Political News

ముహూర్తం ఫిక్స్ చేసిన జగన్

తిరుపతి ఉపఎన్నికలో ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈనెల 25వ తేదీనుండి అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి గెలుపుకు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, నేతలంతా ప్రచారంలోకి దిగాలంటూ దిశానిర్దేశం చేశారు. మొన్నటి ఎన్నికలో దివంగత ఎంపి బల్లి దుర్గాప్రసాదరావుకు వచ్చిన మెజారిటి 2.28 లక్షలు. అప్పటి మెజారిటికి మించి రాబోయే ఎన్నికల్లో రావాలని స్పష్టం చేశారు. అంటే ప్రచారంలో లేదుకానీ సుమారు 5 లక్షల మెజారిటి తగ్గకూడదని జగన్ గట్టిగా చెప్పారని సమాచారం.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మంత్రి+ఒక బయటప్రాంతం ఎంఎల్ఏ బాధ్యులుగా ఉంటారని జగన్ చెప్పారు. స్ధానిక ఎంఎల్ఏకి అదనంగా పై ఇద్దరు పర్యవేక్షకులుగా ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఎన్నికలు అయిపోయేంత వరకు తమకు అప్పగించిన నియోజకవర్గాల్లోనే ఉండాలని కూడా స్పష్టంగా చెప్పారు. వెంటనే రంగంలోకి దిగేయాలని మంత్రులకు జగన్ ఆదేశాలు కూడా ఇచ్చేశారు.

తిరుపతికి పేర్నినాని, శ్రీకాళహస్తికి కన్నబాబు, సత్యవేడుకు కొడాలి నాని, గూడూరుకు అనీల్ కుమార్, సూళ్ళూరుపేట మేకపాటి గౌతమ్ రెడ్డి, వెంకటగిరి బాలినేని శ్రీనివాసరెడ్డి, సర్వేపల్లి ఆదిమూలపు సురేష్ బాధ్యులుగా నియమితులయ్యారు. వీరికి అదనంగా స్ధానికంగా ఉండే ఎంఎల్ఏలు ఎటూ ఉంటారు. కాబట్టి ప్రచారం, ఎలక్షనీరింగ్ చాలా పక్కగా ఉండాలన్నారు. పంచాయితి, మున్సిపాలిటిల్లో వైసీపీ అఖండ విజయం సాధించిందనే ఏమరుపాటు వద్దని గట్టిగానే హెచ్చరించారు. దీంతోనే తిరుపతి ఉపఎన్నికను జగన్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్ధమైపోతోంది.

మొత్తానికి ఇటు వైసీపీ అటు టీడీపీలు గెలుపుకోసం పార్టీల తరపున కమిటీలను వేసుకుని రంగంలోకి దాదాపు దిగేసినట్లే. వైసీపీ తరపున డాక్టర్ ప్రచారంలోకి దిగేశారు. ఇక టీడీపీ తరపున పనబాక ఎప్పటినుండి ప్రచారంలోకి దిగుతారో చూడాలి. ఎందుకంటే చంద్రబాబునాయుడు ఎంతచెప్పినా పనబాక అభ్యర్ధిత్వంపై ఇంకా పార్టీలోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక బీజేపీ తరపున పోటీచేసేది ఎవరో తేలలేదు. కాంగ్రెస్, వామపక్షాలను ఎవరు పట్టించుకోవటం లేదు.

This post was last modified on March 20, 2021 1:44 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

26 mins ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

1 hour ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

2 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

3 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

3 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

4 hours ago