనికి అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌సింగ్ కూడా ఓకే చెప్పార‌ని.. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను తాను అప్ప‌ట్లోనే ప్ర‌ధానికి అందించాన‌ని.. అయితే.. త‌ర్వాత ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ ప్ర‌తిపాద‌న మ‌రు గున ప‌డిపోయింద‌న్నారు. ఇప్పుడు తిరుప‌తి ఉప ఎన్నిక జ‌రుగుతున్న నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ దీనిపై క్లా రిటీ ఇవ్వాల‌ని.. డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. తాను ఈ నినాదాన్ని తిరుప‌తి పార్ల‌మెంటు ప‌రిధిలోని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్తాన‌ని చెప్పారు.

ప్ర‌స్తుతం చింతా వ్యాఖ్య‌లు తిరుప‌తి రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌భావం చూపుతాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కు లు. రెండో రాజ‌ధాని విష‌యంపై ఇక్క‌డి ప్ర‌జ‌లు కూడా ఆస‌క్తిగా ఉన్నార‌ని చింతా చెప్ప‌డం.. గెలుపు ఏక‌ప‌క్షం అవుతుంద‌ని వైసీపీ నాయ‌కులు అంచ‌నావేసుకోవ‌డం వంటి నేప‌థ్యంలో రాజ‌ధాని సెంటిమెంటు క‌నుక వ‌ర్క‌వుట్ అయితే.. వైసీపీకి ఇబ్బందిక‌ర ప‌రిణామాలు ఎదురు కావ‌డం త‌థ్య‌మ‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి ఇక్క‌డ వైసీపీ చేసిన అభివృద్ధి కూడా ఏమీలేదు.

నేత‌లు ఉన్న‌ప్ప‌టికీ.. ఒక రోడ్డు కూడా వేయ‌లేదు. ప్ర‌తిప‌క్షాల మాట‌గా చెప్పాలంటే.. ఒక త‌ట్ట మ‌ట్టి కూడా తీయ‌లేదు. దీనిని బ‌ట్టి.. తిరుప‌తి ప్ర‌జ‌ల్లో ఇప్పుడు ఈ అంస‌తృప్తికితోడు.. రెండో రాజ‌ధాని విష‌యం క‌నుక రాజుకుంటే.. వైసీపీకి ఆశించిన విధంగా విజ‌యం ద‌క్క‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

45 minutes ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

48 minutes ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

3 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

5 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

6 hours ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

6 hours ago