వ్యక్తులు.. సంస్థల ఆదాయం.. ఆస్తుల గురించిన సమాచారం ఎప్పుడూ ఆస్తికరంగానే ఉంటుంది. మరి.. రాజకీయ పార్టీల సంగతి? ఎప్పుడూ కాదు కానీ అప్పుడప్పుడే ఈ వివరాలు వెల్లడవుతుంటాయి. ఇందులో నిజానిజాల సంగతి పక్కన పెడితే.. రికార్డుల్లో.. అధికారికంగా విడుదల చేసిన వివరాలు కావటంతో చర్చించుకోవటంలో అర్థముంది.
దేశంలోని రాజకీయ పార్టీలకు కొదవ లేదు. వందల్లో ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే.. ప్రాంతీయ పార్టీల్లో సంపన్న పార్టీల జాబితాను విడుదల చేసిందో సంస్థ. ఆసక్తికరంగా మారిన ఆ వివరాల్ని చూస్తే..
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. విపక్షంలో ఉన్న టీడీపీ.. దేశంలోని సంపన్న పార్టీల్లో ఒకటిగా నిలవటం ఆసక్తికరంగా మారింది. టాప్ ఫైవ్ సంపన్న పార్టీల విషయానికి వస్తే.. ఇందులో అధికార పార్టీలతో పోలిస్తే విపక్షంలో ఉన్న రెండు పార్టీల ఆస్తులు భారీగా ఉన్నట్లుగా వెల్లడైంది. ది అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం చూస్తే.. తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగుదేశం పార్టీ దేశంలో నాలుగో సంపన్న పార్టీగా తేలింది.
దేశంలోని పార్టీల్లో అత్యంత ధనిక పార్టీగా విపక్షంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీగా లెక్క తేల్చారు. ఈ పార్టీకి రూ.572 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా వెల్లడించారు. రెండో స్థానంలో ఒడిశా అధికారపక్షమైన బీజేపీ రూ.232 కోట్లతో నిలిచింది. మూడ్ో స్థానంలో తమిళనాడు అధికారపక్షమైన అన్నాడీఎంకే నిలిచింది. ఆ పార్టీకి రూ.206 కోట్ల ఆస్తులు ఉన్నాయి. నాలుగో స్థానంలో ఏపీ విపక్షం టీడీపీ రూ.115 కోట్లతో నిలిచింది.
ఆరో స్థానంలో తెలంగాణ అధికారపక్షం టీఆర్ఎస్ రూ.152 కోట్ల ఆస్తులు.. ఏపీ అధికారపక్షం వైసీపీకి రూ.79 కోట్ల ఫిక్సెస్ డిపాజిట్లు ఉన్నట్లుగా తేలింది. ఇదిలా ఉంటే.. తమకు 2018-19 సంవత్సరానికి రూ.18 కోట్ల అప్పులు ఉన్నట్లుగా టీడీపీ వెల్లడించింది. జేడీఎస్ కూడా ఇదే రీతిలో అప్పులు ఉన్నట్లుగా చెప్పాయి. జాతీయ పార్టీల విషయానికి వస్తే బీజేపీ రూ.2904 కోట్ల ఆస్తుల్ని ప్రకటిస్తే.. కాంగ్రెస్ రూ.928 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా వెల్లడించింది.
This post was last modified on March 20, 2021 3:21 pm
రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…
నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…
టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…