Political News

తిరుపతి ఉప ఎన్నిక వేళ.. కేసీఆర్ ను ఫాలో అయిన జగన్


పంచాయితీ ఎన్నికలు తమకు పూర్తి పాజిటివ్ గా మారి.. పురపోరులో అదరగొట్టే ఫలితాల్ని సొంతం చేసుకున్న వేళ.. ఏపీ అధికారపక్షం మాంచి జోష్ లో ఉంది. ఎన్నికలకు ముందు ఉన్న అనుమానాలు.. సందేహాలన్ని ఉత్తవేనని తేలిపోవటమే కాదు.. తమ ఎన్నికల వ్యూహాలు పక్కాగా వర్కువుట్ కావటంపై అధికార పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంతోషంలో ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా తన కొత్త కోరికను ఆయన బయటపెట్టారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఎం. గురుమూర్తిని పార్టీ నేతలకు పరిచయం చేసిన ఆయన..తిరుపతి ఉప ఎన్నిక ఫలితం దేశం మొత్తం తిరుపతి వైపు చూసేలా చేయాలన్న అభిలాషనను వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక సందర్భంగా పార్లమెంటు పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మంత్రి ఇంచార్జ్ గా ఉంటారని.. ఒక ఎమ్మెల్యే అదనంగా పని చేస్తారని చెప్పారు.

ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి చెప్పటం.. ప్రజాబలం తమకు ఉందన్న విషయాన్ని తాజా ఎన్నికతో మరోసారి రుజువు చేయాలన్నారు. అభ్యర్థి గురుమూర్తిని మంచి మెజార్టీతో తెలిపించాలని కోరారు. ప్రతి ఓటర్ కు జరిగిన మంచిని గుర్తు చేసి.. వారి దీవెనలు.. ఆశీస్సులు కావాలని కోరమని చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వచ్చే మెజార్టీ ఒక మెసేజ్ లా ఉండి.. అందరూ ఈ ఫలితం గురించి మాట్లాడేలా ఉండాలని చెప్పటం గమనార్హం.

తాజాగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని చూస్తే.. ఇటీవల జరిగిన తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి దివంగత పర్ధాని పీవీ కుమార్తెను అభ్యర్థిగా బరిలోకిదింపిన వేళలో.. పార్టీకి చెందిన పలువురు నేతల్ని తన ఇంటికి పిలిచిన సీఎం కేసీఆర్.. ప్రత్యేకంగా పరిచయం చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి వివరించారు. తాజాగా సీఎం జగన్ నిర్వహించిన భేటీని చూస్తే.. తిరుపతి ఉప ఎన్నికల వేళ.. తెలంగాణ ముఖ్యమంత్రి వ్యూహాన్ని పాలో అయినట్లుగా కనిపించక మానదు.

This post was last modified on March 21, 2021 8:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అభిమానులను ఊరిస్తున్న ‘ఉస్తాద్’ తొలిప్రేమ

ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

54 minutes ago

రీల్ కోసం స్టంట్… ప్రాణం తీసిన తుపాకీ

ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…

2 hours ago

పిఠాపురానికి ప్ర‌త్యేకం.. ప‌వ‌న్ ఏం చేశారంటే ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయ‌ల‌పై ప‌ట్టు పెంచుకునే విధంగా కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన…

3 hours ago

దేవి కోసమే తమన్‌‌ రాలేదట

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…

4 hours ago

చివరి నిమిషం ఒత్తిడిలో దురంధర్ రివెంజ్

రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…

4 hours ago

స్వయంభు సౌండ్ చాలా పెంచాలి

ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…

4 hours ago