పంచాయితీ ఎన్నికలు తమకు పూర్తి పాజిటివ్ గా మారి.. పురపోరులో అదరగొట్టే ఫలితాల్ని సొంతం చేసుకున్న వేళ.. ఏపీ అధికారపక్షం మాంచి జోష్ లో ఉంది. ఎన్నికలకు ముందు ఉన్న అనుమానాలు.. సందేహాలన్ని ఉత్తవేనని తేలిపోవటమే కాదు.. తమ ఎన్నికల వ్యూహాలు పక్కాగా వర్కువుట్ కావటంపై అధికార పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంతోషంలో ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా తన కొత్త కోరికను ఆయన బయటపెట్టారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఎం. గురుమూర్తిని పార్టీ నేతలకు పరిచయం చేసిన ఆయన..తిరుపతి ఉప ఎన్నిక ఫలితం దేశం మొత్తం తిరుపతి వైపు చూసేలా చేయాలన్న అభిలాషనను వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక సందర్భంగా పార్లమెంటు పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మంత్రి ఇంచార్జ్ గా ఉంటారని.. ఒక ఎమ్మెల్యే అదనంగా పని చేస్తారని చెప్పారు.
ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి చెప్పటం.. ప్రజాబలం తమకు ఉందన్న విషయాన్ని తాజా ఎన్నికతో మరోసారి రుజువు చేయాలన్నారు. అభ్యర్థి గురుమూర్తిని మంచి మెజార్టీతో తెలిపించాలని కోరారు. ప్రతి ఓటర్ కు జరిగిన మంచిని గుర్తు చేసి.. వారి దీవెనలు.. ఆశీస్సులు కావాలని కోరమని చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వచ్చే మెజార్టీ ఒక మెసేజ్ లా ఉండి.. అందరూ ఈ ఫలితం గురించి మాట్లాడేలా ఉండాలని చెప్పటం గమనార్హం.
తాజాగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని చూస్తే.. ఇటీవల జరిగిన తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి దివంగత పర్ధాని పీవీ కుమార్తెను అభ్యర్థిగా బరిలోకిదింపిన వేళలో.. పార్టీకి చెందిన పలువురు నేతల్ని తన ఇంటికి పిలిచిన సీఎం కేసీఆర్.. ప్రత్యేకంగా పరిచయం చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి వివరించారు. తాజాగా సీఎం జగన్ నిర్వహించిన భేటీని చూస్తే.. తిరుపతి ఉప ఎన్నికల వేళ.. తెలంగాణ ముఖ్యమంత్రి వ్యూహాన్ని పాలో అయినట్లుగా కనిపించక మానదు.
This post was last modified on March 21, 2021 8:45 am
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…