Political News

ముహూర్తం ఫిక్స్ చేసిన జగన్

తిరుపతి ఉపఎన్నికలో ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈనెల 25వ తేదీనుండి అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి గెలుపుకు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, నేతలంతా ప్రచారంలోకి దిగాలంటూ దిశానిర్దేశం చేశారు. మొన్నటి ఎన్నికలో దివంగత ఎంపి బల్లి దుర్గాప్రసాదరావుకు వచ్చిన మెజారిటి 2.28 లక్షలు. అప్పటి మెజారిటికి మించి రాబోయే ఎన్నికల్లో రావాలని స్పష్టం చేశారు. అంటే ప్రచారంలో లేదుకానీ సుమారు 5 లక్షల మెజారిటి తగ్గకూడదని జగన్ గట్టిగా చెప్పారని సమాచారం.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మంత్రి+ఒక బయటప్రాంతం ఎంఎల్ఏ బాధ్యులుగా ఉంటారని జగన్ చెప్పారు. స్ధానిక ఎంఎల్ఏకి అదనంగా పై ఇద్దరు పర్యవేక్షకులుగా ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఎన్నికలు అయిపోయేంత వరకు తమకు అప్పగించిన నియోజకవర్గాల్లోనే ఉండాలని కూడా స్పష్టంగా చెప్పారు. వెంటనే రంగంలోకి దిగేయాలని మంత్రులకు జగన్ ఆదేశాలు కూడా ఇచ్చేశారు.

తిరుపతికి పేర్నినాని, శ్రీకాళహస్తికి కన్నబాబు, సత్యవేడుకు కొడాలి నాని, గూడూరుకు అనీల్ కుమార్, సూళ్ళూరుపేట మేకపాటి గౌతమ్ రెడ్డి, వెంకటగిరి బాలినేని శ్రీనివాసరెడ్డి, సర్వేపల్లి ఆదిమూలపు సురేష్ బాధ్యులుగా నియమితులయ్యారు. వీరికి అదనంగా స్ధానికంగా ఉండే ఎంఎల్ఏలు ఎటూ ఉంటారు. కాబట్టి ప్రచారం, ఎలక్షనీరింగ్ చాలా పక్కగా ఉండాలన్నారు. పంచాయితి, మున్సిపాలిటిల్లో వైసీపీ అఖండ విజయం సాధించిందనే ఏమరుపాటు వద్దని గట్టిగానే హెచ్చరించారు. దీంతోనే తిరుపతి ఉపఎన్నికను జగన్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్ధమైపోతోంది.

మొత్తానికి ఇటు వైసీపీ అటు టీడీపీలు గెలుపుకోసం పార్టీల తరపున కమిటీలను వేసుకుని రంగంలోకి దాదాపు దిగేసినట్లే. వైసీపీ తరపున డాక్టర్ ప్రచారంలోకి దిగేశారు. ఇక టీడీపీ తరపున పనబాక ఎప్పటినుండి ప్రచారంలోకి దిగుతారో చూడాలి. ఎందుకంటే చంద్రబాబునాయుడు ఎంతచెప్పినా పనబాక అభ్యర్ధిత్వంపై ఇంకా పార్టీలోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక బీజేపీ తరపున పోటీచేసేది ఎవరో తేలలేదు. కాంగ్రెస్, వామపక్షాలను ఎవరు పట్టించుకోవటం లేదు.

This post was last modified on March 20, 2021 1:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

1 hour ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

2 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

9 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago