తెలంగాణలో రాజకీయాల్లో కొద్ది రోజులుగా ఎమ్మెల్యేల జంపింగ్లకు బ్రేక్ పడింది. అయితే కాస్త లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ జంపింగ్ల పర్వం ప్రారంభం కానుందా ? అంటే అవుననే చర్చలు మొదలయ్యాయి. తెలంగాణకు మరో విపక్ష పార్టీ ఎమ్మెల్యే కారెక్కేందుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మిగిలిన ఒకే ఒక ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు. గత సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట సీట్లే ఆ పార్టీ గెలుచుకుంది. ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పార్టీ మారిపోయారు. ఇక అశ్వారావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావుపై టీఆర్ఎస్ అధిష్టానం ఎన్ని ఒత్తిళ్లు చేసినా ఆయన మాత్రం పార్టీ మారలేదు.
తాను మాత్రం ఎప్పటకీ టీడీపీలోనే ఉంటానని కూడా నాగేశ్వరరావు చెప్పారు. పరిస్థితులు ఎప్పటకీ ఒకేలా ఉండవుగా… అవసరాలు రాజకీయ నాయకులను ఎంత పని అయినా చేయిస్తాయి. నిన్నటి వరకు పార్టీ మారనని చెప్పినోళ్లు కూడా మరుసటి రోజే కండువాలు మార్చేయడం సహజం. తాజాగా ఇప్పుడు మచ్చా కూడా కారెక్కేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఆయన నేరుగా సీఎం కేసీఆర్తోనే టచ్లో ఉంటూ వస్తున్నారు. అశ్వారావుపేటలో వైసీపీకి కూడా సరైన నాయకత్వం లేదు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు విషయంలో కేసీఆర్ సానుకూలంగా లేరు.
ఇక గతంలో మచ్చా నాగేశ్వరరరావుతో ఉన్న పరిచయాల నేపథ్యంలో ఆయన్ను పార్టీలోకి లాగసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇటు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా మచ్చాతో చర్చలు జరుపుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా మచ్చా అసెంబ్లీ హాల్లోనే సీఎం కేసీఆర్తో సుధీర్ఘంగా మంతనాలు జరపడం విశేషం. కేసీఆర్ సీట్లోనే ఆయన పక్కనూ కూర్చొన్న నాగేశ్వరరావు చెప్పిన మాటలన్నీ ఆయన సావధానంగా వింటూ ఉండడంతో పక్కనే ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఆయన మన పార్టీలోకి వచ్చేస్తున్నాడంటూ గుసగుసలాడుకున్నారు.
అయితే మచ్చా మాత్రం కేసీఆర్ను కలిశాక.. తాను తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే కేసీఆర్తో మాట్లాడానని.. తన నియోజకవర్గంలో ఉన్న మూడు సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని కోరినట్టు చెపుతున్నారు. అయితే ఇటు ఖమ్మం జిల్లాలో… అటు గులాబీ వర్గాల్లో మాత్రం ఆయన పార్టీ మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. మచ్చా టీడీపీలో ఉండి కూడా చేసేదేం లేకుండా పోతోంది. ఇప్పటికే రెండున్నరేళ్ల పాటు టీడీపీలో ఒంటరి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఇక పార్టీ వీడేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారనే తెలుస్తోంది.
టాలీవుడ్లో బాగా ఔట్ స్పోకెన్ అని పేరున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సోషల్ మీడియాలో ఆయనకున్న పాపులారిటీనే వేరు. ప్రస్తుతం…
స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో నటించినపుడు వారి ఇమేజ్కు తగ్గ పాత్రలు లేకపోతే.. అభిమానులు ఫీలవడం…
ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి.…
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…